Breaking News

BCCI: నితీశ్‌ రెడ్డితో పాటు అతడూ అవుట్‌.. జట్టులోకి కొత్త ప్లేయర్‌

Published on Mon, 07/21/2025 - 12:25

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు (IND vs ENG)కు ముందు టీమిండియాకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే రిషభ్‌ పంత్‌ (Rishbah Pant) వేలి గాయంతో కేవలం బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడని తెలుస్తుండగా.. యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

ఎడమ మెకాలికి గాయమైన కారణంగా ఈ ఆంధ్రా కుర్రాడు.. ఇంగ్లండ్‌ నుంచి తిరిగి స్వదేశానికి రానున్నాడు. మరోవైపు.. యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా మాంచెస్టర్‌ టెస్టుకు దూరమయ్యాడు. బెకెన్‌హామ్‌లో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సందర్భంగా అతడి ఎడమ చేతి వేలికి గాయమైంది.

నాలుగో టెస్టుకు దూరం
ఈ క్రమంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందం పర్యవేక్షణలో అర్ష్‌దీప్‌ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే, ఈ పంజాబీ బౌలర్‌ ఇప్పట్లో కోలుకునేలా లేడు. అందుకే నాలుగో టెస్టుకు అతడు దూరమయ్యాడు.

ఈ నేపథ్యంలో మెన్స్‌ సెలక్షన్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అన్షుల్‌ కంబోజ్‌ను జట్టుకు ఎంపిక చేసింది. మాంచెస్టర్‌ టెస్టు సందర్భంగా అతడు జట్టుతో చేరనున్నాడు. ఇందుకు సంబంధించి బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

గాయాల బెడద
కాగా శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లింది. టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే మూడు పూర్తికాగా ఆతిథ్య ఇంగ్లండ్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. 

ఎడ్జ్‌బాస్టన్‌లో చారిత్రాత్మ​ విజయం సాధించిన టీమిండియా.. మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్టు (జూలై 23- 27)నూ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అయితే, ఈ వేదికపై ఇంత వరకు ఒక్కసారి కూడా టీమిండియా టెస్టు గెలవకపోవడం.. పైగా ఇలా గాయాల బెడద వేధిస్తుండటం ఆందోళనకరంగా మారింది.

ఇదిలా ఉంటే.. లీడ్స్‌లో ఆడిన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు బదులు.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి రెండో టెస్టు నుంచి జట్టులోకి వచ్చాడు. అయితే, అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. చివరగా లార్డ్స్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు మొత్తంగా కేవలం 43 పరుగులే చేశాడు.

మరోవైపు.. టీమిండియా తరఫున టీ20, వన్డేలలో అదరగొడుతున్న అర్ష్‌దీప్‌ ఇంత వరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. ఇక హర్యానాకు చెందిన అన్షుల్‌ కాంబోజ్‌ ఇటీవల ఇంగ్లండ్‌తో భారత్‌-‘ఎ’ జట్టు తరఫున అనధికారిక సిరీస్‌ ఆడాడు. 

నార్తాంప్టన్‌లో జరిగిన రెండో టెస్టులో నాలుగు వికెట్లు తీసిన అన్షుల్‌ రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో వచ్చి అజేయ అర్ధ శతకం (51) సాధించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 24 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు తీయడంతో ఆపటు 486 పరుగులు చేశాడు.

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత జట్టు (అప్‌డేటెడ్‌ ):
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌ & వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్‌ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్.

చదవండి: BAN vs PAK: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)