Breaking News

కుట్రలకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు: లక్ష్మీపార్వతి

Published on Fri, 02/27/2026 - 14:41

సాక్షి, తాడేపల్లి: కుట్రలకు కేంద్రం, పాపాలకు కేంద్ర బిందువు చంద్రబాబు అంటూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిస్సిగ్గు రాజకీయాలు చంద్రబాబుకే చెల్లు అని దుయ్యబట్టారు. ‘‘చేసిన పాపాలు పండాయి.. ఇక శిక్ష అనుభవించటమే తరువాయి.. చంద్రబాబుకు దేవునిపై ఏమాత్రం భక్తి లేదు. దేవుడ్ని నమ్మనని 1995లోనే చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యక్తి కాబట్టే తిరుమల లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు’’ అని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు.

‘‘వైఎస్ జగన్ మీద దారుణమైన విమర్శలు చేశారు. దొంగదారిలో ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు జీవితం అంతా అత్యంత వివాదాస్పదమే. యూనివర్సిటీలో కూడా రెడ్డి, కమ్మల మధ్య గొడవలు పెట్టారు. తన అవసరాలకు ఎవర్నయినా, ఎలాగైనా వాడతారు. ఒక్కో ఎలక్షన్‌కు ఒక్కో పార్టీని వాడుకుంటున్నారు. మోదీని తీవ్రంగా విమర్శలు చేసి మళ్లీ ఆయన చెంతకే చేరారు. కాంగ్రెస్‌ని విమర్శలు చేసి మళ్లీ అదే పార్టీకి చేరారు.

..అతి పేదరికంలో పుట్టిన చంద్రబాబుకు డబ్బు మీద విపరీతమై ఆశ ఉంది. లక్షల కోట్లు సంపాదించాలనే లక్ష్యం తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం లేదు. ఏ మమకారం లేని చంద్రబాబు తన భార్యను కూడా రాజకీయాలకు వాడుకున్నారు. చంద్రబాబు ఆరు లక్షల కోట్లు సంపాదించారు. ఎన్నిసార్లు సీఎం అయినా ఏపీకి ఒక్క ప్రాజెక్టు అయినా తెచ్చారా?

..ఎవరో తెచ్చిన ప్రాజెక్టును తానే తెచ్చానని గొప్పగా చెప్పుకుంటారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు నిష్ణాతులు. హెరిటేజ్ సంస్థలోని వాటాదారులను కూడా బలవంతంగా బయటకు పంపారు. కుట్రలకు కేరాఫ్ అడ్రెస్ చంద్రబాబు. ఆయన చదువుకునే సమయంలో పరీక్షలను కూడా వేరే వారితో రాయించి పాస్ అయ్యారు. ఆయన చెప్పుకునే వయసు కూడా కరెక్టు కాదు. షూ లేకుండా దేవుని పూజలు ఎప్పడైనా చేశారా?. దేవుడ్ని రాజకీయాల్లోకి తెచ్చిన చంద్రబాబు కఠినమైన శిక్ష అనుభవిస్తారు. రాయలసీమ లిఫ్టును ఆపేసి ఆ ప్రాంత ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. లడ్డూలో కల్తీ నెయ్యి వెనుక హెరిటేజ్ ఉందని తేలింది.

ఎలా ముంచావో అందరికి తెలుసు.. హేరిటేజ్ బాగోతాన్ని బయటపెట్టిన లక్ష్మి పార్వతి

..అసెంబ్లీలోనూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. వైఎస్సార్‌సీపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారు. చంద్రబాబు చేసే ఆరోపణలు చూస్తుంటే ఆయనకు మైండ్‌ పని చేయటం లేదని అర్థం అవుతోంది. అందుకే వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలపై ఆరోపణలు చేస్తున్నారు. సుబ్బారెడ్డి భార్య మీద కూడా ఆరోపణలు చేశారంటే చంద్రబాబు అంత నీచుడు మరొకరు లేరు. హిందూ, క్రైస్తవుల మధ్య గొడవలు సృష్టించటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్‌ని హతమార్చి ఆయన కుటుంబాన్ని సైతం కనుమరుగు చేసిన నీచుడు చంద్రబాబు’’ అంటూ లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)