మున్సిపల్ కార్యాలయం దిగ్బంధం | Sakshi
Sakshi News home page

మున్సిపల్ కార్యాలయం దిగ్బంధం

Published Wed, Aug 19 2015 3:21 PM

labours strike in front of the municipal office

అనంతపురం: తొమ్మిది నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదంటూ అనంతపురం పారిశుధ్య కార్మికులు బుధవారం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. మధ్యాహ్నం వరకు లోపలికి ఉద్యోగులను వెళ్లనీయకుండా గేట్లు మూసివేశారు. దాదాపు 40 మంది కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్యాలయం లోపల ఉన్న కార్పొరేషన్ మేయర్, కమిషనర్ వారికి వేతనాలు అందించే విషయమై చర్చలు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement