ప్రధాని మోదీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశి
Breaking News
గద్దర్ అవార్డ్స్ ప్రకటన.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వైరల్
Published on Thu, 05/29/2025 - 19:49
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్ విజేతలకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. 2024 ఏడాదిగానూ ఎంపికైన అవార్డ్ గ్రహీతలకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. సృజనాత్మక రంగంలోని ఏ కళాకారుడికైనా, సాంకేతిక సిబ్బందికైనా రాష్ట్ర గుర్తింపు అనేది చాలా విలువైనదని అన్నారు. ఇలాంటి అవార్డులు మరింత ప్రేరణనిస్తాయని రాసుకొచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని మళ్లీ ప్రారంభించడం సినీ పరిశ్రమకు ప్రోత్సాహకరంగా ఉంటుందని మెగాస్టార్ ట్వీట్ చేశారు. అవార్డులు విషయంలో చొరవ చూపిన ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, అధికారులకు ధన్యవాదాలు అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు. కాగా.. ఇవాళ జయసుధ నేతృత్వంలోనే జ్యూరీ గద్దర్ అవార్డులు-2024 విజేతలను ప్రకటించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డ్ను సొంతం చేసుకున్నారు.
ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది. విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు.
Hearty Congratulations to each and
every winner of the First #GaddarTelanganaFilmAwards
for the year 2024. 👏👏
State recognition is extremely precious and motivating for any Artiste and Technician in the Creative fraternity.
It’s greatly encouraging to see the Government of…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 29, 2025
Tags : 1