Breaking News

‘చంద్రబాబును ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారు’

Published on Sun, 05/29/2022 - 14:16

సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర ఆదివారం మధ్యాహ్నం.. కర్నూల్‌లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మహనీయుల ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఎన్నికల కోసం బీసీ, ఎస్సీ ఎస్టీల వర్గాలను చంద్రబాబు వాడుకొని వదిలేశారని, కానీ బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించడంతో పాటు వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. పేద ప్రజల కోసం సామాజిక న్యాయం చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

టీడీపీ పనైపోయింది: మంత్రి బొత్స
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. మహానాడులో పార్టీ విధానాలు చెప్పకుండా అసభ్యంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. మంత్రులుగా పనిచేసినవాళ్లను అంత నీచంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబుని ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారని, టీడీపీ పనైపోయిందని, ఆ విషయం మహానాడుతో స్పష్టమైందని తెలిపారు. ‘మా అవినీతిని బయటపెట్టడానికి మూడేళ్లు పట్టిందా, అవినీతిపై చర్చకు సిద్ధం.. వాళ్ల అవినీతి చిట్టా అంతా విప్పుతామంటూ’ ధ్వజమెత్తారు. ధరల పెరుగుదలపై చంద్రబాబు ఎందుకు బీజేపీని ప్రశ్నించడం లేదని ఎద్దేవా చేశారు.

Videos

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

COVID Guidelines: ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్

సీఎం రేవంత్ బండారం మొత్తం బయటపడింది: కేటీఆర్

నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు

కేటీఆర్, హరీష్రరావు ఇంటికి వెళ్లి ఈ లేఖ తయారుచేశారు

Photos

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)