రోడ్డు ప్రమాదంలో18 మంది మృతి
మహారాష్ట్రలో ఘటన
ముంబై: మహారాష్ట్రలోని ధూలె జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 18మంది మర ణించారు. ఐదుగురు గాయాలపాలయ్యారు. సూరత్-నాగ్పూర్ హైవేలో ఓ ట్రక్కు జీపును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగిందని జిల్లా ఏఎస్పీ చంద్రకాంత్ గావ్లి చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి త రలించారు.
ఉత్తరాఖండ్లో 8 మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో శుక్రవారం ఓ వాహనం అదుపుతప్పి ఘన్సాలి-అకోరి రోడ్డు మార్గంలో శాంతకల్ ప్రాంతంలోని లోయలో పడింది. ఎనిమిది మంది మృతి చెందగా ఎడుగురు గాయపడ్డారు. మరోవైపు మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లా నెవ్సా గ్రామం వద్ద ఓ జీపు ప్రమాదవశాత్తూ లోయలో పడడంతో ఆరుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు.