Breaking News

బరాబర్‌ ధరణిని రద్దు చేస్తాం

Published on Sat, 03/11/2023 - 02:15

సాక్షి, పెద్దపల్లి/జగిత్యాల రూరల్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్‌ను బరాబర్‌ రద్దుచేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్‌లో భూసమస్యలు ఎదుర్కొంటున్న గ్రామస్తులతో మీభూమి– మీహక్కు నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ ‘ధరణి అదాలత్‌’గ్రామసభను నిర్వహించింది.

ధరణి పోర్టల్‌లో పేర్లు నమోదుకాక, ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల సమస్యలను కాంగ్రెస్‌ నేతలు తెలుసుకున్నారు. తర్వాత వారికి కాంగ్రెస్‌ పార్టీ తరఫున గ్యారంటీ కార్డులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, కొప్పుల రాజు తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

భూస్వాములు, కేసీఆర్‌ కుటుంబీకుల కోసమే ధరణి పోర్టల్‌ తీసుకొచ్చారని.. అందువల్లే గతంలో కాంగ్రెస్‌ పార్టీ పేదలకు పంచిన 22 లక్షల ఎకరాల భూమి భూస్వాముల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. సీసీఎల్‌ఏ చేతిలో ధరణి పోర్టల్‌ లేదని.. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఒక ప్రైవేట్‌ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి, వెనక నుంచి కేసీఆర్‌ కుటుంబీకులు వేలకోట్లు కాజేస్తున్నారని విమర్శించారు. 

అన్ని గ్రామాల్లో ‘ధరణి అదాలత్‌’ 
ధరణి పేరుతో కేసీఆర్‌ సర్కారు పేదల భూములను కబళిస్తోందని.. పేదలకు తిరిగి భూహక్కులు కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ఏఐసీ సీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే చెప్పారు. రాష్ట్రంలో ఫ్యూడల్‌ వ్యవస్థను తిరిగి తీసుకురావడానికే ధరణి పోర్టల్‌ తీసుకొచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.

దివంగత సీ ఎం వైఎస్సార్, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోనే పేదలకు భూయాజ మాన్య హక్కులు కల్పించారని.. బీఆర్‌ఎస్‌ సర్కారు ఆ భూములను లాక్కుంటోందని జాతీయ నేత కొప్పుల రాజు ఆరోపించారు. 

కాంగ్రెస్‌ పంచ సూత్రాలివీ.. 
ధరణి పోర్టల్‌లో 60 లక్షల మంది పేర్లు ఉంటే.. అందులో దాదాపు 20 లక్షల ఖాతాల్లో పేరు, స ర్వే నంబర్‌తోపాటు చాలా తప్పులున్నాయి. అ న్నీ దిద్ది ఎవరి భూమిపై వారికి హక్కులివ్వాలి. 
మేమొచ్చాక రెండేళ్లలో భూముల రీసర్వే. 
 రాష్ట్రంలోని 125 భూచట్టాలు, 3 వేల జీవోలు ఉన్నాయి. వాటన్నింటినీ ఒకే చట్టంగా తీసుకొస్తాం
బలవంతపు భూసేకరణ పూర్తిగా నిషేధిస్తాం. భూయజమాని అనుమతి లేకుండా సేకరించవద్దంటూ 2013లో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచి్చన చట్టాన్ని కచి్చతంగా అమలు చేస్తాం. 
 తెలంగాణలోని 15 లక్షల మంది కౌలు రైతులకు పథకాలు అందిస్తాం. 

కవితను బహిష్కరించలేదేం: రేవంత్‌రెడ్డి 
అవినీతికి పాల్పడితే కొడుకైనా, బిడ్డ అయినా జైలులో పెడతానని కొన్నిరోజుల కింద సీఎం కేసీఆర్‌ చెప్పారని, మరి మద్యం కుంభకోణానికి పా ల్పడిన ఎమ్మెల్సీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై ఆరోపణలు వస్తేనే పద వి నుంచి బర్తరఫ్‌ చేశారని గుర్తు చేశారు. 

ఇద్దరూ ఆడపిల్లలే..పట్టా పాస్‌బుక్‌ ఇవ్వాలి 
కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భూమిని కేటాయించి లావణి పట్టా ఇచ్చారు. ఇప్పుడు ధర ణి తెచ్చాక భూమిని ఆ న్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో పట్టా దారు పాస్‌బుక్‌ ఇవ్వలేదు. నాకు ఇద్దరు ఆడ పిల్లలే. పనిచేస్తేనే పూటగడిచేది. సర్కార్‌  ఇప్పటికైనా పాస్‌బుక్‌ ఇవ్వాలి.       – కవ్వంపల్లి జ్యోతి

Videos

భారత్ అంటే వణుకు నిజం ఒప్పుకున్న పాక్ ఎంపీ

రోజులు దగ్గర పడ్డాయి.. బాబు సర్కారుకు సజ్జల వార్నింగ్

భారత్ బాలిస్టిక్ క్షిపణులు, వీటి పవర్ చూస్తేనే సగం చస్తారు

పాక్ ను చీల్చి చెండాడిన ఆయుధాలను.. గూస్‌ బంప్స్‌ గ్యారెంటి వీడియో

యుద్ధంలో తెలుగు జవాన్ మృతి ..తల్లిదండ్రులను ఓదార్చిన జగన్

మరో పెద్ద తలకాయ లేచింది!

పాక్ ఆర్మీ బేస్ పై విరుచుకుపడిన భారత్ డ్రోన్లు

మరోసారి దాడికి పాక్ ప్లాన్.. మోదీ కీలక ఆదేశాలు

నీ నటన సూపర్ బాబు,పవన్ ను ఏకిపారేసిన కేఏ పాల్

పాక్‌తో యుద్ధంలో తెలుగు జవాన్ వీరమరణం

Photos

+5

హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి రోజు.. భర్తతో ఇలా (ఫొటోలు)

+5

War Updates: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ

+5

వేల్స్ యూనివర్సిటీ, సినీ బ్యానర్‌ అధినేత కూతురి పెళ్లిలో ప్రముఖులు (ఫోటోలు)

+5

బర్త్ డే స్పెషల్.. సాయిపల్లవి గురించి ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)

+5

అన్నవరం : కన్నుల పండువగా సత్యదేవుని దివ్య కల్యాణోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సైన్యానికి సంఘీభావం..సీఎం రేవంత్‌ క్యాండిల్ ర్యాలీ (ఫొటోలు)

+5

తిరుపతి : గంగమ్మా..కరుణించమ్మా సారె సమర్పించిన భూమన (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ గురించి 10 ఆసక్తికర విషయాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని గ్లామరస్ స్టిల్స్ (ఫొటోలు)

+5

అరుణాచల దర్శనం చేసుకున్న నటుడు ప్రభాకర్ ఫ్యామిలీ (ఫొటోలు)