Breaking News

అనుభవం ఉండి ఏం లాభం?.. మరీ ఇలా ఆడతావా?: డీకే ఫైర్‌

Published on Wed, 06/25/2025 - 12:49

ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా స్టార్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆట తీరును భారత మాజీ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) విమర్శించాడు. జడ్డూ బౌలింగ్‌ చేసిన విధానం తనను ఆశ్చర్యానికి లోనుచేసిందన్నాడు. అనుభవజ్ఞుడైన అతడు విఫలం కావడం వల్ల జట్టు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.

కాగా టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌తో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం- మంగళవారం తొలి టెస్టు జరిగింది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ తన ప్రయాణం మొదలుపెట్టాడు.

అందరికంటే సీనియర్‌
ఇక ఇంగ్లండ్‌కు వెళ్లిన జట్టులో రవీంద్ర జడేజానే అందరికంటే సీనియర్‌. అయితే, తొలి టెస్టులో ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 36 (11, 25 నాటౌట్‌) పరుగులు చేసిన జడ్డూ.. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయాడు.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లు బౌలింగ్‌ వేసిన జడ్డూ.. 68 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడు విఫలం చెందాడు. ముఖ్యంగా ఫలితాన్ని తేల్చే మంగళవారం నాటి ఐదో రోజు ఆటలో భాగంగా జడ్డూ స్థాయికి తగ్గట్లు బౌలింగ్‌ చేయలేకపోయాడు.

ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాటర్ల పని పట్టడంలో ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ విఫలమయ్యాడు. అతడి బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్లు తొలి రెండు సెషన్లలో రివర్స్‌ స్వీప్‌ షాట్లతో తేలికగా పరుగులు పిండుకున్నారు. బెన్‌ డకెట్‌ శతకం (149)తో చెలరేగగా.. టీ బ్రేక్‌ తర్వాత పాత బడిన పిచ్‌పై జడ్డూ మ్యాజిక్‌ చేయగలిగాడు. బెన్‌ స్టోక్స్‌ (33)ను ఎట్టకేలకు పెవిలియన్‌కు పంపాడు.

అనుభవం ఉండి ఏం లాభం?
ఈ విషయంపై భారత మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ స్పందిస్తూ.. ‘‘జడేజా రఫ్‌సైడ్‌ వేయకుండా స్ట్రెయిట్‌గా బౌల్‌ చేశాడు. అది నన్ను ఆశ్చర్యపరిచింది. అన్‌ఈవెన్‌ పిచ్‌పై తన పాత్ర పోషించడంలో విఫలమయ్యాడు.

అనుభవం ఉన్న ఆటగాడు అతడు. అయినా.. ఇలా ఎందుకు ఎలా చేశాడో తెలియదు. వైడ్‌ ఆఫ్‌ ది వికెట్‌ వేయాల్సింది. సరైన చోట బంతులు వేయడంలో జడ్డూ విఫలమయ్యాడు’’ అని విమర్శించాడు.

కాగా తొలి టెస్టులో ఓటమితో గిల్‌ సేన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. ఇక ఇంగ్లండ్‌- భారత్‌ మధ్య జూలై 2- జూలై 6 వరకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో రెండో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది.

భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ తొలి టెస్టు స్కోర్లు
భారత్‌ స్కోర్లు: 471 & 364
ఇంగ్లండ్‌ స్కోర్లు: 465 & 373/5
ఫలితం: ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో భారత జట్టు ఓటమి.

చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్‌ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్‌

Videos

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి

ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?

లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..

తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం

చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక

సభలో అందరిముందు జనసేన గాలి తీసిన బాబు..

Idupulapaya: YSR ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు

Photos

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)