ఆకాశం నిర్మలంగా ఉంటుంది మధ్యాహ్న ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
డిండి నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
డిండి : డిండి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. మంగళవారం రైతుల ఆందోళనతో నీటి విడుదలను తగ్గించిన.. ఇరిగేషన్ శాఖా అధికారులు బుధవారం మళ్లీ పెంచారు. ఎడమకాల్వకు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. డిండి, చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లోని చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండేంత వరకు నీటిని విడుదల చేయాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని డీఈ శ్రీనివాసులు తెలిపారు.