Breaking News

నిన్న యశస్వి.. నేడు బుమ్రా.. ఆధిక్యంలో టీమిండియా

Published on Sat, 02/03/2024 - 17:38

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం చాటుకుంది. వైజాగ్‌లో శనివారం నాటి ఆట ముగిసే సరికి 171 పరుగుల ఆధిక్యం సంపాదించింది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా శుక్రవారం ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

రెండో రోజు డబుల్‌ సెంచరీగా మలిచి
ఈ క్రమంలో  తొలి రోజు భారీ సెంచరీ చేసిన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌.. రెండో రోజు దానిని డబుల్‌ సెంచరీగా మార్చాడు. ఇక 209 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యశస్వి అవుట్‌ కాగా..  టీమిండియా 396 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. శనివారం 336/6 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో రెండు రోజు ఆటను  ఆరంభించిన భారత్‌.. అదనంగా 60 పరుగులు జత చేయగలిగింది.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌కు దిగగా ఓపెనర్‌ బెన్‌ డకెట్‌(21) కుల్దీప్‌ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్‌ జాక్‌ క్రాలే(76) పట్టుదలగా నిలబడ్డాడు. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ అద్భుత అర్ధ శతకంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.

వికెట్ల వేట మొదలుపెట్టి.. ఘనంగా ముగించి
అయితే, అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో బంతిని తప్పుగా అంచనా వేసి షాట్‌ ఆడాలని క్రాలే భావించగా.. శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత క్యాచ్‌తో అతడికి సెండాఫ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తన వికెట్ల వేట మొదలుపెట్టాడు.

హైదరాబాద్‌ టెస్టు హీరో ఒలీ పోప్‌(23), జో రూట్‌(5), బెయిర్‌ స్టో(25), కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌(47) రూపంలో కీలక బ్యాటర్లను అవుట్‌ చేసిన బుమ్రా.. అంతర్జాతీయ టెస్టుల్లో 150 వికెట్ల క్లబ్‌లో చేరాడు.

ఇక టామ్‌ హార్లీ వికెట్‌తో ఈ మ్యాచ్‌లో ఫైఫర్‌ సాధించిన ఈ రైటార్మ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌(6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఆఖరి వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ 55.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో బుమ్రాకు ఆరు, కుల్దీప్‌ యాదవ్‌కు మూడు, అక్షర్‌ పటేల్‌కు ఒక వికెట్‌ దక్కాయి.

171 పరుగుల ఆధిక్యంలో భారత్‌
ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓవరాల్‌గా 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ 13, యశస్వి జైస్వాల్‌ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖలో గెలిచి 1-1తో సమం చేయాలని రోహిత్‌ సేన పట్టుదలగా ఉంది. 

చదవండి: ఇలాంటి బాల్‌ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్‌ బౌల్డ్‌.. రియాక్షన్‌ వైరల్‌

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)