Breaking News

ఇంటర్నెట్‌ నుంచి ఇంటెలిజెన్స్‌ యుగానికి

Published on Fri, 02/20/2026 - 05:10

న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ భవిష్యత్తును పూర్తిగా మార్చేలా కృత్రిమ మేధస్సు (ఏఐ) పై దేశీ కార్పొరేట్‌ దిగ్గజాలు భారీ దృష్టి సారించాయి. భారత్‌ ‘ఇంటెలిజెన్స్‌ ఎరా’లోకి అడుగుపెట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ, దేశీయ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం, డేటా సార్వ¿ౌమత్వం, హైపర్‌ ప్రోగ్రెస్‌ దిశగా ముందుకెళ్లాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, గ్లోబల్‌ టెక్‌ నేతలు పిలుపునిచ్చారు.

 డేటా విప్లవం తర్వాత ఇప్పుడు ఏఐ విప్లవం దిశగా భారత్‌ దూసుకెళ్తోందని, స్వదేశీ మౌలిక వసతులు, చౌక డేటా వినియోగంతో ‘ఇంటెలిజెన్స్‌ సెంచరీ’లో గ్లోబల్‌ లీడర్‌గా ఎదగాలనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రిలయన్స్‌ అధినేత అంబానీ, అదానీ గ్రూప్‌ ఈడీ జీత్‌ అదానీ,  గూుగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఏఐ సదస్సులో తెలిపారు.      

మొబైల్, ఇంటర్నెట్‌ తరహాలోనే కృత్రిమ మేధను (ఏఐ) చౌకగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు.  ప్రతి పౌరుడు, వ్యాపారం, ప్రభుత్వ సరీ్వసులను ఏఐతో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. 

జామ్‌నగర్‌లో గిగావాట్‌ స్థాయి ఏఐ–రెడీ డేటా సెంటర్ల ఏర్పాటు, 10 గిగావాట్ల వరకు హరిత విద్యుదుత్పత్తి, అతి తక్కువ లేటెన్సీతో దేశవ్యాప్తంగా ఏఐని అందించేలా ఎడ్జ్‌–కంప్యూట్‌ వ్యవస్థను నెలకొల్పేందుకు జియో ఇంటెలిజెన్స్‌ ఈ మొత్తాన్ని వెచి్చంచనున్నట్లు వివరించారు. 

డీప్‌టెక్, తయారీ, అసంఘటిత రంగం కోసం ఏఐని అందుబాటులోకి తేవడం, ప్రపంచ స్థాయి బహుభాషా ఏఐని రూపొందించడం, అత్యధిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలను కల్పించడంలాంటి అయిదు మార్గదర్శక సూత్రాల ఆధారంగా జియో ఇంటెలిజెన్స్‌ పని చేస్తుందని చెప్పారు. ‘‘భారత్‌ను జియో ఇంటర్నెట్‌ యుగానికి అనుసంధానం చేసింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్‌ యుగానికి అనుసంధానం చేస్తుంది. 

జియో, రిలయన్స్‌ కలిసి వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇవేవో స్పెక్యులేటివ్‌ లేదా వేల్యుయేషన్లపరమైన పెట్టుబడులు కావు. రాబోయే అనేక దశాబ్దాల పాటు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తాయి. దేశం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలిగే సత్తాను సాధించేందుకు దోహదపడతాయి. డేటా తరహాలోనే ఏఐ ఖర్చుని కూడా మేము గణనీయంగా తగ్గిస్తాం. అద్దె మేధస్సుతో భారత్‌ ముందుకెళ్లలేదు’’ అని అంబానీ స్పష్టం చేశారు.  

ఏఐ వ్యూహానికి 3 కీలకాంశాలు: జీత్‌ అదానీ 
భారతదేశపు సార్వభౌమత్వాన్ని ఏఐ సరికొత్త నిర్వచనం ఇస్తుందని అదానీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జీత్‌ అదానీ చెప్పారు. దేశ కృత్రిమ మేథ వ్యూహానికి విద్యుత్, కంప్యూట్‌–క్లౌడ్, సర్వీసులనే మూడు అంశాలు ప్రదానంగా ఉంటాయన్నారు. ‘‘ఏఐని కోడింగ్‌ చేస్తారు. కానీ అది పని చేయాలంటే విద్యుత్‌ భద్రత సాధించడం అవసరం. ఈ విషయంలో పర్యావరణహితమైన విద్యుత్‌ కీలకంగా ఉంటుంది. క్రిటికల్‌ ఏఐ వర్క్‌లోడ్‌లను భారత్‌ స్వదేశంలోనే హోస్ట్‌ చేయాలి. స్టార్టప్‌లు, విద్యా, రక్షణ, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలకు అత్యుత్తమ కంప్యూట్‌ సామర్థ్యాలు అందుబాటులో ఉండాలి. 

