-
68.09 శాతం ఓటింగ్
- కోవైలో 44, తూత్తుకుడిలో 53 శాతం - కోవైలో 175 మందిపై కేసులు - ఈసీ సహకారంతోనే అరాచకాలు: తమిళిసై రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో 68.09 శాతం ఓటింగ్ నమోదైంది. కోయంబత్తూరు కార్పొరేషన్లో 44.59 శాతం, తూత్తుకుడి కార్పొరేషన్లో 53.83 శాతం ఓట్లు పోలయ్యాయి. గతంలో కంటే ఈసారి ఓటింగ్ తగ్గడంతో మేయర్ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. సాక్షి, చెన్నై : రాష్ర్టంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల పదవుల భర్తీ నిమిత్తం ఉప ఎన్నికలకు రాష్ట్ర అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఇందులో తిరునల్వేలి కార్పొరేషన్ మేయర్, మరో నాలుగు మునిసిపాలిటీ చైర్మన్ల పదవులతో పాటు వందలాది పదువులు ఏకగ్రీవమయ్యాయి. తూత్తుకుడి, కోయంబత్తూరు కార్పొరేషన్ల మేయర్ పదవులతో పాటు అరక్కోణం, రామనాథపురం, విరుదాచలం, కడలూరు మునిసిపాలిటీ చైర్మన్ల పదవులకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. అలాగే, పట్టణ, జిల్లా, యూనియన్ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. మొత్తంగా 530 పదవుల భర్తీకిగాను గురువారం ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు తొలుత మందకొడిగా సాగినా, సాయంత్రానికి వేగం పుంజుకుంది. భారీగానే ఓట్లు నమోదవుతాయని అభ్యర్థులు భావించారు. అయితే, అభ్యర్థుల్లో ఉత్కంఠ రేపే విధంగా ఓటింగ్ శాతం తగ్గిపోయింది. నగరాల్లోని ఓటర్లు పెద్దగా ఆసక్తి కనబరచనప్పటికీ, గ్రామాల్లో ఓటింగ్ నమోదు ఆశాజనకంగానే సాగింది. ఓటింగ్ ప్రశాతం రాష్ర్టంలో ఖాళీగా ఉన్న పదవులకు జరిగిన ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం వివరాల్ని రాష్ట్ర ఎన్నికల అధికారి చోఅయ్యర్ శుక్రవారం ప్రకటించారు. రాష్ర్ట వ్యాప్తంగా 68.09 శాతం ఓటింగ్ నమోదైంది. తూత్తుకుడి కార్పొరేషన్లో 53.83 శాతం, కోయంబత్తూరులో 44.59 శాతం ఓట్లు పోలయ్యాయి. అరక్కోణంలో 45 శాతం, రామనాథపురంలో 53.33 శాతం, విరుదాచలంలో అత్యధికంగా 67.43 శాతం, కడలూరులో 53. 66 శాతం ఓట్లు పోలైనట్టు ప్రకటించారు. పట్టణ , జిల్లా, యూనియన్ పంచాయతీ పదవులకు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ 74 శాతంగా ఉంది. కాగా, కోయంబత్తూరులో గతంలో కంటే ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అన్నాడీఎంకే వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా, ఎ క్కడ ప్రతిపక్షాలన్నీ ఏకమైన బీజేపీకి మద్దతు ఇచ్చాయేమోనన్న ఉత్కంఠ నెలకొని ఉంది. కేసుల మోత ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన వివాదాల్లో బీజేపీ, అన్నాడీఎంకే వర్గాలపై ఎన్నికల యంత్రాంగం కేసుల మోత మోగించింది. నగదు బట్వాడా, ఓటర్లకు బెదిరింపు, అభ్యర్థులకు హెచ్చరికలు, తమవాళ్లపై దాడులకు సంబంధించి బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో అన్నాడీఎంకే వర్గాలపై వందకు పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే, అన్నాడీఎంకే ఇచ్చిన ఫిర్యాదుతో బీజేపీ నాయకులపై సైతం కేసులు నమోదు చేశారు. కోయంబత్తూరులో అత్యధికంగా 175 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో అన్నాడీఎంకే ఎమ్మెల్యే చిన్నస్వామి కూడా ఉన్నారు. ఫలితం స్ట్రాంగ్రూమ్లోకి! ఎన్నికల పర్వం ముగియడంతో గట్టి భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్ల్లో బ్యాలెట్ బాక్సుల్ని ఉంచారు. కోయంబత్తూరు, తూత్తుకుడి కార్పొరేషన్లతో పాటు నాలుగు మునిసిపాలిటీల పరిధుల్లోని వార్డుల్లో నమోదైన ఓటింగ్ బ్యాలెట్ బాక్సుల్ని రాత్రికి రాత్రే ఆయా ప్రాంతాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. వీటన్నింటినీ పరిశీలించినానంతరం ఆ గదులకు సీల్ వేశారు. ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఈ నెల 22న కౌంటింగ్ జరగనుంది. కాగా, స్ట్రాంగ్ రూమ్ల పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయుధ బలగాల్ని రంగంలోకి దించారు. ఈసీ సహకారంతో అరాచకాలు ఎన్నికల యంత్రాంగం సహకారంతో ఉప ఎన్నికల్లో అధికార పక్షం అరాచకాలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ శివాలెత్తారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తమకు గెలుపు అవకాశాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఓటమి భయంతో అధికార పక్షం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేకచోట్ల ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులే అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించడం బట్టిచూస్తే, ఏమేరకు న్యాయ బద్ధంగా, శాంతియుతంగా ఈ ఎన్నికలు జరిగాయో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. ఓటమి భయంతో తమ వాళ్ల మీద అధికార పక్షం దాడులు చేసిందని, చివరకు తమ వాళ్ల మీదే కేసుల్ని నమోదు చేయించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. -
బెజవాడ కేంద్రంగా రాష్ర్ట పాలన
శ్రీకారం చుడుతున్న మంత్రులు నేడు ఇరిగేషన్ శాఖ భవనం ప్రారంభం త్వరలో ఎక్సైజ్, బీసీ సంక్షేమం, వైద్య ఆరోగ్యం, వైద్య విద్య శాఖల కార్యకలాపాలు సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ నగరం నుంచి రాష్ట్ర పరిపాలన ప్రారంభం కానుంది. ఒకపక్క ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటులో భాగంగా రాష్ట్ర అతిథి గృహానికి మరమ్మతులు జరుగుతున్న విషయం తెలిసిందే. మరోపక్క 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ హైదరాబాద్ను వదిలేసి విజయవాడ కేంద్రంగా పరిపాలన సాగించేందుకు నిర్ణయించింది. ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినే ని ఉమామహేశ్వరరావు శనివారం హైదరాబాదులో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివారం నుంచే ఇరిగేషన్ శాఖ కార్యకలాపాలు విజయవాడ కేంద్రంగా మొదలు పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు ఉరుకులు పరుగులు ప్రారంభించారు. ఇప్పటికే ఎస్ఈ కార్యాలయంలో తగిన భవనాలు ఉన్నాయి. దీంతో ఇక్కడే మంత్రి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి ఎక్కడి నుంచి పాలన సాగిస్తుంటే అక్కడే ఈఎన్సీ కార్యాలయం ఉండాల్సిన నేపథ్యంలో దానినీ ఇక్కడికి తరలించనున్నారు. రైతుల బాగోగులన్నీ ఇక్కడినుంచే సమీక్ష... కృష్ణా జిల్లాతో పాటు ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కృష్ణా, గోదావరి నదుల ఆధారంగా వరి పంట ఎక్కువగా పండుతుంది. వ్యవసాయానికి ఈ జిల్లాలు కేంద్ర బిందువులుగా చెప్పవచ్చు. నెల్లూరు జిల్లాలో కూడా వరి పంట ఎక్కువగా పండుతున్నా కృష్ణా, గోదావరి నదుల నీరు మాత్రం అక్కడికి అందదు. స్థానిక నదుల ద్వారా అక్కడికి సాగునీరు అందుతుంది. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తాయి. నదుల ద్వారా సాగునీరు, రైతుల బాగోగులన్నీ మంత్రి ఇక నుంచి విజయవాడ కేంద్రంగానే చర్చించి సమీక్షిస్తారు. సాగర్ ద్వారా తాగునీటి విడుదల విషయం కూడా చర్చించే అవకాశం ఉంది. త్వరలో మరో నాలుగు శాఖలు... విజయవాడ కేంద్రంగానే ఎక్సైజ్, బీసీ సంక్షేమం, వైద్య ఆరోగ్యం, వైద్య విద్యకు సంబంధించిన శాఖల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నాలుగు శాఖలకు కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్లు మంత్రులుగా నియమితులయ్యారు. దేవినేని ఉమామహేశ్వరావు ముందుగా తన శాఖ పాలన గురించి ప్రకటించడంతో వారు త్వరలోనే విజయవాడ కేంద్రంగా పరిపాలనా కార్యకలాపాలు సాగిస్తామని ప్రకటించేందుకు నిర్ణయించారు. వీరు ముగ్గురూ జిల్లాకు చెందినవారు కావడం, రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో విజయవాడ నగరం నుంచే పాలన సాగించేందుకు సుముఖత చూపుతున్నారు. నూతన ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనను విజయవాడ కేంద్రంగానే నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా విజయవాడలో ఉన్న పలు శాఖల కార్యాలయాల విస్తీర్ణం గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కలెక్టర్ నూతన రాష్ట్ర ప్రభుత్వ నేతలకు ఇప్పటికే పలు వివరాలు అందజేశారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- Lok Sabha elections 2024: ఐదో దశకు ముగిసిన ప్రచారం
- బిభవ్ కుమార్ అరెస్ట్
- డిగ్రీకి డిగ్నిటీ...పీజీకి ఫుల్ పవర్
- Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ ఆఫీస్కొస్తాం
- కదులుతున్న బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం
- Lok Sabha Election 2024: లద్దాఖ్లో త్రిముఖ పోటీ
- Lok Sabha Election 2024: కశ్మీర్లో కనిపించని కమలం!
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
Advertisement