-
వింత రాజకీయం.. పొత్తు ఉన్నా ఎవరి ప్రచారం వారిదే?
పశ్చిమ యూపీలో ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్లు పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, ప్రచారం చేపట్టే విషయంలో ఇరు పార్టీల మధ్య సయోధ్య కనిపించడం లేదు. తొలి విడత లోక్సభ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. అయితే ప్రచారం చివరి రోజున ఇరు పార్టీలు ఉమ్మడి ర్యాలీకి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ యూపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల తీరుకు భిన్నంగా బీజేపీ-ఆర్ఎల్డీల దోస్తీ పటిష్టంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, హోంమంత్రితో ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి పలుమార్లు సమావేశమయ్యారు. ఇదే సమయంలో ఎస్పీ, కాంగ్రెస్ హైకమాండ్ విడివిడిగా తమ గొంతు వినిపించడం విచిత్రంగా మారింది. ఎస్పీ తో పొత్తు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ విడిగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఇరు పార్టీల మధ్య దూరానికి కారణమేమిటనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఎనిమిది లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వివిధ లోక్సభ స్థానాలకు వెళ్లి తమ కూటమి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలేష్ యాదవ్ పిలిభిత్ నుంచి ముజఫర్ నగర్ వరకు బహిరంగ సభలు నిర్వహించారు. అయితే ముజఫర్నగర్కు సమీపంలో జరిగిన ప్రియాంక గాంధీ రోడ్ షోలో అఖిలేష్ కనిపించలేదు. సహరాన్పూర్ లోక్సభ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. ప్రచారం చివరి రోజున ఎస్పీ, కాంగ్రెస్లు ఉమ్మడి ర్యాలీ నిర్వహించకపోవడానికి ప్రధాన కారణం ముస్లిం ఓటు బ్యాంకు అని రాజకీయ విశ్లేషకులు జ్ఞాన్ ప్రకాశ్ తెలిపారు. 2019 నాటి ఎస్పీ, బీఎస్పీ పొత్తును ఉదహరిస్తూ, అప్పట్లో ఆ రెండు పార్టీల అధినేతలు ఉమ్మడి ర్యాలీని నిర్వహించారన్నారు. అయితే నాడు బహుజన సమాజ్ పార్టీ.. కూటమి వల్ల ప్రయోజనం పొందిందని, ఎస్పీ ఎటువంటి ప్రత్యేక ప్రయోజనం పొందలేకపోయిందన్నారు. ఈ సారి ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ఉమ్మడి ర్యాలీ నిర్వహించకపోవడానికి ఇదే కారణం కావచ్చన్నారు. -
అఖిలేష్ ర్యాలీ, ప్రియాంక రోడ్ షో..
ఉత్తరప్రదేశ్లోని ఎనిమిది లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. నేటి (బుధవారం) సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపధ్యంలో నేడు ఘజియాబాద్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు సహరాన్పూర్లో పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్షో నిర్వహించనున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్ కూడా సంస్థాగత సమావేశాన్ని నిర్వహించి, బూత్ నిర్వహణకు కార్యకర్తలకు పలు సూచనలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజున పార్టీలన్నీ తమ ప్రచారహోరును పెంచాయి. ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్లలో మొదటి దశలో ఓటింగ్ జరగనుంది. ఈ ఎనిమిది స్థానాల్లోని ఏడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థి, ఒక స్థానంలో ఆర్ఎల్డీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అలాగే ఎస్పీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తం ఎనిమిది స్థానాల్లో బీఎస్పీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఎస్పీ అధినేత అఖిలేష్ ప్రచార ర్యాలీని కూడా నిర్వహించనున్నారని సమాచారం. -
ఈస్టర్ ఫెస్టివల్.. రన్ ఫర్ జీసస్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: ఈస్టర్ ఫెస్టివల్ సందర్భంగా హైదరాబాద్లో ‘రన్ ఫర్ జీసస్ ర్యాలీ’ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చి నుంచి ర్యాలీని ప్రారంభించారు. కార్డినల్ పూలే ఆంథోని ప్రత్యేక అతిథిగా పాల్గొని ఈ ర్యాలీని ప్రారంభించారు. క్రైస్తవుల సోదరులు, యువతులు పెద్దఎత్తున ర్యాలీ తీశారు. ఫొటోలు.. సినీ నటుడు రాజా పర్యవేక్షణలో కొనసాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చి నుంచి అబిడ్స్ వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పూల ఆంథోని మాట్లాడుతూ.. ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో ముఖ్యమని అన్నారు ఏసుప్రభు అనుగ్రహం ప్రజలపై ఎల్లవేళలా ఉంటుందన్నారు. అనంతరం పూల ఆంథోనికి జ్ఞాపకం అందజేశారు రాజా. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన యువతకు రాజా శుభాకాంక్షలు తెలిపారు. -
ఎన్నికల సంఘానికి ఇండియా కూటమి 5 డిమాండ్లు
