-
కొత్త ప్యాకేజీతో ముందుకొచ్చిన ఆర్.వి టూర్స్ అండ్ ట్రావెల్స్
-
ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కు తెలుగు రాష్ట్రాల్లో విశేష స్పందన
-
వేసవిలో జాతీయ, అంతర్జాతీయ యాత్రలు
పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వగానే రొటీన్ లైఫ్కి ఫుల్స్టాప్ పెట్టేసి కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉల్లాసంగా గడపాలనుకుంటారు. ఏడాదంతా పడిన శ్రమను మర్చిపోవడానికి ప్రకృతి ఎదలో ఒదిగిపోయి సేదతీరాలనుకుంటారు. పార్కులు, పార్టీలు, సినిమాలు, రిసార్టులకు భిన్నంగా సెలవులను బట్టి జాతీయ, అంతర్జాతీయ యాత్రలు చేయాలనుకుంటారు. ఈ ఆలోచన గలవారందరినీ దృష్టిలో పెట్టుకుని RV టూర్స్ – ట్రావెల్స్ యాత్రికులకు అనువైన ప్యాకేజీలు అందిస్తూ, చక్కగా సేదతీరేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. ‘నూతన’ ఉల్లాసం రాబోయే నూతన సంవత్సరంలో ఆధ్యాత్మిక యాత్రలు చార్ధామ్, అమరనాథ్ ఇవి రెండూ ఎప్పటికన్నా ముందుగానే ప్రారంభం అవబోతున్నాయి. ఛార్ధామ్ యాత్ర 18 ఏప్రిల్ 2018న, అమరనాథ్ యాత్ర జూన్ చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఇవే కాకుండా వేసవితాపాన్ని తట్టుకోవడానికి లడక్, సిక్కిం, సిమ్లా, మనాలి, అండమాన్ నికోబర్, డార్జిలింగ్, ఊటి, కూర్గ్ లాంటి విహారయాత్రలు కూడా ప్లాన్లో భాగంగా ఉంటాయి. ఇలాంటప్పుడు వేసవిలో రద్దీ కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే ముందే ప్లాన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే కావల్సిన సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటు చేయడానికి వీలుగా ఉంటుంది. మన తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ RV టూర్స్ – ట్రావెల్స్ 16 ఏళ్లుగా హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రధాన కార్యాలయంగా యాత్రికుల క్షేమమే ప్రధాన లక్ష్యంగా యాత్రికుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించింది. దేశంలో ఒకేసారి కాశీ, రామేశ్వరం, గుజరాత్, మహారాష్ట్ర, చార్ధామ్, అమరనాథ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మానససరోవరం మొదలైన యాత్రలతో పాటు అంతర్జాతీయ యాత్రల ప్యాకేజీలనూ అందిస్తోంది. అంతర్జాతీయ యాత్రలో సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, దుబాయ్, ఇండోనేషియా, వియత్నాం, శ్రీలంక టూర్లకు ఏ మాత్రం ప్రమాణాలు తగ్గకుండా యాత్రల ప్లానింగ్ అమలు చేయడం RV టూర్స్ – ట్రావెల్స్ ప్రత్యేకం. ఒకసారి యాత్ర చేస్తే మరిచిపోలేనంతగా యాత్రికుల మనసులను దోచుకుంటుంది RV టూర్స్ – ట్రావెల్స్. అందుకే ఒక్క యాత్రతో మొదలైన వారి అనుబంధం ప్రతి యేటా విహారయాత్రకో, ఆధ్యాత్మిక యాత్రకో, అంతర్జాతీయ యాత్రకో తప్పకుండా RV టూర్స్ – ట్రావెల్స్ ద్వారానే చేయాలనుకుంటారు యాత్రికులు. RV టూర్స్ – ట్రావెల్స్ ట్రావెల్ ఎక్స్పో ప్రతి యేటా ట్రావెల్ ఎక్స్పోను నిర్వహిస్తున్న RV టూర్స్ – ట్రావెల్స్ నూతన కార్యాలయాల ప్రారంభోత్సవం సందర్భంగా యాత్రికులకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. ట్రావెల్ ఎక్స్పోలో భాగంగా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఆఫీసులను సందర్శించి జాతీయ యాత్రలైన కాశీ, రామేశ్వరం, గుజరాత్, మహారాష్ట్ర, చార్ధామ్, అమరనాథ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మానససరోవరం మొదలైన యాత్రలతో పాటు అంతర్జాతీయ యాత్రల ప్యాకేజీల వివరాలను అందిస్తోంది. అంతర్జాతీయ యాత్రలో సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, దుబాయ్, ఇండోనేషియా, వియత్నాం, శ్రీలంక టూర్లు బుక్ చేసుకున్న ప్రతీ ఒక్కరికి ఎక్స్పోలో భాగంగా