చంద్రబాబుకు స్వాగత ర్యాలీ వెలవెల

Tdp Workers Did Not Show Interest In Chandrababu Welcome Rally - Sakshi

పటమట(విజయవాడతూర్పు)/గన్నవరం(విమానాశ్రయం): తిరుపతి నుంచి ప్రత్యేక విమా­నంలో శుక్రవారం విజయవాడ వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి నిరాదరణే ఎదురైంది.

ఆ పార్టీ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పార్టీ ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత ర్యాలీ కార్యకర్తలు, నాయకులు లేక వెలవె­లబోయింది. జాతీయ రహదారి 16 వెంబడి రామ­వరప్పాడు రింగ్‌ నుంచి బెంజిసర్కిల్‌ మీదుగా బందరురోడ్డు వైపు వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్‌లో నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలు లేకపోవడం చర్చ­నీయాంశంగా మారింది.
చదవండి: పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు, ప్రత్యేక రైళ్ల పొడిగింపు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top