న్యూఢిల్లీ: ఇటీవల అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్లను వెంటనే విడుదల చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. కేజ్రీవాల్కు మద్దతుగా ఢిల్లీలో ఆదివారం(మార్చ్ 31) భారీ సభ నిర్వహించిన ఇండియా కూటమి ఐదు డిమాండ్లు చేసింది. ఈ డిమాండ్లను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ చదివి వినిపించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో దేశంలోని అన్ని పార్టీలకు సమాన అవకాశాలివ్వాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ని కూటమి డిమాండ్ చేసింది. ఎన్నికల్లో సీబీఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయడాన్ని ఈసీ అడ్డుకోవాలి. సీఎం కేజ్రీవాల్, మాజీ సీఎం హేమంత్ సొరేన్లను వెంటనే విడుదల చేయాలి. ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలను వెంటనే ఆపాలి. బీజేపీ చేస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అక్రమ వసూళ్లు, ఎన్నికల బాండ్ల ద్వారా చేస్తున్న మనీలాండరింగ్పై విచారించడానికి సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలి’ అని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, పంజాబ్ సీఎం భగవంత్మాన్, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాక్రే, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, హేమంత్సోరేన్ భార్య కల్పన సోరేన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి.. ప్రధాని మోదీ అవి గుర్తు చేసుకోవాలి -
గూడూరులో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
-
భువనేశ్వరి భజన
చిత్తూరు అర్బన్: చిత్తూరులో ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం పచ్చ రంగు పూసుకుంది. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను టీడీపీ నేత నారా భువనేశ్వరి కార్యక్రమానికి వెళ్లాలని ఒత్తిడి తీసుకొచ్చింది. ర్యాలీకి వెళ్లకపోతే ఆబ్సెంట్ వేస్తామని, ఇంటర్నెల్ మార్కులు కట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడింది. కళాశాల యాజమాన్యం చేష్టలకు విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కళాశాల గుర్తింపు రద్దు చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. స్పందన లేకే... చిత్తూరు నగరంలో నారా భువనేశ్వరి చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇలా అయితే చిత్తూరు టికెట్ ఆశిస్తున్న తన పరువుపోతుందని టీడీపీ నేత విజయం కళాశాల నిర్వాహకులను సంప్రదించి విద్యార్థులను పంపాలని కోరారు. అడిగిందే అదునుగా విద్యార్థుల అభిప్రాయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోని కళాశాల నిర్వాహకుడు ఉన్నపళంగా విద్యార్థులకు ఆదేశాలిచ్చేశాడు. కళాశాలలో చదువుతున్న 500 మందికి పైగా విద్యార్థులు భువనేశ్వరికి స్వాగతం పలుకుతూ రోడ్డుకిరువైపులా నిలబడాలని హుకుం జారీ చేశాడు. కొందరు విద్యార్థినిలు ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నా పట్టించుకోకుండా కళాశాల నిర్వాహకుడు ఒత్తిడి చేసి రోడు్డపై నిలబెట్టాడు. మరికొందరు విద్యార్థులు రాజకీయ కార్యక్రమాల్లో తాము వెళ్లినట్టు తమ తల్లిదండ్రులకు తెలిస్తే మందలిస్తారని చెప్పినా వినిపించుకోకుండా ర్యాలీకి వెళ్లితీరాల్సిందేనని పట్టుబట్టారు. వెళ్లని వారికి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు కట్ చేస్తానని, ఆబ్సెంట్ వేస్తానని బ్లాక్మెయిల్ చేశారు. దీంతో విద్యార్థులు చేసేది లేక దాదాపు మూడు గంటల పాటు చిత్తూరు పీసీఆర్ కూడలిలోని రోడ్లపై నిలబడ్డారు. ఓ వైపు ఎండలు మండిపోతుంటే కళాశాల యాజమాన్యం కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. గతంలోనూ ఇదే తీరు విజయం విద్యా సంస్థలకు ఇలాంటి ఘటనలు కొత్తేమీకాదు. గతంలో లోకేష్ యువగళం కార్యక్రమానికి సైతం విద్యార్థులను ఒత్తిడి చేసి పంపించారు. నో డ్రగ్స్ పేరిట టీడీపీ నేతలు చిత్తూరులో నిర్వహించిన ర్యాలీకి కూడా టీడీపీ జెండాలు పట్టుకుని రోడ్లపై వెళ్లాల్సిందేనంటూ బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై అప్పట్లో కళాశాల యాజమాన్యంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నిర్వాహకుడు విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాడు. భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం కావని హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా భువనేశ్వరి కార్యక్రమానికి విద్యార్థులను పంపడంతో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. విద్యార్థులను బెదిరింపులకు గురిచేసి, రోడ్లపై నిలబెట్టడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదుచేసి, కళాశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. -
ఆస్ట్రేలియాలో సిద్ధం : ఘనంగా యాత్ర ర్యాలీ!
