Breaking News

పసిడి ధరను నిర్దేశించే స్థాయికి భారత్‌ 

Published on Sun, 11/30/2025 - 05:43

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పసిడి ధరను నిర్దేశించే స్థాయికి భారత్‌ త్వరలో ఎదుగుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. రాబోయే దశాబ్దకాలంలో భారత పసిడి డిమాండ్‌లో 20 శాతం అవసరాలు దేశీయంగా బంగారం మైనింగ్‌ ద్వారా తీరుతుందని పేర్కొన్నాయి. 2047 నాటికి వికసిత్‌ భారత లక్ష్యం దిశగా దేశం ముందుకెళ్తున్న నేపథ్యంలో మైనింగ్‌ చాలా కీలకంగా ఉంటుందని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) నిర్వహించిన రత్నాభరణాల సదస్సులో పాల్గొన్న సందర్భంగా వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ రీజనల్‌ సీఈవో సచిన్‌ జైన్‌ చెప్పారు. 

పసిడి మైనింగ్‌లో ఉద్యోగాలు, విదేశీ పెట్టుబడులు గణనీయంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. దేశీయంగా ప్రస్తుతం చెప్పుకోతగ్గ స్థాయిలో మైనింగ్, గోల్డ్‌ బ్యాంకింగ్‌ లేకపోవడం వల్ల వేరే వారు నిర్ణయించిన ధరను భారత్‌ పాటించాల్సి వస్తోందని, లండన్‌ ఏఎం, పీఎం బెంచ్‌మార్క్‌ ధరలపై ఆధారపడాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆర్‌బీఐతో పాటు బ్యాంకింగ్‌ వ్యవస్థ కూడా పరివర్తన చెందే కొద్దీ ధరలపై కూడా మనం ప్రభావం చూపగలిగే అవకాశం ఉంటుందని జైన్‌ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే రెండు మూడేళ్లలో భారత్‌ అంతర్జాతీయంగా కీలకమైన జ్యుయలరీ హబ్‌గా ఎదుగుతుందని చెప్పారు. 
 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)