తాడికొండ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహుజనుల పక్షమో.. ప్యాకేజీ పక్షమో తేల్చుకోవాలని సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 50వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గురునాథం మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్గా మారి.. అమరావతి జేఏసీ కోసం జోలె పడతామనడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు.
హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న బహుజన పరిరక్షణ సమితి దీక్షలకు మద్దతు ఇవ్వకుండా తప్పుడు ప్రచారం చేస్తే జనసేన అధినేత పవన్కల్యాణ్, వామపక్షాల నేతలు, చంద్రబాబు ఇళ్లను ముట్టడించడం ఖాయమన్నారు. దీక్షలకు ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన దళిత సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పవన్కల్యాణ్ దిష్టిబొమ్మకు జోలెకట్టి అందులో పావలా నాణేలు వేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు, నవ్యాంధ్ర ఎమ్మారీ్పఎస్ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, పీవీ రావు మాల మహానాడు అధ్యక్షుడు నత్తా యోనరాజు, దళిత వర్గాల సమాఖ్య అధ్యక్షుడు చెట్టే రాజు, దళిత సంఘాల నాయకులు మేదర సురేష్, బొండపల్లి గిరిజ, బండి పుణ్యశీల, కాలే పుల్లారావు, బూదాల శ్రీనివాస్, మధిర ప్రభాకర్ పాల్గొన్నారు.
పవన్ బహుజనుల పక్షమో, ప్యాకేజీ పక్షమో తేల్చుకోవాలి
Published Thu, Nov 19 2020 4:04 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement