Breaking News

భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం

Published on Sun, 06/25/2023 - 05:22

వాషింగ్టన్‌: భారత్‌లో మరింత మెరుగైన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇదే మంచి తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత వ్యాపార రంగంలో పారదర్శకమైన, సానుకూలమైన పాత్ర పోషించేందుకు అనువైన వాతావరణాన్ని భారత్, అమెరికా సంయుక్తంగా సృష్టించాయని ఆయన ఉద్ఘాటించారు.

అమెరికా పర్యటనలో భాగంగా శుక్రవారం వాషింగ్టన్‌లోని కెన్నడీ సెంటర్‌లో అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, భారతీయ సంతతి వ్యక్తులు, దాతలతో మోదీ భేటీ అయ్యారు.

‘ఇరు దేశాల భాగస్వామ్యం అనేది అనువుగా మార్చుకున్న సంబంధం కాదు. ఇది పరస్పర వాగ్దానాలు, నిబద్దతకు నిదర్శనం’ అని మోదీ నొక్కిచెప్పారు. ‘ వాషింగ్టన్‌లో భిన్న రంగాల దిగ్గజాలతో భేటీ అద్భుతంగా కొనసాగింది. ఇందులో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ సైతం పాల్గొనడం విశేషం. భారత ప్రగతిపథ ప్రస్థానంలో భాగమయ్యేందుకు, దేశ అవకాశాల గనిని ఒడిసిపట్టేందుకు అమెరికా పెట్టుబడిదారులకు ఇదే చక్కని సమయం’ అని మోదీ ట్వీట్‌చేశారు.  

భారత్‌లో 75,000 కోట్ల పెట్టుబడి: గూగుల్‌
‘భారత్‌లో దాదాపు రూ.75,000 కోట్ల(10బిలియన్‌ డాలర్ల) పెట్టుబడి పెట్టబోతున్నాం. ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా సంబంధిత వివరాలు ఆయనతో పంచుకున్నాను’ అని సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు. ఇండియా డిజిటైజేషన్‌ ఫండ్‌లో భాగంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌–సిటీ(గిఫ్ట్‌)లో తమ గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ వ్యాపారకార్యకలాపాలను ప్రారంభిస్తామని గూగుల్‌ వెల్లడించింది.

జీపేకు సపోర్ట్‌గా ప్రత్యేక కార్యకలాపాలను ‘గిఫ్ట్‌’లో మొదలుపెడతారని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు శనివారం పేర్కొన్నారు. ‘ఫిన్‌టెక్‌ రంగంలో భారత నాయకత్వాన్ని గూగుల్‌ గుర్తిస్తోంది. అందకే భారత్‌లో చిన్న, భారీ పరిశ్రమలకోసం సేవలు అందిస్తాం. దాంతోపాటే అమెరికాసహా ప్రపంచదేశాలకు ఇక్కడి నుంచే సేవలు కొనసాగుతాయి. ఈ ఏడాది చివరినాటికి ముఖ్యంగా మహిళల సారథ్యంలో మొదలయ్యే అంకుర సంస్థలకు మద్దతుగా నిలుస్తాం’ అని అధికార ప్రతినిధి చెప్పారు.  

అమెజాన్‌ మరో 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు  
అదనంగా 15 బిలియన్‌ డాలర్లు (రూ.1,23,000 కోట్లు) పెట్టుబడి పెట్టడం ద్వారా భారత్‌లో తన ఉనికిని మరింత పెంపొందించుకోవాలని అమెజాన్‌.కామ్‌ భావిస్తున్నట్లు అమెజాన్‌ సీఈవో ఆండీ జస్సీ వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయాలను తెలియజేశారు. ఈ అదనపు పెట్టుబడి 2030 నాటికి భారత్‌లోని వివిధ వ్యాపారాలలో సంస్థ మొత్తం పెట్టుబడిని 26 బిలియన్లకు (రూ.2,13,200 కోట్లకు) చేరుస్తుందని జస్సీ పేర్కొన్నారు. భారతీయ స్టార్టప్‌లను ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన, ఎగుమతులను సులభతరం చేయడం, డిజిటల్‌ పరివర్తన, గ్లోబల్‌ మార్కెట్లో అభివృద్ధి చెందడానికి వ్యక్తులు వంటి అంశాలపై చర్చించారు. 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)