Breaking News

కేసీఆర్‌ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: షర్మిల 

Published on Sat, 12/10/2022 - 00:53

కవాడిగూడ/హైదరాబాద్‌: ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు వైఎస్‌ఆర్‌టీపీ చేపట్టిన మహాప్రస్థానం పాదయాత్రను అడ్డుకుని సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ వరంగల్‌ పోలీసులు నిరాకరించడం వెనక కేసీఆర్‌ కుట్ర దాగి ఉందని ఆరోపించారు.

పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ షర్మిల శుక్రవారం హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.అక్కడే నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌టీపీ నేతలు, కార్యకర్తలు కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో షర్మిలను, పార్టీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో దాదాపు రెండు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు శాంతియుతంగా 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినా ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని, వ్యక్తిగతంలో తాను ఎక్కడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదని, ఎవరినీ కించపర్చలేదని అన్నారు. పోలీసులను కేసీఆర్‌ జీతగాళ్లుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అరెస్టు చేసిన షర్మిలను పోలీసులు లోటస్‌పాండ్‌కు తరలించారు.  

షర్మిల కన్నీటిపర్యంతం: రోడ్డుపై దీక్ష చేస్తున్న షర్మిలని సోలీసులు బలవంతంగా దీక్ష ప్రాంగణం మీదకు తీసుకువచ్చారు. ఈ చర్యతో షర్మిలకు, పార్టీ నేతలకు గాయాలయ్యాయి. పోలీసుల వైఖరితో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘నా ప్రాపర్టీలో నేను ఏం చేసుకుంటే ఏంటి’అని ప్రశ్నించారు. మా వాళ్లందరినీ విడుదల చేసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను’అని హెచ్చరించారు.

Videos

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో బిగ్ అప్‌డేట్

జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేష్.. గంటా కొడుకు అత్యుత్సాహం

బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం

పసి మనసులను చంపేస్తోన్న వివాహేతర సంబంధాలు

ఎల్లో మీడియా వేషాలు

Photos

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)