పవన్కల్యాణ్తో సీపీఐ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీపీఐ నేతలు గురువారం సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, పార్టీ ఏపీ శాసనమండలి సభ్యుడు పీజే చంద్రశేఖర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్తో సమవేశమయ్యారు. అనంతరం పవన్కల్యాణ్, సీపీఐ నేతలు మీడియాతో మాట్లాడారు. ఇది స్నేహపూర్వక భేటీ అని పవన్కల్యాణ్, కె.రామకృష్ణ చెప్పారు. భావసారూప్యత కలిగిన అంశాలపై జనసేన, వామపక్షాలు కలిసి పోరాడాలన్న ప్రతిపాదన సమావేశంలో చర్చకు వచ్చినట్లు రామకృష్ణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని సీపీఎం నేతలతో కలిసి తాము మరోసారి పవన్కల్యాణ్తో సమావేశమవుతామని పేర్కొన్నారు.