సునీల్రెడ్డి
సినిమా జర్నీ డీవోపీ (కెమేరామ్యాన్)గా మొదలైంది. ‘ఒకరికొకరు’తో ఆయన కెమెరాలో ఎంత బలముందో చూపించాడు. ఆ తర్వాత ఆయన మనసు దర్శకత్వంపైకి మళ్లింది. కళ్యాణ్రామ్తో ‘ఓం’ త్రీడీ సినిమాని తెరకెక్కించాడు. మరోసారి టెక్నికల్గా తానెంత స్ట్రాంగో ఆ సినిమాతో చాటి చెప్పాడు సునీల్రెడ్డి. కాస్త గ్యాప్ తర్వాత సాయిధరమ్ తేజ్తో తిక్క తెరకెక్కించాడు. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై సి.రోహిన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శనివారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు సునీల్రెడ్డి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు...
అర్బన్ బేస్డ్ కామెడీ కథతో తెరకెక్కించిన చిత్రమే ‘తిక్క’. పేరులో ఉన్న మూడ్ తెరపై కూడా కనిపిస్తుంటుంది. బ్రేకప్ అయిన కుర్రాడి జీవితంలో ఓ రాత్రి ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. నేటి యువతరాన్ని ప్రతిబింబించే ఈ కథ అందరికీ నచ్చేలా ఉంటుంది. టైటిల్ కాస్త నెగిటివ్గా అనిపించినా కథకు తగ్గట్టుగా ఉందని అదే ఓకే చేశాం. ప్రతి సన్నివేశం కామెడీగా సాగుతుంది. సినిమా చూసినవాళ్లంతా బాగుందని మెచ్చుకొంటున్నారు. ముఖ్యంగా కామెడీ బాగా పండింది అంటున్నారు. పంచులు, ప్రాసలు కాకుండా కేవలం సన్నివేశాలతోనే వినోదాన్ని పండించే ప్రయత్నం చేసాం. అది ఫలించినందుకు ఆనందంగా ఉంది. అలాగే సాయిధరమ్ తేజ్ నటనలో ఓ కొత్త యాంగిల్ని చూపించారని చెబుతున్నారు. తమన్ , గుహన్ లాంటి సాంకేతిక బృందం ఈ సినిమాకి పనిచేసింది. రోహిన్ రెడ్డి నిర్మాణం పరంగా ఎక్కడా రాజీపడలేదు. అందుకే ఓ మంచి క్వాలిటీ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగాం.
నో కన్ఫ్యూజన్ నేనొక డీవోపీగానే ప్రయాణం మొదలు పెట్టినా దర్శకుణ్ణి కావాలనే కోరిక మొదట్నుంచీ ఉంది. అమెరికాలో ఫిల్మ్ మేకింగ్లో శిక్షణ తీసుకొన్నా. డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పరిధి పరిమితం అనేది నా భావన. ఏం చేయాలన్నా వేరొకరి ఆలోచనలకి తగ్గట్టుగానే చేయాల్సి ఉంటుంది. మనదైన అభిరుచికి తగ్గట్టుగా, మనదైన కోణంలో చేయాలను కొన్నది ఏదీ చేయలేం. అందుకే నా దృష్టి దర్శకత్వంవైపు మళ్లింది. ‘ఓం’ త్రీడీ అనుకొన్న ఫలితాన్నివ్వలేకపోయింది. నా అసలు ప్రతిభ ఏంటన్నది ‘తిక్క’లోనే కనిపిస్తుంది. ఒక డీవోపీగా నాకు టెక్నాలజీ పైన కూడా అవగాహన ఉంటుంది కాబట్టి అది దర్శకుడిగా నాకు చాలా సాయం చేస్తుంటుంది. ఏం చేస్తే ఎలాంటి ఔట్పుట్ వస్తుందో ముందుగానే తెలుస్తుంటుంది. ‘తిక్క’ విషయంలో ఎక్కడా ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా పనిచేశాం.
రాజీపడను: ఏం చేసినా ఒక ప్లాన్ ప్రకారం చేయడమే నాకు అలవాటు. చిత్రీకరణకి వెళ్లడానికి ఆర్నెల్ల ముందుగానే స్క్రిప్టుని నా టెక్నీషియన్లకి అందజేశాను. దానివల్ల అందరూ ఓ అవగాహనకొస్తుంటారు. అలాగే కొన్ని విషయాల్లో చాలా మొండిగా ఉంటా. అనుకొన్నది వచ్చేవరకు రాజీపడను. ‘తిక్క’లోని ఐదు పాటల కోసం తమన్ తో 50 బాణీలు సిద్ధం చేయించా. కథని క్యారీ చేసేలా బాణీ కుదరాలనే ఆ ప్రయత్నం. టీమంతా అలా పనిచేశాం కాబట్టే ఓ మంచి ఔట్పుట్ బయటికొచ్చింది.
యువతరాన్ని ప్రతిబింబించే కథతో తిక్క తీశా!
Published Sat, Aug 13 2016 11:56 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్
టీ20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్కు బయల్దేరిన టీమిండియా
పెళ్లి కోసం అబ్బాయిని తీసుకెళ్లినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు: అంజలి
ఈ మినీ మెషిన్తో.. స్కిన్ సమస్యలకు చెక్!
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం
Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
భారీగా పెరిగిన కోడి గుడ్డు ధర
తప్పక చదవండి
- చరిత్ర సృష్టించిన షకీబ్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా..!
- విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. సౌతాఫ్రికాకు సిరీస్ పరాభవం
- బ్యాన్ చేసిన వారే ఆమె టాలెంట్కు నివ్వెరపోయారు
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- బ్యాంక్ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
- మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Advertisement