Breaking News

26 మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లకు కరోనా!

Published on Mon, 04/06/2020 - 15:05

ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. సామాన్యులతో పాటు కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఏకంగా 26 మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లకు ప్రాణాంతక వైరస్‌ సోకడం కలకలం సృష్టించింది. ఈ ఘటన ముంబైలోని ది వాక్‌హార్డ్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దీంతో బ్రిహాన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)ఆ ఆస్పత్రిని నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది. ఆస్పత్రిలోని కరోనా పేషెంట్లందరూ కోలుకునేంత వరకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఓ అధికారి జాతీయ మీడియాతో పేర్కొన్నారు.(క‌రోనాపై అసత్య ప్రచారం: వ‌్య‌క్తి అరెస్టు)

‘‘భారీ సంఖ్యలో వైద్య సిబ్బంది వైరస్‌ బారిన పడటం దురదృష్టకరం. వారు జాగ్రత్తలు తీసుకోవాల్సింది’’అని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారందరినీ వివిధ ఆస్పతుల్లోని క్వారంటైన్‌లకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా సదరు ఆస్పత్రిలోని దాదాపు 270 మంది సాధారణ రోగుల నమూనాలు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించినట్లు తెలిపారు. ఇక ఆస్పత్రి యాజమాన్యం అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్లే పదుల సంఖ్యలో నర్సులు మహమ్మారి బారిన పడ్డారని నర్సుల సంఘం ఆరోపించింది. అయితే కరోనా కేసులపై ఇంతవరకు స్పందించని ఆస్పత్రి యాజమాన్యం.. నర్సుల ఆరోపణలను మాత్రం కొట్టిపారేసింది.(పిల్లి కోసం పోలీసులపై హైకోర్టులో పిటిషన్‌)

కాగా తాజా సమాచారం ప్రకారం మహారాష్ట్రలో మొత్తం 42 మంది డాక్టర్లు, 50 మంది వైద్య సిబ్బందిని క్వారంటైన్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి సదరు ఆస్పత్రికి వచ్చాడని.. అప్పటికే అతడికి కరోనా సోకిన కారణంగా ఆస్పత్రిలో వైరస్‌ వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నామని డాక్టర్‌ డీవై పాటిల్‌ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ డీన్‌ జితేంద్ర భవాల్కర్‌ తెలిపారు. 

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)