Breaking News

మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు 

Published on Tue, 08/15/2023 - 02:50

సాక్షి, హైదరాబాద్‌:  సుమారు రూ.6 లక్షల కోట్ల అప్పుతో మిగులు రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అనేక రాష్ట్రాలు తమ ఆదాయం పెంచు కుంటుంటే.. ఇక్కడి ప్రభుత్వం మాత్రం మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ రా ష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

రియల్‌ ఎస్టేట్‌ సంస్థలా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వద్ద.. ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి, పేద ప్రజల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు మాత్రం స్థలం ఉండదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున తాను స్వయంగా అనేక ఉత్తరాలు రాసి రైల్వే టర్మినళ్లకు, చర్లపల్లిలో రైల్వే స్టేషన్‌విస్తరణకు భూమి కావాలన్నా ఇవ్వడం లేదని విమర్శించారు. కోకాపేట, బుద్వేల్, ఖాజాగూడ, మన్నెగూడ, ఆదిభట్ల లాంటి అనేకచోట్ల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని విమర్శించారు.  

పార్టీల పేరుతో పంచుకున్నారు.. 
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌రెండు పార్టీలు కుమ్మక్కై వందల కోట్ల విలువ చేసే భూములను పార్టీలకు కేటాయింపుల పేరుతో అక్రమంగా తీసుకున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. విలువైన భూములను కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పంచుకున్నాయని, కాంగ్రెస్‌ పార్టీకి ఏ ప్రాతిపదికనైతే భూమి ఇచ్చామో, బీఆర్‌ఎస్‌కు అదే ప్రాతిపదికన తీసుకున్నామని సిగ్గు లేకుండా జీవోలో చెప్పుకున్నారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కుటుంబం, వాళ్ల అనుచరులు, బినామీల పేర్లమీద భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. భావితరాల కోసం భూములను రక్షించాల్సి న అవసరం ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు. 4 నెలల తర్వాత అధికారంలోకి వచ్చే బీజేపీ ప్రభుత్వం.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు భూమి కేటాయింపులకు సంబంధించిన జీవోలను రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. భూముల వేలాన్ని కూడా బీజేపీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. కాగా సోమవారం బీజేపీ కార్యాలయానికి వచ్చిన సినీనటి జయసుధను ఈ సందర్భంగా సత్కరించారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)