డిసెంబర్‌ 28 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం

Vijayawada Book Festival From December 28 - Sakshi

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 28 నుంచి జనవరి 7 వరకు 34వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు టి.మనోహర్‌­నాయుడు, కె.లక్ష్మయ్య చెప్పారు.

ఈ ఏడాది కూడా పుస్తక మహోత్సవాన్ని విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పబ్లిషర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌ పాల్గొంటా­ర­న్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన అన్ని రకాల పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందు­బాటులో ఉంటాయని తెలిపారు.
చదవండి: పింఛన్ల పంపిణీకి జాతీయ అవార్డు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top