Breaking News

IND Vs ENG: నరాలు తెగే ఉత్కంఠ: టీమిండియా ధనాధన్‌ షో.. .. దర్జాగా ఫైనల్‌కు

Published on Thu, 03/05/2026 - 22:50

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్‌.. ఈసారి కూడా ఫైనల్‌కు చేరి సత్తా చాటింది.

253 పరుగులు
ముంబైలోని వాంఖడేలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ మరోసారి ధనాధన్‌ దంచికొట్టాడు. 42 బంతుల్లో 89 పరుగులతో ఈ వికెట్‌ కీపర్‌బ్యాటర్‌ అదరగొట్టాడు.

వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 39) కూడా వేగంగా ఆడగా.. ఆల్‌రౌండర్లు శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపులు మెరిపించారు. తిలక్‌ వర్మ (7 బంతుల్లో 21) సైతం రాణించాడు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో విల్‌ జాక్స్‌, ఆదిల్‌ రషీద్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్‌కు ఒక వికెట్‌ దక్కింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఆదిలోనే ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (5), వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (7)​ వికెట్లు కోల్పోయింది.

పట్టువదలని విక్రమార్కుడిలా
ఇక టామ్‌ బాంటన్‌ (17) కాసేపు నిలబడగా.. జోస్‌ బట్లర్‌ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా జేకబ్‌ బెతెల్‌ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో పాతుకుపోయాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం బాది.. టీ20 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లలో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఫిన్‌ అలెన్‌ (న్యూజిలాండ్‌) రికార్డు సమం చేశాడు.

నరాలు తెగే ఉత్కంఠ
అదే జోరు కొనసాగిస్తూ బెతెల్ భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో  బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి.. కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లలో ఇంగ్లండ్‌ విజయ సమీకరణం  39 పరుగులుగా మారింది.

అయితే, హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో పందొమ్మిదో ఓవర్లో సిక్స్‌ బాది బెతెల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 45 బంతుల్లోనే 102 పరుగులు సాధించాడు. దీంతో ఉత్కంఠ పెరిగింది. అయితే, పాండ్యా మూడో బంతికి సామ్‌ కర్రాన్‌ (18)ను అవుట్‌ చేశాడు. పాండ్యా బౌలింగ్‌లో కర్రాన్‌ బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న తిలక్‌ అద్భుతంగా క్యాచ్‌పట్టాడు.

ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో
తన ఓవర్లో పాండ్యా 9 పరుగులే ఇవ్వగా.. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్‌ గెలుపునకు 30 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బంతిని శివం దూబేకు ఇచ్చాడు.  అతడి ఓవర్లో తొలి బంతికే బెతెల్‌ (105) రనౌట్‌ అయ్యాడు. దీంతో ఐదు బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా.. ఆర్చర్ ఆఖరి మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టినా లాభం లేకుండా పోయింది. 

ఇంగ్లండ్‌ 22 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా టీమిండియా ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది.  ఇక అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో ట్రోఫీ కోసం సూర్యకుమార్‌ సేన తలపడుతుంది.

 

 స్కోర్లు: 
భారత్ - 253/7(20)
ఇంగ్లండ్ - 246/7(20)
ఫలితం: ఏడు పరుగుల తేడాతో భారత్ గెలుపు.
 

 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)