సికింద్రాబాద్‌లో డబుల్ మర్డర్ | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌లో డబుల్ మర్డర్

Published Thu, Nov 14 2013 6:50 AM

వేధిస్తున్నారంటూ ఓ భర్త తన భార్యను, అత్తను నరికి హత్య చేశాడు. ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిదిలో దారుణం జరిగింది. బెంగళూరుకు చెందిన పద్మప్రియకు శర్వానంద్‌కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యా- భర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. పద్మప్రియకు అంతకు ముందే వివాహం జరిగింది. అయితే ఆ విషయం శర్వానంద్కు చెప్పలేదు. ఆ విషయం తెలిసి అతను వేరుగా ఉంటున్నాడు. పద్మప్రియ, ఆమె తల్లి పరమేశ్వరి శర్వానంద్‌తో తరచూ గొడవపడుతుండటంతో వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా వారు వేదిస్తుండటంతో విసిగివేసారిన శర్వానంద్‌ భార్యను, అత్తను నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు.

Advertisement