ఆస్ట్రేలియాలో యాత్ర 2 విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది. రాబోయే రాజకీయ యుద్ధానికి మేం సిద్ధమంటూ పలువురు ప్రవాసాంధ్రులు నినదించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ జీవన ప్రయాణాన్ని దర్శకుడు మహి వి రాఘవ రూపొందించిన యాత్ర 2 సినిమా విడుదల సందర్భంగా.. ఆస్ట్రేలియా భారీ కారు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయటానికి వైఎస్సార్సీపీ సిద్ధం అని తెలియచేసారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల్లో అభిమానులు కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆస్ట్రేలియాలోని వివిధ నగరాల్లో భారీ కార్ల ర్యాలీలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో జగన్ గారికి తమవంతు సహాయ సహకారాలు అందించటానికి వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా టీం రెడీగా ఉందని తెలియచేసారు. | -
జగన్ కు మద్దతుగా మత్స్యకారులు బోటు ర్యాలి
-
ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్ యాక్షన్
ముంబై: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మహారాష్ట్రలో తీసిన ర్యాలీలో రాముడి భక్తులపై ఓ వర్గం వారు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని మీరా రోడ్లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాజాగా ఆ ప్రాంతంలో(మీరా రోడ్డు) మహారాష్ట్ర సర్కార్ బుల్డోజర్ చర్యకు దిగింది. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో.. రాముని ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి నివాసాలను బుల్డోజర్లతో కూల్చివేసింది. మీరా రోడ్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బుల్డోజర్తో కూలగొట్టింది. దాదాపు 15 అక్రమ బిల్డింగ్లను నేలమట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కాగా అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో భక్తి పాటలు, కోలాటాలతో వేడుకగా శ్రీరాముడి ఊరేగింపు నిర్వహించారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మహారాష్ట్రలో చేపట్టిన ర్యాలీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ముంబై శివార్లలోన మీరా రోడ్డులో కార్లు, బైక్లపై కాషాయ జెండాతో ఆదివారం రాముడి శోభా యాత్ర నిర్వహించారు. చదవండి: Ayodhya: బాలక్ రామ్ కోసం.. రెండో రోజూ అవే దృశ్యాలు ఈ ర్యాలీలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే బీజేపీ సర్కార్ నిందితుల స్థలాల వద్ద బుల్డోజర్ యాక్షన్ చేపట్టింది. కాగా బుల్డోజర్ యాక్షన్ అనేది ముందుగా ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రారంభించింది. గొడవలు, కొట్లాటలు, అల్లర్లు వంటి వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లు, స్థలాలను బుల్డోజర్తో కూల్చివేస్తూ వస్తుంది. తరువాత ఇదే పద్దతిని బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అనుసరిస్తన్నాయి. తాజాగా రాజస్థాన్కు బుల్డోజర్ యాక్షన్ వ్యాపించింది. -
శ్రీరాముడి ర్యాలీలో ఘర్షణ.. దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్
ముంబై: మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు. ముంబై శివారుల్లో ఆదివారం కార్లు, బైకులతో ర్యాలీ తీసిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీసు స్పందించారు. మహారాష్ట్రలో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని సహించేది లేదని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకల నేపథ్యంలో 10-12 మంది కార్లు, మెటర్ సైకిల్స్తో ఆదివారం రాత్రి ముంబై శివారుల్లో శ్రీరాముడి నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. మరో వర్గం టపాసులు పేల్చింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధం ఉన్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ అధారంగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: Ayodhya Ram Mandir: భావోద్వేగానికి లోనైన దిగ్గజ నేతలు -
ఏలూరులో బైక్ ర్యాలీ తో పాటు మానవహారం
-
హ్యూస్టన్ వీధుల్లో ‘జై శ్రీరాం’ నినాదాలు.. భారీ ర్యాలీ!
జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. భారత్లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో సప్త సముద్రాలు దాటి మరీ ‘జై శ్రీరామ్’ నినాదాలు మిన్నంటుతున్నాయి. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టపై అమెరికాలోనూ ఉత్సాహం కనిపిస్తోంది. జనవరి 22న అయోధ్యలో జరిగే పవిత్రోత్సవానికి హాజరుకావాలని ఆలయ నిర్వాహకులకు అమెరికాలోని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ఆహ్వానం పంపింది. ఈ నేపధ్యంలో హ్యూస్టన్లో భక్తులు ఎంతో ఉత్సాహంతో కారు ర్యాలీ చేపట్టారు. హిందూ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు హ్యూస్టన్లో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ, భారీ స్థాయిలో కారు ర్యాలీని చేపట్టారు. 500 మందికి పైగా భక్తులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 216 కార్లతో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ 100 మైళ్ల మేర సాగింది. ఈ ర్యాలీని శ్రీ మీనాక్షి ఆలయం దగ్గర ప్రారంభించి, రిచ్మండ్లోని శ్రీ శారదాంబ ఆలయం వద్ద ముగించారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ చేపట్టిన ఈ ర్యాలీ 11 దేవాలయాల మీదుగా సాగింది. సుమారు రెండు వేల మందికి పైగా భక్తులు సంకీర్తనలతో శోభాయాత్రకు స్వాగతం పలికారు. వీహెచ్పీఏ సభ్యుడు అమర్ మాట్లాడుతూ హ్యూస్టన్వాసుల హృదయాల్లో శ్రీరాముడు కొలువైవున్నాడన్నారు. -
టీడీపీ మేనిఫెస్టో మాకు గొడ్డలిపెట్టుగా మారింది: ఆటో డ్రైవర్లు
-
ఆడుదాం ఆంధ్రా..3K ర్యాలీ
-
30న ప్రధాని మోదీ అయోధ్య రాక.. భారీ రోడ్ షోకు సన్నాహాలు!
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో డిసెంబర్ 30న శ్రీరామ్ విమానాశ్రయం నుంచి అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను స్థానిక అధికారులు రూపొందిస్తున్నారు. ఇదేవిధంగా ఎయిర్పోర్టు సమీపంలోని మైదానంలో జరగనున్న ప్రధాని మోదీ ర్యాలీకి సంబంధించిన బ్లూప్రింట్ను కూడా రూపొందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్సింగ్ మాట్లాడుతూ ప్రధాని సారధ్యంలో జరిగే ర్యాలీలో సుమారు లక్ష మంది కార్యకర్తలు పాల్గొంటారన్నారు. కాగా స్థానిక కమిషనర్ గౌరవ్ దయాల్, ఐజీ ప్రవీణ్ కుమార్, ఎస్ఎస్పీ రాజ్కరణ్ నయ్యర్లు సంయుక్తంగా విమానాశ్రయాన్ని, ప్రధాని ప్రతిపాదిత ర్యాలీ వేదికను పరిశీలించారు. అక్కడి వాహనాల పార్కింగ్ స్థలాలను కూడా పరిశీలించారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నగర ఎస్పీ మధుబన్ సింగ్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇదిలావుండగా అయోధ్యలోని నూతన రామాలయ ప్రారంభోత్సవ వేడులకు వచ్చే భక్తులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు చెందిన 165 మంది వైద్యులు సేవలందించనున్నారు. జనవరి 15 నుంచి 30 వరకు ప్రతిరోజూ నలుగురు వైద్యులు భక్తులకు అందుబాటులో ఉండనున్నారు. ఇది కూడా చదవండి: బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకు 84 సెకెన్ల సూక్ష్మ ముహూర్తం! -
ఏలూరులో కదంతొక్కిన విద్యార్థులు
ఏలూరు టౌన్: ‘వన్స్ మోర్ సీఎం వైఎస్ జగన్... జయహో జగన్..’ నినాదాలతో ఏలూరు నగరం మార్మోగింది. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూరులో విద్యార్థి సాధికారత ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నిర్వహించిన ఈ ర్యాలీలో నగరంలోని పలు కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల దినేష్రెడ్డి నేతృత్వంలో ఏలూరు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథులుగా భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ హాజరయ్యారు. తొలుత ఏలూరు జెడ్పీ కార్యాలయ ప్రాంతం నుంచి ఫైర్స్టేషన్ సెంటర్ వద్దకు ర్యాలీగా వచ్చారు. అక్కడ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం ఫైర్స్టేషన్ సెంటర్, కోర్టు సెంటర్, ఏలూరు జీజీహెచ్ మీదుగా రామచంద్రరావుపేట వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్న సీఎం జగన్: రాయుడు అంబటి రాయుడు మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాటలు వేస్తూ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ‘ఆడుదాం–ఆంధ్ర’లో ప్రతి విద్యార్థి, యువత పాల్గొని తమ ప్రతిభను చాటాలని సూచించారు. ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎంఆర్ పెద్దబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి భరత్రెడ్డి, ఏలూరు అధ్యక్షుడు ఏలూరు అంజి, జేసీఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ వైఎన్వీ శివరావు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు స్వాగత ర్యాలీ వెలవెల
పటమట(విజయవాడతూర్పు)/గన్నవరం(విమానాశ్రయం): తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం విజయవాడ వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి నిరాదరణే ఎదురైంది. ఆ పార్టీ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పార్టీ ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత ర్యాలీ కార్యకర్తలు, నాయకులు లేక వెలవెలబోయింది. జాతీయ రహదారి 16 వెంబడి రామవరప్పాడు రింగ్ నుంచి బెంజిసర్కిల్ మీదుగా బందరురోడ్డు వైపు వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్లో నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు, ప్రత్యేక రైళ్ల పొడిగింపు -
మళ్లీ జగనే కావాలి..
