టీ-20 మ్యాచ్‌లో దేశాలు దాటిన అభిమానం! | ysrcp fans waved ysrcp flags in india-zimbabwe t20 match | Sakshi
Sakshi News home page

టీ-20 మ్యాచ్‌లో దేశాలు దాటిన అభిమానం!

Jun 19 2016 12:05 AM | Updated on Jul 25 2018 4:09 PM

భారత్‌-జింబాబ్వే జట్ల మధ్య శనివారం జరిగిన టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సందడి చేశారు.

హరారే: భారత్‌-జింబాబ్వే జట్ల మధ్య శనివారం జరిగిన టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సందడి చేశారు. హరారేలో జరిగిన ఈ మ్యాచ్‌ సందర్భంగా మైదానంలో వైఎస్ఆర్‌సీపీ జెండాలు ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

తమ టీ షర్ట్‌లపై దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, యువనేత జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్రాలను ధరించి తమ మద్దతు ప్రకటించారు. టీ-20 క్రికెట్ మ్యాచ్‌ సందర్భంగా దేశాలు దాటిన అభిమానాన్ని చాటుకుంటూ వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభిమానులు హల్‌చల్ చేశారు. తాము విదేశాల్లో ఉన్నా.. తమకు వైఎస్‌ఆర్‌సీపీపై ఎనలేని అభిమానముందని చాటుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement