Breaking News

ఆన్‌లైన్‌ గేమ్‌లో పరిచయం.. ఆపై అత్యాచారం..

Published on Mon, 02/17/2025 - 07:52

ఫిలింనగర్‌: ఆన్‌లైన్‌ గేమ్‌ నగరానికి చెందిన ఓ బాలిక పాలిట శాపంగా మారింది. ఆన్‌లైన్‌ గేమ్‌ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలతో ఆ చిన్నారిని లొంగదీసుకున్నాడు. ఆన్‌లైన్‌ చాటింగ్‌లో తియ్యటి కబుర్లతో ఆమెను ఆకట్టుకుని ఫొటోలు షేర్‌ చేయించుకున్నాడు. అందులో బాలిక నగ్న ఫొటోలు కూడా ఉండడంతో తల్లిదండ్రులతో పాటు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బెదిరించి పూణే నుంచి హైదరాబాద్‌ వచ్చి తన వాంఛను తీర్చుకుని వెళ్లేవాడు. 

ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షేక్‌పేట్‌ ప్రాంతానికి చెందిన బాలిక 2021లో ఏడో తరగతి చదివే సమయంలో ప్రతిరోజూ సాయంత్రం ‘ఎమాంగ్‌ అజ్‌’ యాప్‌లో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతుండేది. ఈ క్రమంలోనే ‘రూథ్‌లెస్‌’ పేరిట ప్రొఫైల్‌ ఉన్న ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. 

అతని ద్వారా పూణె ఎంఐటీ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతున్న ఖుష్‌ డేవ్‌ (21) సదరు బాలికకు పరిచయం అయ్యాడు. వారు యాప్‌ ద్వారా చాట్‌ చేయడం ప్రారంభించారు. మొదట్లో ఒకరికొకరు స్నేహితుల్లా ఉండేవారు. ఆ తర్వాత 2023లో ఆమెకు టెలిగ్రామ్‌ లింక్‌ షేర్‌ చేసి ఆ యాప్‌ ద్వారా చాట్‌ చేయమని అడిగాడు. దీంతో టెలిగ్రామ్‌ ద్వారా చాట్‌ చేసుకునేవారు. చాట్‌ చేసే క్రమంలో బాలిక ఫొటోలను షేర్‌ చేయాల్సిందిగా ఖుష్‌డేవ్‌ అడగ్గా ఆమె నిరాకరించింది. రోజంతా ఆమెను బలవంతం చేయడంతో ఆమె తన ఫొటోలను, వీడియోలను పంపింది.  

నగ్న ఫొటోలతో బెదిరింపులు.. 
వాటిలో నగ్న ఫొటోలు కూడా ఉండటంతో అప్పటి నుంచి ఆ ఫొటోలను ఆమె తల్లిదండ్రులు, బంధువులకు, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించసాగాడు. తనను కలవాల్సిందిగా బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. దీంతో గత ఏడాది అక్టోబర్‌ 6న టోలిచౌకీలోని ఓ పార్కులో కలిసింది. అప్పటి నుంచి ప్రతిరోజూ తనను కలవాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ వచ్చాడు. తల్లిదండ్రులు తనను బయటకు పంపడం లేదని చెప్పినా రాత్రిపూట అందరూ నిద్రపోయిన తర్వాత ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పాడు.  

అర్ధరాత్రి అత్యాచారం.. 
ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 24న బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా, 25న తెల్లవారుజామున అక్కడికి వచ్చిన ఖుష్‌డేవ్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో కలుసుకున్నారు. ఇదే అదునుగా మరుసటి రోజు అర్ధరాత్రి సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడానికి బాలిక భయపడింది. ఈ విషయాన్ని ఆమె తన   స్నేహితురాలికి చెప్పడంతో ఆమె టీచర్‌ దృష్టికి తీసుకెళ్లింది. టీచర్‌ ద్వారా ప్రిన్సిపాల్‌కు, ఆమె ద్వారా తల్లిదండ్రులకు విషయం తెలియగా వారు ఫిలింనగర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు ఖుష్‌డేవ్‌పై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 65(1), 351 (2), సెక్షన్‌ 5 రెడత్‌ విత్‌ 6, పోక్సో చట్టం–2012, సెక్షన్‌ 67 ఐటీ చట్టం–2008 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)