సాక్షి, అమరావతి :రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ఎలుగెత్తి చాటేందుకు.. ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్, లోకేశ్, ఎల్లో మీడియాల దుష్ప్రచారాలను ఎండగట్టేందుకు ఐటీ ఉద్యోగులు విజయవాడలో కదంతొక్కారు. రాష్ట్ర ప్రభుత్వంపై పచ్చబ్యాచ్ అనుసరిస్తున్న తీరుపై వారు విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ ఐటీ విభాగం పిలుపు మేరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో పనిచేస్తున్న ఏపీకి చెందిన ఐటీ ఉద్యోగులు శనివారం పెద్దఎత్తున విజయవాడలో జరిగిన జగనన్న ప్రగతి పథం ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వీరి నుంచి అనూహ్య స్పందన లభించింది. పలు ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమానికి తరలిరావడంతో బెజవాడ బందరు రోడ్డు జనసంద్రంలా మారింది. జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తింది. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమై పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. “వీ వాంట్ జగన్’ అంటూ పెద్దఎత్తున ముక్తకంఠంతో నినదించారు. అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాల్లోని 12 అంశాలతో కూడిన ప్లకార్డులను చేబూని ర్యాలీగా వారంతా ముందుకు సాగారు. ఆ వెనకాలే బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వంపై ఎల్లో మీడియా దాడిని తిప్పికొడతామని.. సంక్షేమ సారథి వైఎస్ జగన్ను 2024 ఎన్నికల్లోనూ గెలిపించుకుంటామని వారు ప్రతినబూనారు. ర్యాలీ వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకోగానే పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ రాష్ట్రంలో చేసిన ప్రగతిని ఈ సందర్భంగా ఐటీ ప్రొఫెషనల్స్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ విజయాలను చాటిచెప్పడమే లక్ష్యం.. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఐటీ విభాగం అధ్యక్షుడు పి. సునీల్కుమారెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నాలుగన్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి–సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకే రాష్ట్రంలో “జగనన్న ప్రగతిపథం్ఙ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వ విజయాలను చాటిచెప్పడమే ఈ కార్యక్రమం లక్ష్యమమన్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో రహదారులు, ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరిగిందని, దీంతోపాటు.. రాష్ట్రానికి రూ.13.5 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు సహా అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే, ఇకపై చంద్రబాబు అండ్ కో ను జగనన్న ఐటీ సైన్యం ఎప్పటికప్పుడు అడ్డుకుంటుందని హెచ్చరించారు. మంచిని దాచి పచ్చ మీడియా దుష్ప్రచారం.. ఇక పారిశ్రామికరంగంలో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉందని వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ఇన్ఛార్జి మంజునాథ్ యాదవ్, వైఎస్సార్సీపీ ఐటీ విభాగం కోఆర్డినేటర్లు కుమారస్వామిరెడ్డి, రోశిరెడ్డి చెప్పారు. జగనన్న ప్రభుత్వం చేస్తున్న మంచిని దాచి, చంద్రబాబు ఎల్లో మీడియా అబద్ధాలను ప్రచారం చేస్తోందని వారు మండిపడ్డారు. జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలోని ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను పూర్తిగా మార్చారన్నారు. ఐటీ కంపెనీలు కడుతుంటే, వాటిని ఓయో రూములంటూ టీడీపీ అబద్ధపు ప్రచారం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మాట్లాడుతూ.. