Breaking News

దళితులకు కేసీఆర్‌ దగా 

Published on Mon, 09/26/2022 - 02:34

సాక్షి, హైదరాబాద్‌: అధికారంలోకి వచ్చిననాటి నుంచే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల్ని మోసగిస్తోందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి తానే సీఎం అయి మొదట మోసం చేసిన కేసీఆర్‌ ఆ రోజు నుంచి ఇప్పటివరకు దళితులను అన్నిరకాలుగా దగా చేస్తూనే ఉన్నారని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగమని ఇచ్చిన హామీ కూడా అమలుకాలేదని గుర్తుచేశారు.

తాజాగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ముందు దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి మరోసారి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గాలలోని టీఆర్‌ఎస్‌ నాయకులకు మాత్రమే దళితబంధు ఇస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే అన్ని దళిత కుటుంబాలకు ఇవ్వాలని అన్నారు. నిరుద్యోగ భృతి కింద రూ.3,116 ఇస్తామని చెప్పి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌లో పొరపాట్ల కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పొరపాట్లపై ఇప్పటివరకు 4 లక్షల మంది ఫిర్యాదు చేశారని అన్నారు.

రైతుల రుణమాఫీ విషయంలో కూడా కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. గిరిజనుల పోడుభూములు గుంజుకుంటూ గిరిజన హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చి 8 ఏళ్లయినా ఇంకా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాటి రేషన్‌కార్డులే ఉండటం సిగ్గుచేటని, రేషన్‌కార్డులు కూడా ఇవ్వలేని అసమర్థత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని విమర్శించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు రూ.5 లక్షల కోట్లకు పెరిగాయని, ఇంకా కావాలని కేంద్రాన్ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని అన్నారు. 8 ఏళ్లుగా గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులిచ్చారో చెప్పాలని, దీనిపై చర్చించేందుకు కేంద్రం రెడీగా ఉందని, కేసీఆర్‌ సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. అబద్ధాలు ఆడటంలో కేసీఆర్‌ కుటుంబం నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని విమర్శించారు.    

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)