ఆదివారం హాయిగా కాసేపు పడుకుందామంటే... ఎవరో ఒకరు తలుపు కొడుతూనే ఉన్నారు. పాలవాడు, సేల్స్మెన్ లేదా మరొకరు చికాకు పెట్టేస్తున్నారు. మీ బెడ్పై నుంచి లేవకుండానే డోర్ కొడుతున్నదెవరో చూసేస్తే. అదెలా సాధ్యమంటారా? ‘పీబుల్’ అనే చిన్న పరికరం ద్వారా. గుండ్రని విక్స్ డబ్బా పరిమాణంలో ఉండే పీబుల్ను ప్రధాన ద్వారానికి ఉన్న పీప్హోల్కు పెట్టేస్తే చాలు... మీ స్మార్ట్ఫోన్లో ఎవరొచ్చారో చూసేయవచ్చు. అలాగే బయటికి వెళ్లినపుడు కూడా... మన ఇంటికి ఎవరొచ్చి వెళ్లారో చూడొచ్చు. ప్రధాన ద్వారం వద్ద ఏమాత్రం అలికిడి అయినా... మనిషి జాడ కనపడినా వెంటనే ఫోన్కు మెసేజ్ పంపిస్తుంది.
తర్వాత కావాలనుకుంటే ఎవరొచ్చారో మనం లైవ్లో చూసేయవచ్చు. వైఫై ఆధారంగా పనిచేసే పీబుల్ లైవ్ ఫీడ్ను నేరుగా మన స్మార్ట్ఫోన్కు పంపేయగలదు. డోర్ తెరిచి ఉంచినా అలర్ట్ చేస్తుంది. టెక్సాస్లోని ఆస్టిన్కు చెందిన క్రిస్ చటర్ దీన్ని రూపొందించారు. వినూత్న ఆవిష్కరణగా ఇది బ్రిటన్కు చెందిన జేల్యాబ్ ఇనీషియేటివ్ అవార్డును కూడా పొందింది.
ఎవరొచ్చారో చూపిస్తుంది
Published Sun, Oct 4 2015 1:55 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement