లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం
కన్న కొడుకులా ఆదరిస్తే ఆస్తికోసం పెద్దమ్మనే కడతేర్చాడు, చివరికి
Published on Tue, 02/24/2026 - 16:11
తోడబుట్టిన చెల్లెలే కదా అని ఆదరించింది. ఆమె కొడుకును కన్నకొడుకు కంటే మిన్నగా చూసుకుంది. కట్ చేస్తే ఇద్దరూ కలిసి ఆమె ప్రాణమే తీసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఫిబ్రవరి 19న స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో ఫస్ట్ డివిజన్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జయలక్ష్మి (58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తొలుత అందరూ ఆమెది సహజ మరణమే అనుకున్నారు. కానీ జయలక్ష్మి లివ్-ఇన్ భాగస్వామి శ్రీనివాస్ అనుమానాలు వ్యక్తం చేస్తూ చిక్కనాయకనహళ్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం తెలిసింది.
జయలక్ష్మి సోదరి, ఆమె కొడుకే హత్య చేశారని చిక్కనాయకనహళ్లి పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఊపిరి ఆడకుండా చేయడం వల్లే ఆమె చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదిక కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో సోదరి అనసూయ, ఆమె కుమారుడు చంద్రశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 19న జయలక్ష్మి మృతి చెందగా, ఒక రోజు తర్వాత ఆమె అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తుండగాఅసలు విషయం తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: అతని కోసం రూ.8 లక్షలు అప్పు: అంతా క్షణాల్లో మాయం!
పోలీసులు సమాచారం ప్రకారం జయలక్ష్మి భర్త, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, 19 సంవత్సరాల క్రితం మరణించాడు. భర్త చనిపోయాక ఆమె శ్రీనివాస్ అనే వ్యక్తితో లివ్-ఇన్ రిలేషన్షిప్లోకి ప్రవేశించింది. అటు జయలక్ష్మి సోదరి అనసూయ తన భర్తతో విభేదాలతో విడిగా ఉంటోంది. దీంతో జాలి తలచి అధికారికంగా చంద్రశేఖర్ను దత్తత తీసుకున్నట్టు రికార్డులు లేనప్పటికీ సొంత కొడుకు కంటే మిన్నగా ఆదరించింది. చదువుకు అన్ని విధాలా సాయపడింది. అయితే ఇటీవల అనసూయ, కొడుకు జయలక్ష్మి, శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి మకాం మార్చారు. దీంతో గొడవలు మొదలయ్యాయి. చివరికి జయలక్ష్మ , శ్రీనివాస్ కొత్త లీజుకు తీసుకున్న నివాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో జయలక్ష్మి నుంచి రావాల్సిన సాయం అందదని, ఆమె ఆస్తులన్నింటినీ తన భాగస్వామికి బదిలీ చేస్తుందని భయపడి, తల్లీకొడుకు హత్యకు కుట్ర పన్నారు. ఆమె మరణం తర్వాత వారు కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాలని కూడా ప్లాన్ చేశారట.
Tags : 1