Breaking News

అమెరికా, ఇజ్రాయెల్‌ వేడుకోవాల్సిందే: ఇరాన్‌ వార్నింగ్‌

Published on Sun, 03/01/2026 - 12:29

టెహ్రాన్‌: అమెరికా, ఇరాన్‌ మధ్య దాడులు, మాటల యుద్ధం నడుస్తోంది. సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు పెంచింది. దీంతో, ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం, అమెరికాకు ఇరాన్‌ అదిరిపోయే కౌంటరిచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్‌ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ జారీ చేసింది. ఇక, ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌-4 పేరుతో ఇరాన్‌ దాడులు చేస్తోంది. 

అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరికలపై తాజాగా ఇరాన్‌ స్పీకర్‌, అధికారులు స్పందించారు. ఈ క్రమంలో ఇరాన్‌..‘సుప్రీం లీడర్‌ ఖమేనీ హత్య పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మా జవాబు చూసి శత్రువులు ఏడ్వాల్సిందే, వేడుకోవాల్సిందే. అమెరికా, ఇజ్రాయెల్‌ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మేము దాడులు చేస్తే శత్రువులు కూడా బెంబెలెత్తిపోవాల్సిందే. ఖమేనీ చూపిన బాటలోనే నడుస్తాం. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క’ అని డైరెక్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది.

ట్రంప్‌ హెచ్చరికలు.. 
అంతకుముందు ఇరాన్‌ను ట్రంప్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌తోపాటు మిడిల్‌ ఈస్ట్‌లోని అమెరికా స్థావరాలపై ఎడతెరిపి లేకుండా చేస్తున్న ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా హెచ్చరించారు. ఇంతకు ముందెన్నడూ చూడని బలంతో ప్రతిదాడులు చేస్తామని ట్రంప్‌ స్పష్టంచేశారు. చాలా తీవ్రంగా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా దాడులు చేయనున్నట్లు ఇరాన్‌ ప్రకటించిందని ట్రంప్ గుర్తుచేశారు. వారు అలా చేయకపోవడమే మంచిదని, ఒక వేళ చేస్తే వారు కూడా ఇంతకు ముందు చూడని శక్తితో విరుచుకుపడతామని వార్నింగ్‌ ఇచ్చారు.

 

దుబాయ్‌ విలవిల.. 
మరోవైపు.. సుప్రీం లీడర్‌ ఖమేనీ హత్య తర్వాత పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఇరాన్‌ సైన్యం.. ఇజ్రాయెల్‌, అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇరాన్‌ క్షిపణుల రాకతో ఇజ్రాయెల్‌లో చాలా చోట్ల మోగిన సైరన్లు మోగాయి. ఇరాన్‌ డ్రోన్లు మరోసారి దుబాయ్‌ ఎయిర్‌పోర్టును మరోసారి తాకాయి. దీంతో, దుబాయ్‌ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతిన్నది. యూఏఈ, ఖతార్‌లలో అనేక చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. యూఏఈలోని అమెరికా స్థావరమైన జబేలీ అలీ పోర్టును ఇరాన్‌ క్షిపణి తాకింది. అబుదాబి విమానాశ్రయంపై కూడా ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. బుర్జ్‌ ఖలీఫా మీదుగా క్షిపణులు వెళ్తున్న దృష్యాలను ఇరాన్‌ మీడియా విడుదల చేసింది. పశ్చిమాసియాలోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్‌ సైన్యం తెలిపింది. ఇరాన్‌ దాడులతో బహ్రెయిన్‌, కువైట్‌లలో సైరన్ల మోత మోగిపోయాయి. 

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు