Breaking News

భారత్‌ చేతిలో ఓడినా.. చరిత్ర సృష్టించిన పాక్‌

Published on Mon, 02/16/2026 - 14:07

టీమిండియా చేతిలో ఓడినా పాకిస్తాన్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో రెండుసార్లు 18 ఓవర్లపాటు స్పిన్‌ బౌలింగ్‌నే ప్రయోగించిన తొలి జట్టుగా నిలిచింది.

స్పిన్‌ దళంపైనే నమ్మకం
టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నీలో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్‌ ఆదివారం టీమిండియాతో తలపడిన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న పాక్‌.. తమ స్పిన్‌ దళంపైనే ఎక్కువగా ఆధారపడింది. స్పెషలిస్టు స్పిన్నర్లలో ఉస్మాన్‌ తారిఖ్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 24 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌ తీయగా.. అబ్రార్‌ అహ్మద్‌ మూడు ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చుకున్నాడు.

ఇక బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్లు సల్మాన్‌ ఆఘా రెండు ఓవర్లు వేసి 10 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీయగా.. నాలుగు ఓవర్ల కోటాలో సయీమ్‌ ఆయుబ్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు షాదాబ్‌ ఖాన్‌ ఒక ఓవర్‌ వేసి 17 రన్స్‌, మొహమ్మద్‌ నవాజ్‌ 4 ఓవర్లలో 28 రన్స్‌ ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు.

షాహిన్‌ ఆఫ్రిది విఫలం
ఇలా నిర్ణీత 20 ఓవర్లలో 18 ఓవర్లు పాక్‌ స్పిన్నర్లే వేయగా.. ఏకైక పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది రెండు ఓవర్లు వేసి ఏకంగా 31 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. కాగా పాక్‌ ఇలా స్పిన్‌ దళాన్నే నమ్ముకోవడం ఇదే తొలిసారి కాదు. 2012 టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆస్ట్రేలియా మీద కూడా ఇదే తరహాలో ఇదే వేదికపై స్పిన్‌ అస్త్రాన్ని ప్రయోగించింది పాక్‌.

తద్వారా పొట్టి వరల్డ్‌కప్‌ ఈవెంట్లో అత్యధికంగా రెండుసార్లు 18 ఓవర్లు స్పిన్‌ వేయించిన తొలి జట్టు పాకిస్తాన్‌ నిలిచింది. కాగా కొలంబో పిచ్‌ స్పిన్‌కు అనుకూలం అన్న సంగతి తెలిసిందే. ఇక భారత్‌తో మ్యాచ్‌లో పాక్‌ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది.

టీమిండియా ఇలా
ఈ మ్యాచ్‌లో పాక్‌ ప్రధానంగా స్పిన్‌ను నమ్ముకుంటే.. టీమిండియా పేసర్లకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. భారత పేసర్లలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మూడు ఓవర్లు వేసి కేవలం 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా రెండు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు.

ఇక స్పిన్నర్లలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీయగా.. వరుణ్‌ చక్రవర్తి మూడు ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్‌ యాదవ్‌ మూడు ఓవర్లు వేసి ఒక వికెట్‌ పడగొట్టగా.. పార్ట్‌టైమ్‌ స్పిన్నర్లు తిలక్‌ వర్మ రెండు ఓవర్లు వేసి ఒక వికెట్‌ తీయగా.. రింకూ సింగ్‌ ఒక ఓవర్లో 9 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజా వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో పాకిస్తాన్‌ యూఎస్‌ఏతో మ్యాచ్‌లో కూడా ఏకంగా 16 ఓవర్లు స్పిన్‌ బౌలింగ్‌ వేయించడం గమనార్హం.

చదవండి: అభిషేక్‌ శర్మ ఫెయిల్‌.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)