Breaking News

సీసీఎస్‌ అత్యవసర సమావేశం.. నెతన్యాహుకు మోదీ ఫోన్‌

Published on Mon, 03/02/2026 - 07:23

ఢిల్లీ: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహుతో మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రస్తుత దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, శాంతి దిశగా చర్యలు తీసుకోవాలని మోదీ.. నెతన్యాహుకు సూచించినట్టు చెప్పుకొచ్చారు.

ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడితోనూ మాట్లాడినట్టు ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఈ సందర్బంగా మోదీ.. ఇరాన్‌తో యుద్ధం, తాజా పరిణామాలపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. పౌరుల భద్రతే ప్రాధాన్యమని స్పష్టం చేశారు. శాంతి దిశగా చర్యలు చేపట్టాని నెతన్యాహుకు సూచించినట్టు తెలిపారు. అలాగే, యూఏఈపై దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్‌ దాడుల్లో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. యూఏఈకి భారత్‌ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తామని.. శత్రుత్వాలను త్వరగా నిలిపివేయాల్సిన అవసరాన్ని భారత్‌ పునరుద్ఘాటిస్తుందని మోదీ చెప్పుకొచ్చారు.

సీసీఎస్‌ అత్యవసర సమావేశం..  
అయితే.. భద్రత, వ్యూహాత్మక వ్యవహారాలపై భారతదేశ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన కొన్ని గంటల తర్వాత ఈ సమాచారం వచ్చింది. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలలో రెండు రోజుల పర్యటన నుండి ఆయన న్యూఢిల్లీకి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత చమురు దిగుమతులకు కీలకమైన షిప్పింగ్ మార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల కలిగే ప్రభావాన్ని కూడా CCS అంచనా వేసినట్టు తెలుస్తోంది.

మధ్యప్రాచ్యంలోని భారతీయ పౌరుల భద్రత, వివాదం మరింత తీవ్రమైతే అత్యవసర ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. దాదాపు 10,000 మంది భారతీయులు ఇరాన్‌లో, 40,000 మందికి పైగా ఇజ్రాయెల్‌లో, పశ్చిమాసియా మరియు గల్ఫ్‌లో సుమారు తొమ్మిది మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నట్టు సమాచారం. తాజా దాడుల నేపథ్యంలో వారి భద్రతపై ఆందోళన నెలకొంది.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)