వేధిస్తున్నారంటూ ఓ భర్త తన భార్యను, అత్తను నరికి హత్య చేశాడు. ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిదిలో దారుణం జరిగింది. బెంగళూరుకు చెందిన పద్మప్రియకు శర్వానంద్కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యా- భర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. పద్మప్రియకు అంతకు ముందే వివాహం జరిగింది. అయితే ఆ విషయం శర్వానంద్కు చెప్పలేదు. ఆ విషయం తెలిసి అతను వేరుగా ఉంటున్నాడు. పద్మప్రియ, ఆమె తల్లి పరమేశ్వరి శర్వానంద్తో తరచూ గొడవపడుతుండటంతో వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా వారు వేదిస్తుండటంతో విసిగివేసారిన శర్వానంద్ భార్యను, అత్తను నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు.
సికింద్రాబాద్లో డబుల్ మర్డర్
Published Thu, Nov 14 2013 6:50 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
- రష్యా జైలులో ‘ఐసిస్’ కలకలం
- మొహంజోదారో : ఆ డ్యాన్సింగ్ గర్ల్ విగ్రహం ఎవరిది?
- టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు
- సినిమా కోసం అధిక వడ్డీకి అప్పులు.. దేశం విడిచి వెళ్లిపోలేదు: నటుడు
- పెద్ద చదువు లేదు, ఉన్న ఇల్లమ్మేసింది, రూ.500 అప్పుతో..
- T20 World Cup 2024: ఓడినా రికార్డు నెలకొల్పారు..!
- ఇదేంటో తెలుసా? దీనిని తాకితే.. ప్రాణాలకే?
- చెక్పోస్టు ఉద్యోగం భలే కిక్కు!
- టీడీపీ అరాచకం!
Advertisement