Breaking News

పళ్లు ఊడిపోయాయని ఏకంగా ప్రధాని మోదీకే లెటర్‌, వైరల్‌

Published on Wed, 09/29/2021 - 11:45

సాధారణంగా ఊరిలోని సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు లేఖలు రాయడం తెలిసిందే. ఆ మధ్య కాలంలో విచిత్రంగా కొంతమంది తమ ప్రేమ కోసం, కనిపించకుండా పోయి వాటిని వెతికి పెట్టాలంటూ వింత కారణాలతో అధికారులకు, ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్నారు. అయితే తాజాగా ఇద్దరు చిన్నారులు తమ పాల దంతాలు ఊడిపోతున్నాయని ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. అస్సాంలోని గువాహటికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ పాల దంతాలు ఊడిపోవడం వల్ల ఇష్టమైన ఆహారాన్ని నమిలి తినడం కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు లేఖ రాశారు. 
చదవండి: ‘మై హీరో..’ చిన్నారి హార్ట్‌ టచింగ్‌ లేఖ

ఆరేళ్ల రాయిసా రౌజా అహ్మద్, ఐదేళ్ల ఆర్యన్ అహ్మద్ అనే ఇద్దరి చిన్నారులకు  దంతాలు పెరగకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో తమ సమస్యలను ఉన్నత అధికారులకు విన్నపించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంకేంముంది అనుకుందే తడవుగా ఇద్దరు పిల్లలు తమ సమస్యను చెబుతూ నోట్‌బుక్‌లో రాశారు. ‘హిమంత బిశ్వ శర్మ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మా పాల ఊడిపోయాయి. మళ్లీ దంతాలు పెరగడం లేదు. దయచేసి అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అంటూ క్యూట్‌గా విన్నవించారు. దీనిని పిల్లల మామయ్య ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. 
చదవండి: Factcheck: బోస్‌ మరణవార్తని చదువుతున్న బోస్‌!!.. ఇదీ అసలు విషయం

‘నా మేనకోడలు రౌజీ, మేనల్లుడు ఆర్యన్ నన్ను నమ్మండి. నేను ఇంట్లో లేను. నేను డ్యూటీలో ఉన్నాను, నా మేనకోడలు, మేనల్లుడు సొంతంగా రాశారు. దయచేసి వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని నమలలేకపోతున్నందున.. వారి దంతాల కోసం అవసరమైన చర్యలు తీసుకోండి ’ అంటూ సరదాగా ట్వీట్‌ చేశారు. సెప్టెంబర్‌ 25న షేర్‌ చేసిన ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘అరే ఇది నిజంగానే పెద్ద సమస్యే.. చిన్నారులు అడిగిన విధానం బాగుంది. వాళ్ల సమస్యకు పరిష్కారం చూపాల్సిందే’ అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)