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జగనన్న ప్రభుత్వం 60,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్లు (ఐఎఫ్పీ), 10,000 స్మార్ట్ టీవీలను ఏర్పాటుచేసి తరగతి గదులను డిజిటల్ లెర్నింగ్ స్పేస్లుగా మార్చిందని.. అలాగే, విద్యార్థులకు 5.8 లక్షల బైజూస్ టాబ్లను అందించిందన్నారు. 99.5 శాతం హామీలు అమలుచేసిన ఏకైక సీఎం జగన్.. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో మేనిఫెస్టోలోని దాదాపు 99.5 శాతం హామీలను పూర్తిచేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్. కానీ.. దుష్టచతుష్టయం, ఎల్లో మీడియా జగన్ చేసిన అభివృద్ధి–సంక్షేమాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. అందుకే వైఎస్సార్సీపీ ఐటీ ఆధ్వర్యంలో జగనన్న ప్రగతిపథం కార్యక్రమం ప్రారంభించాం. ఐటీ ఉద్యోగులందరం మౌత్ ప్రచారం చేయాలని నిర్ణయించాం. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రాష్ట్ర ప్రగతిని ప్రజలకు వివరిస్తాం. వైఎస్సార్ ఆనాడు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారానే ఎంతోమంది పేద విద్యార్థులు ఐటీ కోర్సులు చదువుకుని ఉద్యోగులయ్యారు. ఆయన రుణం తీర్చుకునేందుకు సీఎం జగన్ కోసం ప్రచారం చేస్తాం. – సింధు, ఐటీ ఉద్యోగి, హైదరాబాద్దమ్మున్న సీఎం జగన్.. మీకు మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అంటున్న ఏకైక సీఎం జగన్ మాత్రమే. ఆ మాట అనటానికి ఎంత దమ్ముండాలి. ఏ సీఎం ఇవ్వని విధంగా జగన్ 4.93 లక్షల ఉద్యోగాలిచ్చారు. ఇందులో పర్మినెంట్ ఉద్యోగాల వివరాల్ని తీసుకుంటే 2 లక్షల 13వేల 662 మందికి అవకాశం దక్కింది. ఇంకా కొన్ని వ్యవస్థల్లో రిక్రూట్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ కోసమే దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీచేశారు. అంతేకాక.. వైద్యరంగంలో దాదాపు 50వేల మందికి శాశ్వత ఉద్యోగాలిచ్చారు. అదే చంద్రబాబు హయాంలో కేవలం 34వేల పోస్టుల్ని మాత్రమే భర్తీచేసి ఇప్పుడు ఉద్యోగాలెక్కడ అంటూ రోజుకోసారి ఎల్లో మీడియాలో ఊదరగొడతున్నారు. మంచి చేసిన సీఎంకి ఐటీ ఉద్యోగులందరం మంచి చేయాలనుకున్నాం. అందుకే ప్రతీ ఇంటికీ వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తాం. – స్వర్ణలత, విశాఖపట్నం, ఐటీ ఉద్యోగి -
అమెరికాలో భారీ కారు ర్యాలీ!
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు మద్దతుగా అమెరికాలో భారీ కారు ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నారై వింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు, ప్రవాసులు భారీగా తరలివచ్చారు. డల్లాస్లో అభిషేక్ కొత్తూరు సారథ్యంలో జరిగిన ర్యాలీకి అనుహ్య స్పందన వచ్చింది. ‘గులాబీ జెండలే రామక్క’ పాటలు, 'అపుడు ఎట్ల ఉండే తెలంగాణ.. ఇప్పుడు ఎట్ల ఉండే తెలంగాణ' అంటూ తీన్మార్ డబ్బులతో సందడి చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు మద్దతుగా ఈ భారీ కారు ర్యాలీ నిర్వహించినట్లు అభిషేక్ పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. ఎన్నారైలంతా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్కు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. (చదవండి: అగ్రరాజ్యంలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు!) -
ప్రియాంకకు చేదు అనుభవం: పుష్పగుచ్చం ఇచ్చారు.. పూలు మరిచారు!
మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల జోష్ తారాస్థాయికి చేరుకుంది. నవంబర్ 17న ఇక్కడ ఓటింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించి, ఆ తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ- కాంగ్రెస్ మధ్యేనే నెలకొంది. రాష్ట్రంలో మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఈ రెండు పార్టీలు చెబుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇండోర్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. ఆమె వేదికపైకి రాగానే స్థానిక కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అయితే ఒక నేత ఆమెకు ఇచ్చిన పూలగుత్తిలో పూలు మాయమయ్యాయి. దీనిని గమనించిన ప్రియాంక గాంధీ ఆ పుష్పగుచ్చంలో పూలు లేవని అక్కడున్న నేతలకు చెప్పారు. దీంతో వారంతా నవ్వుకున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్ పాఠక్ స్పందించారు. అతను తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాశారు. ‘ఇదొక గుత్తి స్కామ్, పుష్పగుచ్ఛం నుండి పూలు మాయమయ్యాయి. స్క్వాడ్ పట్టేసుకుంది’ అని రాశారు. ఇండోర్లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తూ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్లో 18 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా, ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం 250 కుంభకోణాలు చేసి, ప్రజా ధనాన్ని దోచుకుందని ఆరోపించారు. ఇది కూడా చదవండి: మహావినాశనం ముందుంది? गुलदस्ता घोटाला 😜 गुलदस्ते से गुल गायब हो गया.. दस्ता पकड़ा दिया 😂😂 मध्यप्रदेश के इंदौर में प्रियंका वाड्रा की रैली में एक कांग्रेसी गुलदस्ता देने पहुंचा लेकिन कांग्रेसी खेल हो गया।#MPElections2023 pic.twitter.com/y7Qmyldp94 — राकेश त्रिपाठी Rakesh Tripathi (@rakeshbjpup) November 6, 2023 -
ఇళ్ల స్థలాల కేటాయింపు నిర్ణయంపై జర్నలిస్టుల హర్షం
-
కేసీఆర్వి ఎన్నికల వ్యాఖ్యలే
సాక్షి, అమరావతి: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నందునే ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఏపీ గురించి మాట్లాడుతున్నారేమో అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన గురువారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా మీడియా ప్రతినిధులు కేసీఆర్ వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు. దీనికి సజ్జల స్పందిస్తూ.. ఎన్నికల్లో గొప్పగా చెప్పుకోవడానికి కేసీఆర్ చిన్నచిన్న రోడ్ల గురించి మాట్లాడి ఉండవచ్చని అన్నారు. మన రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో సుపరిపాలన అందిస్తోందని, ప్రజల ప్రశంసలు అందుకుంటోందని చెప్పారు. రాష్ట్రంలో తెచ్చిన పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పింఛన్ పథకాన్ని కేసీఆరే మెచ్చుకొన్నారని, వైఎస్ జగన్లాగా పెన్షన్ అందిస్తామని ఈమధ్యనే చెప్పారని అన్నారు. పోలవరం విలీన మండలాల ప్రజలను మళ్లీ తెలంగాణలో కలుస్తారా.. అని అడిగితే వెళ్లబోమని అంటున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చాయని వారు చెబుతున్నారని చెప్పారు. తాము పక్క వారి గురించి ఎప్పుడూ మాట్లాడబోమని తెలిపారు. బాబు ర్యాలీలో అంతా అదే వర్గం బుధవారం హైదరాబాద్లో చంద్రబాబు ర్యాలీకి వచ్చిన వారంతా పచ్చ కార్యకర్తలు మాత్రమేనని సజ్జల చెప్పారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు అంతకంటే ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారని తెలిపారు. లోకేశ్ పాదయాత్రలో ఏనాడైనా జనం కనిపించారా అని ప్రశ్నించారు. రోగం వచ్చిందని కోర్టుకు చెప్పి జైలు నుంచి బయటకు వచ్చిన వ్యక్తి 14 గంటలపాటు కారులో ఎలా కూర్చున్నారని మాత్రమే తాము అడిగామన్నారు. జబ్బులు ఉన్నాయని, ఆరోగ్యం బాగోలేదని కోర్టుకు అబద్ధాలు చెప్పారన్నారు. కోర్టు నిబంధనలను చంద్రబాబు పాటించలేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. -
చంద్రబాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు ర్యాలీపై హైదరాబాద్లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో చంద్రబాబు కేసు నమోదు చేశారు. ఎస్ఐ జయచందర్ ఫిర్యాదుతో క్రైం నంబర్ 531\2023 కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 341, 290, 21 రెడ్ విత్ 76 సీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రెండు గంటల పాటు రోడ్లపై న్యూసెన్స్ చేసి ప్రజలను ఇబ్బందులను గురిచేశారని చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సిటీ టీడీపీ పార్టీ జనరలసెక్రెటరీ జీవీజీ నాయుడు సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. సుమారు 400మంది ర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు పేర్కొన్నారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయి, అనారోగ్య కారణాలు చూపించి తాత్కాలిక బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్లాలనుకున్నా.. ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. ఇక్కడ ర్యాలీ చేపట్టడంతో నగర వాసులు నరకం చూశారు. అనుమతుల్లేకుండా, నిబంధనలు ఉల్లంఘించి ప్రధాన రోడ్లపై అడ్డదిడ్డంగా భారీ ర్యాలీ చేయడమే కాకుండా, టీడీపీ శ్రేణులు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా ఉల్లంఘించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు బుధవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. బాబుకు మద్దతు కోరుతూ అందరూ రావాలంటూ నాయకులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. దీంతో దాదాపు రెండు వేల మంది టీడీపీ కార్యకర్తలు అక్కడకు వచ్చారు. సాయంత్రం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన బాబు కాన్వాయ్ను అనుసరిస్తూ పార్టీ జెండాలు, ప్లకార్డులతో ముందుకు కదిలారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసానికి చేరుకోవడానికి దాదాపు మూడున్నర గంటలు పట్టింది. హైదరాబాద్లో సాధారణ సమయాల్లోనే ర్యాలీలు, నిరసనలు, ప్రదర్శనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. పైగా, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీని ప్రకారం టీడీపీ తెలంగాణలో పోటీ చేయకపోయినా రిటర్నింగ్ అధికారి నుంచి ర్యాలీకి అనుమతి పొందాలి. 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉల్లంఘనకు పాల్పడటంతో పాటు ర్యాలీలో వాహనాలను అడ్డదిడ్డంగా నడిపి, అంబులెన్స్లకు సైతం దారి ఇవ్వకపోవడంతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ఫైబర్నెట్ కేసులో వేగం పెంచిన సీఐడీ -
హైదరాబాద్లో ఎన్నికల కోడ్ను అతిక్రమించిన చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో చంద్రబాబు ఎన్నికల కోడ్ అతిక్రమించారు. వందలాది వాహనాల కాన్వాయ్తో ర్యాలీ నిర్వహించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి ర్యాలి చేపట్టిన తెలుగుదేశం శ్రేణులు.. వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. టీడీపీ నాయకులు వాహనాలను అడ్డం పెట్టడంతో బేగంపేట నుంచి పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట్లో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. అంబులెన్స్కు సైతం సైడ్ ఇవ్వకుండా వాహనాలు అడ్డుపెట్టి ర్యాలీ నిర్వహించారు. టీడీపీ శ్రేణుల ఓవర్ యాక్షన్పై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిన్న తాత్కాలిక బెయిల్పై విడుదలైన చంద్రబాబు తొలిరోజే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించినా ఖాతరు చేయలేదు. జైలు నుంచి బయటకు రాగానే మైకు అందుకున్నారు. కోర్టు.. ఆయన వయసు, అనారోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుని షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీన్ని గొప్ప విజయంగా, నిజం గెలిచిందని, ధర్మం నిలబడిందని చెప్పుకుంటూ చంద్రబాబును ఊరేగింపుగా తరలించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఈటల సంచలన వ్యాఖ్యలు -
కాపుల మీద దాడులపై పవన్ నోరు విప్పాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ)/రాజమహేంద్రవరం సిటీ: కాపు సామాజికవర్గంపై దాడులు జరుగుతుంటే పవన్కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. కాపులపై పవన్కు ప్రేమ ఉంటే మంత్రి అంబటిపై దాడిని ఖండించాలని డిమాండ్ చేశారు. మంత్రి అంబటిపై దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ కాపు సామాజికవర్గం ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. వెలంపల్లి మాట్లాడుతూ బలహీనంగా ఉన్న టీడీపీని బతికించాలనుకోవడం పవన్ అవివేకమన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి మాట్లాడుతూ అంబటిపై దాడిని ఖండించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నేతలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో కాపు జేఏసీ ర్యాలీ మంత్రి అంబటిపై దాడి దుర్మార్గమని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కాపు జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు జేఏసీ నేతల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. కాపు జేఏసీ నేతలు నందెపు శ్రీనివాస్, యాళ్ల సురేష్, మానే దొరబాబు, అడపా అనిల్, రాయవరపు గోపాలకృష్ణ, ఆకుల ప్రకాష్, వలవల దుర్గాప్రసాద్, నామన వాసు, బురిడీ త్రిమూర్తులు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
‘పీవోకే’ భారత్లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం
YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..
T20 WC: సంజూ వద్దు.. పంత్ బెటర్!.. తుదిజట్టులో ఆడించినా..
డీజిల్తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
మెహరీన్పై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పాలంటూ ఫైర్
ప్లాటినమ్ కలర్ శారీలో ‘రాములమ్మ’ హొయలు.. జింగ్ జింగ్ అమేజింగ్ శ్రీ!
8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..
రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్
సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
తప్పక చదవండి
- సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement