Breaking News

అమెరికాపై పాక్‌ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Published on Wed, 02/11/2026 - 09:18

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌.. అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను ఉపయోగించుకుందని ఆరోపించారు. పాకిస్తాన్‌ను టాయిలెట్‌ పేపర్‌ కంటే దారుణంగా వాడుకుని విస్మరించిందని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో.. ఉగ్రవాదంపై ఖవాజా ‍చేసిన వ్యాఖ్యలు.. భారత్‌ తరచూ చేసే ఆరోపణలకు బలం చేకూర్చాయి. భారత్‌కు మద్దతు ఇచ్చే విధంగా ఉన్నాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

పాకిస్తాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌.. ఇటీవల పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ అమెరికా–పాకిస్తాన్ సంబంధాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో అమెరికా తన ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను వాడుకుందని అన్నారు. 1999 కార్గిల్‌ యుద్ధం, 9/11 దాడుల తర్వాత పాకిస్తాన్‌ మళ్లీ అమెరికాతో కలవడం అనే నిర్ణయం మాకు దీర్ఘకాలిక నష్టం కలిగించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్ యుద్ధంలో “జిహాద్” పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించారని ఆయన విమర్శించారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదం ప్రధానంగా అవినీతి, స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు, పాలనా వైఫల్యాలు వల్ల పెరుగుతోందని ఆయన అంగీకరించారు. అమెరికా మద్దతును అనుసరించడం ఒక తీవ్రమైన నష్టంగా ఆయన అభివర్ణించారు. దీని పరిణామాలు పాకిస్తాన్‌కు దశాబ్దాల తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు.

జిహాద్‌ యుద్ధాలను చట్టబద్ధం చేయడానికి పాకిస్తాన్ విద్యా వ్యవస్థను కూడా మార్చారని, ఆ సైద్ధాంతిక మార్పులు చాలా వరకు నేటికీ ఉన్నాయని ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980లలో ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన సోవియట్ వ్యతిరేక యుద్ధం మతపరమైన ఆవశ్యకత కంటే అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువగా ఉపయోగపడింది. పాకిస్తాన్ తనది కాని సంఘర్షణలలో పాల్గొనడం దీర్ఘకాలిక అస్థిరతను సామాజిక నష్టాన్ని కలిగించింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ ప్రజలు ఎదుర్కొన్న నష్టాలను ఎప్పటికీ భర్తీ చేయలేము అంటూ వ్యాఖ్యానించారు.

కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్–అమెరికా సంబంధాలు
1999 కార్గిల్ యుద్ధం తర్వాత అమెరికా–దక్షిణాసియా సంబంధాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. కార్గిల్ యుద్ధం సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌కు మద్దతు ఇచ్చారు. ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను వాషింగ్టన్‌కు పిలిచి, సైన్యం వెనక్కి తగ్గాలని ఒత్తిడి చేశారు. ఈ సంఘటన తర్వాత అమెరికా–భారత్ సంబంధాలు మరింత బలపడ్డాయి. 2000లో క్లింటన్ భారతదేశాన్ని సందర్శించడం దీనికి సంకేతం. అయితే, కార్గిల్ యుద్ధం పాకిస్తాన్‌కు రాజకీయంగా, వ్యూహాత్మకంగా నష్టం కలిగించింది.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)