Breaking News

హైదరాబాద్‌, ఆంధ్ర బోణీ విజయాలు

Published on Wed, 11/05/2025 - 11:35

నాదౌన్‌: రంజీ ట్రోఫీ తాజా సీజన్‌లో హైదరాబాద్‌ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ జట్టుతో మంగళవారం ముగిసిన గ్రూప్‌ ‘డి’ మూడో లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. 

344 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్‌ స్కోరు 8/0తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ జట్టు... 75.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 347 పరుగులు సాధించింది. ఓపెనర్‌ అభిరథ్‌ రెడ్డి (200 బంతుల్లో 175 నాటౌట్‌; 19 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరోచిత సెంచరీ సాధించి హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. 

వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ రాధేశ్‌ (127 బంతుల్లో 66; 8 ఫోర్లు)తో కలిసి అభిరథ్‌ రెడ్డి రెండో వికెట్‌కు 145 పరుగులు జోడించాడు. రాధేశ్‌ అవుటయ్యాక కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (24; 2 ఫోర్లు), హిమతేజ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌), తనయ్‌ త్యాగరాజన్‌ (25 బంతుల్లో 29; 2 ఫోర్లు) సహకారంతో అభిరథ్‌ హైదరాబాద్‌ను లక్ష్యం దిశగా నడిపించాడు. 

మూడో వికెట్‌కు రాహుల్‌ సింగ్‌తో 74 పరుగులు జోడించిన అభిరథ్‌æ.... నాలుగో వికెట్‌కు హిమతేజతో 53 పరుగులు... ఐదో వికెట్‌కు తనయ్‌తో 47 పరుగులు జత చేశాడు. హిమాచల్‌ జట్టు బౌలర్లలో ఆర్యమాన్‌ సింగ్‌ మూడు వికెట్లు తీశాడు. తొలి రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకున్న హైదరాబాద్‌జట్టు ఈ గెలుపుతో తమ ఖాతాలో ఆరు పాయింట్లు వేసుకుంది. 

హిమాచల్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు చేయగా... హైదరాబాద్‌ జట్టు 278 పరుగులకు ఆలౌటైంది. 40 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందిన హిమాచల్‌ 303 పరుగులు చేసి హైదరాబాద్‌కు 344 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గ్రూప్‌ ‘డి’లో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హైదరా బాద్‌ జట్టు పది పాయింట్లతో ముంబై జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది.  

ఆంధ్ర బోణీ
కటక్‌: తొలి రెండు లీగ్‌ మ్యాచ్‌లను ‘డ్రా’తో సరిపెట్టుకున్న ఆంధ్ర క్రికెట్‌ జట్టు రంజీ ట్రోఫీలో తొలి విజయం నమోదు చేసింది. ఒడిశా జట్టుతో మంగళవారం ముగిసిన గ్రూప్‌ ‘ఎ’ మూడో లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర ఇన్నింగ్స్‌ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 

ఫాలోఆన్‌ ఆడుతూ ఓవర్‌నైట్‌ స్కోరు 190/2తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఒడిశా జట్టు 104.2 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. రెండు వికెట్లకు 198 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఒడిశా జట్టు చివరి ఎనిమిది వికెట్లను 80 పరుగుల తేడాలో కోల్పోయింది. 

ఓపెనర్‌ గౌరవ్‌ చౌధురీ (80; 10 ఫోర్లు), వన్‌డౌన్‌ బ్యాటర్‌ సందీప్‌ పటా్నయక్‌ (63; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. మూడో వికెట్‌గా గౌరవ్‌ అవుటయ్యాక ఒడిశా ఇన్నింగ్స్‌ తడబడింది. ఈసారి ఆంధ్ర జట్టుకు ఆడుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎడంచేతి వాటం స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌ 47 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... ఆఫ్‌ స్పిన్నర్‌ త్రిపురణ విజయ్‌ 89 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. 

కావూరి సాయితేజ, శశికాంత్, పృథ్వీరాజ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 475 పరుగులు చేయగా... ఒడిశా తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకు ఆలౌటైంది. ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచినందుకు ఆంధ్ర జట్టుకు ఏడు పాయింట్లు లభించాయి. ఈ మ్యాచ్‌లో 69 పరుగులు చేయడంతోపాటు ఆరు వికెట్లు పడగొట్టిన సౌరభ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.  

చదవండి: భారీ విజయంతో కర్ణాటక బోణీ

 

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)