Breaking News

కిషన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి 

Published on Wed, 03/22/2023 - 02:33

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత సెల్‌ఫోన్లను ధ్వంసం చేశారని గతంలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉపసంహరించుకోవాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నా రు. ఈడీ విచారణలో భాగంగా తాను గతంలో ఉపయోగించిన 10 సెల్‌ఫోన్లను మంగళవారం కవిత అధికారులకు సమ ర్పిం చినందున... కిషన్‌రెడ్డి కవితకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని కిషన్‌రెడ్డి ఎలాంటి ఆధారాలతో ఆరోపణలు చేశారని ఆయన ప్రశ్నించారు. శ్రీనివాస్‌ గౌడ్‌ మంగళవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కిషన్‌రెడ్డి ఏ ఆధారాలు లేకుండా ఊహించుకొని అబద్ధాలతో ఒక మహిళ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరన్న విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తుంచుకోవాలని హితవు పలికారు.  

తెలంగాణ ఆడబిడ్డపై కక్ష సాధింపు: సీఎం కేసీఆర్‌ను, దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక తెలంగాణ ఆడబిడ్డ కవితపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. దేశంలో లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకొని విదేశాలకు పారిపోయిన అవినీతిపరులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టుకోవట్లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అంతేగాక లక్షల కోట్లు కొల్లగొట్టిన వారిని వదిలిపెట్టి ఉల్లిగడ్డపై పొట్టు లాంటి రూ.100 కోట్ల స్కామ్‌ అనే పేరుతో లేని అధారాలను సృష్టించి కవితను వేధిస్తూ అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్ని స్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం వచ్చినప్పటి నుంచి కొందరు అనవసర వ్యాఖ్యలు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటలపాటు విచారణ చేస్తూ సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని కేంద్రంలోని బీజేపీ గుర్తుంచుకోవాలని, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారని శ్రీనివాస్‌ గౌడ్‌ మండిపడ్డారు. మాటిమాటికి సౌత్‌గ్రూప్‌ అనే పేరుతో దక్షిణ భారతదేశాన్ని, తెలంగాణ మహిళలను కేంద్ర ప్రభుత్వం బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. నిష్పక్షపాతంగా పనిచేసే దర్యాప్తు సంస్థలను, అధికారులను తమకు అనుకూలంగా పనిచేయాలని చెప్పడం దేశానికే అరిష్టమన్నారు.   

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)