Breaking News

భారత్‌–రష్యా బంధానికి కొత్త శక్తి!

Published on Sat, 11/29/2025 - 04:37

న్యూఢిల్లీ: రష్యా అధినేత పుతిన్‌ వచ్చేనెల 4, 5వ తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. 23వ ఇండియా–రష్యా వార్షిక సదస్సుకు ఆయన హాజరవుతారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. మోదీ ఆహ్వానం మేరకు పుతిన్‌ రాబోతున్నారని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. 

పుతిన్‌ అధికారిక పర్యటన పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల మరింత బలపడడానికి ఈ పర్యటన దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ తదితర రంగాల్లో కీలకమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పుతిన్‌–మోదీ భేటీ తర్వాత ఉమ్మడి ప్రకటన విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అలాగే కొన్ని ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పుతిన్‌ రాకతో భారత్‌–రష్యా బంధానికి నూతన శక్తి లభించడం తథ్యమని అంటున్నారు. 

ముడి చమురుపై అదనపు డిస్కౌంట్లు? 
స్థానిక కరెన్సీల్లో వాణిజ్య లావాదేవీలను మరింత ముందుకు తీసుకెళ్లడం, ఇంధన రంగంలో సహకారం, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడం వంటి అంశాలపై పుతిన్, మోదీ చర్చించబోతున్నారు. పౌర అణు ఇంధన రంగంలో సహకారంపైనా సంప్రదింపులు జరుగనున్నాయి. అంతేకాకుండా రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాల్లో పురోగతిని వారు సమీక్షిస్తారు. 

ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకుంటారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రష్యా అధ్యక్షుడి గౌరవార్థం ప్రత్యేక విందు ఇవ్వబోతున్నారు. మరోవైపు రష్యా నుంచి అత్యాధునిక ఆయుధాల కొనుగోలుపై భారత్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే ఎస్‌–400 మిస్సైల్‌ వ్యవస్థలను అదనంగా కొనుగోలు చేయడంపై పుతిన్‌పై చర్చించనున్నట్లు సమాచారం. 

భారత్‌కు పుతిన్‌ శుభవార్త చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదు. ముడి చమురుపై అదనపు డిస్కౌంట్లను ఆయన ప్రకటించే వీలుందని అంచనా వేస్తున్నారు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇటీవలి కాలంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. 

చమురు ఎగుమతులను భారీగా పెంచాలని పుతిన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. పుతిన్‌ చివరిసారిగా 2021లో ఇండియాలో పర్యటించారు. గత ఏడాది జూలైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించి, పుతిన్‌తో భేటీ అయ్యారు. భారత్‌–అమెరికా సంబంధాలు గత రెండు దశాబ్దాల్లో ఏనాడూ లేనంతగా బలహీనపడిన సమయంలో పుతిన్‌ భారత్‌ పర్యటనకు వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఆదివారం విశాఖపట్నం బీచ్ లో ఇలా...(ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు)