Breaking News

క్రిస్మస్‌ తర్వాత శాంటాక్లాజ్‌ ర్యాలీ 

Published on Tue, 12/27/2022 - 06:56

ముంబై: క్రిస్మస్‌ పండుగ తర్వాత రోజు స్టాక్‌ మార్కెట్లో శాంటాక్లాజ్‌ ర్యాలీ కనిపించింది. కోవిడ్‌ భయాలతో గతవారం అమ్మకాల ఒత్తిడికి లోనైన దేశీయ మార్కెట్‌ సోమవారం భారీ లాభాలను ఆర్జించింది. ఇటీవల మార్కెట్‌ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు డిమాండ్‌ లభించింది. అధిక వెయిటేజీ ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్‌ షేర్లు ఒకటిన్నర శాతం రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు ట్రేడింగ్‌పై పెద్దగా ప్రభావాన్ని చూపలేదు.

ఉదయం సెన్సెక్స్‌ 90 పాయింట్ల స్వల్ప నష్టంతో 59,845 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల పతనంతో 17,830 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ప్రతికూలాంశాలేవీ లేకపోవడంతో సూచీలు స్థిరంగా ముందుకు కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 989 పాయింట్లు దూసుకెళ్లి 60,834 వద్ద, నిఫ్టీ 277 పాయింట్లు బలపడి 18,084 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ఆఖర్లో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరికి సెన్సెక్స్‌ 721 పాయింట్ల లాభంతో 60,566 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 208 పాయింట్లు పెరిగి 18,015 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ సూచీలో 30 షేర్లలో ఐదు మాత్రమే నష్టపోయాయి.

దీంతో స్టాక్‌ సూచీల నాలుగురోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కాయి. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు రాణించాయి. ముఖ్యంగా ఫైనాన్స్, ఇంధన, ఐటీ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. విస్తృత స్థాయిలో మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లు భారీ డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు వరుసగా 3.13%, 2.31 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.498 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1286 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఆసియా అరశాతం చొప్పున లాభపడ్డాయి. డాలర్‌ మార్కెట్లో రూపాయి విలువ 17 పైసలు బలపడి 82.65 స్థాయి వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ ఒకశాతానికి పైగా ర్యాలీ చేయడంతో స్టాక్‌ మార్కెట్లో రూ. 5.79 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం విలువ రూ.277.91 లక్షల కోట్లకు చేరింది.

రాయ్‌ దంపతులు ఎన్‌డీటీవీలోని తమ వాటాను అదానీకి విక్రయించనుండటంతో 5% బలపడి రూ. 358 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన ఎన్‌డీటీవీ, చివరికి 1% లాభంతో రూ.343 వద్ద స్థిరపడింది. 

Videos

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)