ఏఐ అనేది ముందుగా దేశ ప్రజలకు సేవలందించేందుకు ఉపయోగపడాలి’’ అని ఆయన పేర్కొన్నారు. హరిత విద్యుత్‌ ఆధారిత ఏఐ ప్లాట్‌ఫాం ఏర్పాటునకు అదానీ గ్రూప్‌ 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉందన్నారు. ‘‘ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ శతాబ్దంలో భారత్‌ కూడా పాలు పంచుకుంటుందా లేదా అనేది ప్రశ్న కాదు. ఏఐ సెంచరీలో మౌలిక సదుపాయాలు, మేథస్సు, ప్రమాణాలు, విలు వలపై ఎంత వరకు తన ముద్ర వేస్తుందనేదే ప్రశ్న. కానీ నిస్సందేహంగా భారత్‌ దీన్ని సాధించగలదు’’ అని చెప్పారు.  

హైపర్‌ పురోగతి శకం: గూగుల్‌ సుందర్‌  
హైపర్‌ పురోగతి శకానికి కృత్రిమ మేథ నాంది పలికిందని అమెరికన్‌ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ చెప్పారు. వర్ధమాన దేశాలు నిదానంగా ఉండే సంప్రదాయ వృద్ధి బాటలో కాకుండా ఎకాయెకిన వేగంగా పైకి ఎదిగేందుకు ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం మొదలైన విభాగాల్లో ఏఐ వినియోగం పెరుగుతోందన్నారు. ‘‘ఏఐ వల్ల ఉద్యోగ విధుల్లో నిస్సందేహంగా గణనీయ మార్పులు వస్తాయి. కొన్ని ఆటోమేట్‌ అవుతాయి. మరికొన్ని ఉద్యోగాల స్వరూపం మారుతుంది. పూర్తిగా సరికొత్త కెరియర్లు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఏఐ ఆధారిత మార్పులను అందిపుచ్చుకునేలా వర్కర్ల కోసం గూగుల్‌ ఏఐ ప్రొఫెషనల్‌ సరి్టఫికెట్‌ని ప్రవేశపెట్టాం. 10 కోట్ల మందికి డిజిటల్‌ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చాం’’ అని సుందర్‌ చెప్పారు. 

Videos

జగన్ ను కలిసిన అంబటి రాంబాబు

గిన్నెలో ఇరుక్కుపోయిన బుడ్డోడు తల..

ఎగిరి గంతులేసిన ఎమ్మెల్యే, ఎంపీ

పబ్లిసిటీ పీక్.. పెర్ఫామెన్స్ వీక్.. ఏపీ బడ్జెట్ పై YS జగన్ రియాక్షన్

అంబటికి విడదల రజిని పరామర్శ

బిల్లింగ్ మెషిన్‏తో బిర్యానీ స్కామ్

నేడు పరువు పోరు.. ఆస్ట్రేలియా Vs ఒమన్

అంబటికి స్వాగతం పలికిన భార్య, కూతుర్లు

హెరిటేజ్, ఇందాపూర్ కి లింక్ ఇదే.. లైవ్ లో ఆధారాలతో బయటపెట్టిన కారుమూరి

TTD డిస్ క్వాలిఫై చేసిన ఇందాపూర్ కి.. 3 నెలల్లోనే అర్హత కల్పించిన చంద్రబాబు

Photos

+5

ప్రియురాలు సోఫీయా షైన్‌తో గబ్బర్‌ శిఖర్‌ పెళ్లి.. సంగీత్ నైట్‌ ఫోటోలు

+5

హైదరాబాద్ రంజాన్‌ స్పెషల్ రుచులు..మీరూ ఓ లుక్కేయండి (ఫొటోలు)

+5

'నవాబ్‌ కేఫ్‌' హీరోయిన్ తేజు అశ్విని (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ త్రిష (ఫోటోలు)

+5

పట్టుచీరలో అందంగా సోనియా ఆకుల (ఫోటోలు)

+5

శివబాలాజీ-మధుమిత కుమారుడికి మోహన్‌బాబు ఆశీస్సులు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)

+5

హీరోయిన్ నయన్ సారిక బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

స్టన్నింగ్‌ ఔట్‌ఫిట్‌తో సమంత.. వైరల్‌ ఫోటోలు

+5

విశాఖ సాగరతీరంలో సాహస గర్జన (ఫొటోలు)