లండన్‌లోని అంబేద్కర్ భవనం మనదే!

లండన్‌లోని అంబేద్కర్ భవనం మనదే! - Sakshi


ముంబై: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఒకప్పుడు లండన్‌లో నివసించిన భవనాన్ని కొనుగోలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2.050 చదరపు అడుగుల్లో ఉన్న మూడంతస్తుల ఈ భవనాన్ని 35 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయాలని మహారాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిందని ప్రస్తుతం లండన్ పర్యటనలోవున్న మహారాష్ర్ట విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే తెలియజేశారు.


ప్రస్తుతం దావోస్ పర్యటనలోవున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో తాను ఈ విషయమై మాట్లాడానని, లండన్ భవనం కొనుగోలు విధి విధానాలకు సంబంధించి చర్చించానని చెప్పారు. 35 కోట్ల రూపాయలతో ఆ భవనం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారని తెలిపారు. లండన్ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనిపించేందుకు మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ కూడా ప్రయత్నించారు. అయితే అది ఇప్పటికీ ఫలించలేదు.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top