Breaking News

ప్రేమజంటను మూడు రాష్ట్రాలను తిప్పి.. ముప్పుతిప్పలు పెట్టి..

Published on Fri, 09/17/2021 - 18:58

భోపాల్‌: ఇద్దరు ప్రేమికులు తమ వివాహానికి కుటుంబసభ్యులను ఒప్పించలేకపోయారు. దీంతో పారిపోయి ఒకచోట ఉండగా గమనించిన కుటుంబసభ్యులు వారిని కిడ్నాప్‌నకు పాల్పడి మూడు రాష్ట్రాలు తిప్పుతూ అతి దారుణంగా హత్యకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మృతదేహాలతో క్రూరంగా ప్రవర్తించారు. ఇంతకీ వారిని హత్య చేసింది అమ్మాయి కుటుంబసభ్యులే. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
చదవండి: విద్యార్థినికి ఘోర అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా? 

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లా జహంగీర్‌పూర్‌కు చెందిన యువతీయువకులు ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయం కుటుంబసభ్యులకు చెప్పి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారికి చెప్పడంలో విఫలమయ్యారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరని భావించి ఇంట్లో నుంచి జూలై 31వ తేదీన పారిపోయారు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు వారిపై ఆగ్రహంగా ఉన్నారు. వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గాలిస్తున్న క్రమంలో వారు ఢిల్లీలో ఉంటున్నారని తెలుసుకుని వెళ్లారు. అక్కడి ఆ కొత్త జంటను జీపులో కిడ్నాప్‌ చేశారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు సమీపంలోని బింధ్‌ ప్రాంతానికి తీసుకొచ్చి యువకుడిని దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహంపై కత్తులతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన అత్రీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.
చదవండి: రాజు ఆత్మహత్యపై విచారణ: 4 వారాలు గడువిచ్చిన హైకోర్టు 

అమ్మాయిను హతమార్చి మృతదేహాన్ని రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో పడేశారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 5వ తేదీన గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే అమ్మాయి, అబ్బాయి మృతిపై ఏదో సంబంధం ఉందని పోలీసులు భావించారు. విచారణ చేపట్టగా పై విషయం వెలుగులోకి వచ్చింది. పోలీస్‌ సిగ్నల్‌ ఆధారంగా అమ్మాయి కుటుంబసభ్యులే ఈ దారుణానికి పాల్పడ్డట్లు గుర్తించారు. కుటుంబసభ్యులను విచారించగా నేరం అంగీకరించారు. వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)