Breaking News

‘భారత్‌లో ఏఐ స్పీడ్‌ చూస్తే విస్మయం కలుగుతుంది’

Published on Thu, 02/19/2026 - 14:05

భారతదేశంలో ఏఐ వేగం పరంగా కనిపిస్తున్న మార్పు తనను విస్మయానికి గురిచేస్తున్నట్లు ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఒకప్పుడు సాధారణ తీరప్రాంత నగరంగా ఉన్న విశాఖపట్నం నేడు గ్లోబల్ ఏఐ హబ్‌గా రూపాంతరం చెందడం అద్భుతమని చెప్పారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పిచాయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఏఐ పర్యావరణ వ్యవస్థలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ఆయన విశ్లేషించారు.

కార్యక్రమంలో భాగంగా తన బాల్యాన్ని, విద్యాభ్యాసాన్ని గుర్తు చేసుకుంటూ పిచాయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చెన్నై నుంచి ఐఐటీ ఖరగ్‌పూర్ వెళ్లేందుకు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేవాడిని. ఆ ప్రయాణంలో విశాఖపట్నం ఒక నిరాడంబరమైన తీరప్రాంత నగరంగా కనిపించేది. కానీ ప్రస్తుతం అదే నగరంలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల పెట్టుబడిలో భాగంగా ఏఐ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆనాడు రైలులో కూర్చున్న ఏ విద్యార్థి కూడా వైజాగ్ ఒక గ్లోబల్ టెక్ హబ్‌గా మారుతుందని ఊహించి ఉండరు’ అని ఆయన పేర్కొన్నారు.

డ్రైవర్‌లెస్ కార్లపై పని..

టెక్నాలజీ రంగంలో గూగుల్ సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ తన తండ్రి రేగునాథ పిచాయ్‌తో జరిగిన సరదా సంభాషణను ఆయన పంచుకున్నారు. ‘శాన్ ఫ్రాన్సిస్కోలో మా ‘వేమో’ డ్రైవర్‌లెస్ టాక్సీలో నా తల్లిదండ్రులను తీసుకెళ్లాను. అయితే, భారతదేశంలోని రద్దీగా ఉండే రోడ్లపై ఈ కారు విజయవంతంగా నడిస్తే అప్పుడు నిన్ను మెచ్చుకుంటాను అని నాన్న అన్నారు. దానిపై ఇంకా పని చేస్తూనే ఉన్నాను నాన్న!’ అని చెప్పారు.

భారత ప్రభుత్వ కృషికీ ప్రశంసలు

గత వేసవిలో లక్షలాది మంది రైతులకు ఏఐ ఆధారిత వాతావరణ అంచనాలను పంపడంలో భారత ప్రభుత్వం చూపిన చొరవను పిచాయ్ అభినందించారు. గూగుల్ ‘న్యూరల్ జీసీఎం’ మోడల్ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని అందించడం సాధ్యమైందని ఆయన వెల్లడించారు.

యూఎస్-ఇండియా కనెక్ట్

ఈ సదస్సులో పిచాయ్ కొన్ని కీలక అంశాలను వెల్లడించారు.

  • అమెరికా-ఇండియా కనెక్ట్ చొరవలో భాగంగా రెండు దేశాల మధ్య నాలుగు కొత్త వ్యవస్థలతో కూడిన భారీ నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు.

  • ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు ఆటోమేట్ అయినప్పటికీ సరికొత్త ఉపాధి మార్గాలు పుట్టుకొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • ‘20 ఏళ్ల క్రితం యూట్యూబ్ క్రియేటర్ అనే వృత్తి లేదు, కానీ నేడు లక్షలాది మంది అందులో రాణిస్తున్నారు’ అని ఉదాహరించారు.

  • ‘భారతదేశం కేవలం ఏఐని ఉపయోగించుకోవడమే కాదు, ప్రపంచానికి ఏఐ పరిష్కారాలను చూపే స్థాయికి చేరుకుంది’ అని చెప్పారు.

ఇదీ చదవండి: అభిషేక్ బచ్చన్ సక్సెస్ మంత్రం ఇదే..

Videos

ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్

దేవుడితో పెట్టుకున్నాడు చుక్కలు చూస్తున్నాడు

వైరల్ గా మారిన ఆలియా భట్ డ్రెస్..

Tirumala : రెండు కాదు ఏడు కొండలే.. అసలు నిజాలు బయటపెట్టిన జగన్

జగనన్న కాలనీల కోసం.. అక్కచెల్లెమ్మలకు ఏకంగా 35,210 కోట్లు ఇచ్చాం

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఉరి.. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇక దేవుడికే తెలియాలి

ఏమయ్యా అచ్చెన్న.. 6,309 కోట్లు ఇచ్చావా ..? సిగ్గుందా కొంచెమైనా..!

వారణాసిలో కిచ్చా సుదీప్ రోల్ ఏంటంటే..?

ఇందాపూర్ డెయిరీ రూపంలో బయటపడ్డ బాబు కల్తీ కుట్ర

మహేష్ బాబు NEXT మూవీ ఫిక్స్.. అంత్యంత క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా!

Photos

+5

పట్టుచీరలో అందంగా సోనియా ఆకుల (ఫోటోలు)

+5

శివబాలాజీ-మధుమిత కుమారుడికి మోహన్‌బాబు ఆశీస్సులు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)

+5

హీరోయిన్ నయన్ సారిక బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

స్టన్నింగ్‌ ఔట్‌ఫిట్‌తో సమంత.. వైరల్‌ ఫోటోలు

+5

విశాఖ సాగరతీరంలో సాహస గర్జన (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో రంజాన్‌ శోభ (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం (ఫొటోలు)

+5

‘విష్ణు విన్యాసం’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కోలీవుడ్‌ కపుల్‌ జంటగా మరకతమణి 2 (ఫోటోలు)