అత్యాచారం.. అవమానభారంతో ఆత్మహత్య


హరియాణా రాష్ట్రంలో సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాలిక అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంది. సోనేపట్ జిల్లాలోని గొహానా నగరానికి చెందిన ఆ బాలిక గత నెల ఆరోతేదీన సామూహిక అత్యాచారానికి గురైంది.



అయితే పోలీసులు మాత్రం కేవలం ఒక్కరిమీదే కేసు పెట్టి, దాన్ని కేవలం 'అత్యాచారం' కేసుగా మార్చడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురైందని, తనకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతోనే ఆమె ప్రాణాలు తీసుకుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు ఆమె వాంగ్మూలం పత్రాన్ని ఫోర్జరీ చేశారని, నిందితుల్లో చాలామంది స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారని ఆమె బంధువులు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top