ఎవ్వరూ ఊహించని విధంగా భారీ డిస్కౌంట్ ఇవ్వనుంది RV టూర్స్ – ట్రావెల్స్. అన్ని జాతీయ, అంతర్జాతీయ యాత్రలకు మరీ ముఖ్యంగా వేసవిలో రద్దీ వల్ల చార్ధామ్, అమరనాథ్ యాత్ర చేసే భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పుడే టికెట్స్ రిజర్వ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడైతే యాత్రా ప్యాకేజీలపై తగ్గింపును కూడా ఇవ్వనున్నారు. ఈ తగ్గింపు ఆఫర్ ద్వారా ఇప్పుడు ప్యాకేజీలను బుక్ చేసుకున్నవారు రాబోయే డిసెంబర్ 2018 వరకూ వినియోగించుకోవచ్చు. RV టూర్స్ – ట్రావెల్స్.. ట్రావెల్ ఎక్స్పో ఈ నెల 21 నుండి 26 వరకు ఉంటుందని, ఈ చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రత్యక్షంగా రాలేని వారు ఫోన్ ద్వారా గాని, ఆన్లైన్ ద్వారా గానీ బుక్ చేసుకునే సౌకర్యం కలద’ని RV టూర్స్ – ట్రావెల్స్ అధినేత RV రమణ భక్తజన కోటికి విజ్ఞప్తి చేశారు. ఎక్స్పోకు సంబంధించిన మరిన్ని వివరాలకు హైదరాబాద్ కూకట్పల్లి 7032666925, విజయవాడ 7032666928, విశాఖపట్నం 9100090874 ఫోన్ చేసి గాని www.rvtoursandtravels.net కు లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు. నవ్యాంధ్రలో RV టూర్స్ – ట్రావెల్స్ నూతన కార్యాలయాలు: యాత్రికులు కోరుకున్న విధంగా యాత్రలను ఏర్పాటు చేసి, ఎక్కడ ఏ విధమైన ఆటంకం కలగకుండా యాత్రా వసతులు ఏర్పాటు చేసి, యాత్రలంటూ చేస్తే RV టూర్స్ – ట్రావెల్స్ ద్వారానే చేయాలనుకునేంతగా పేరు తెచ్చుకుంది RV టూర్స్ – ట్రావెల్స్. దేశంలోని అన్ని ముఖ్యప్రదేశాల్లో RV టూర్స్ – ట్రావెల్స్ ప్రతినిధులు ఉండటంతో వసతులు, దర్శన ఏర్పాట్లు, పూజాక్రతువులను శాస్త్రబద్ధంగా చేయిస్తారనేది RV టూర్స్ – ట్రావెల్స్ క్లయింట్లు నమ్మే నిజం. వాల్యూ ఫర్ మనీ, క్లయింట్ శాటిస్ఫాక్షన్ అన్న ధ్యేయంతో ముందుకు దూసుకెళ్తున్నRV టూర్స్ – ట్రావెల్స్ ఆధ్యాత్మిక, విజ్ఞాన, విహార, అంతర్జాతీయ యాత్రలు చేయాలనుకునేవారికి తెలంగాణ హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఇప్పటివరకూ ఎన్నో వేలమందికి తమ సర్వీసులందించారు RV టూర్స్ – ట్రావెల్స్. హైదరాబాద్తో పాటు నవ్యాంధ్రలోని తెలుగు ప్రజలకు కూడా మరింత చేరువ కావాలనే సంకల్పంతో RV టూర్స్ – ట్రావెల్స్ నూతన కార్యాలయాలను నవ్యాంధ్ర విజయవాడలోని బందర్ రోడ్డు, తాజ్ గేట్ వే హోటల్ ఎదురుగా, విశాఖపట్నంలో దాబా గార్డెన్స్ సెంటర్లో డిసెంబర్ 20న యాత్రా ప్రేమికుల సమక్షంలో RV టూర్స్ – ట్రావెల్స్ అధినేత RV రమణ ప్రారంభించారు. ‘నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, తమ బాధ్యత మరింత పెరిగిందని హైదరాబాద్లో ఎలాంటి సేవలు అందిస్తున్నారో నవ్యాంధ్రలోని ఆఫీసుల్లో కూడా అనుభవజ్ఞులైన టూర్ మేనేజర్లను ఏర్పాటు చేసి భారత దేశఃలోని సమస్త పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు అంతర్జాతీయ యాత్రలకు మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమ’ని RV రమణ తెలియజేశారు. -
మదినిండుగ విహర పండగ
తీర్థ యాత్రలు / విహార యాత్రలు ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లాసమైన మార్పుకోసం విహార యాత్రలు చేస్తుంటాం. ఇంటిల్లిపాదితో కలిసి యాత్ర చేస్తే ఆ ఆనందమే వేరు. అయితే, ఏదైనా టూర్ వెళ్లాలి అని అనుకోగానే ఎక్కడికి, ఎలా? అనే అన్వేషణ మొదలవుతుంది. ఇలా ఆనందంగా వెళ్లిరావడానికి మన దేశంలో అనేక ప్రదేశాలున్నాయి. చరిత్ర, సంస్కృతి, మతాలను ప్రతిబింబించే ప్రదేశాలు కోకొల్లలు. ప్రకృతి అందాలు, జంతు ప్రదర్శనశాలలు, కొండలు, కోనలు, అడవులు, జలపాతాలు, బీచ్లు, నదులు.. ఇలా సువిశాల భారతదేశంలో ఎన్నెన్నో అందాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఏదో మొక్కుబడిగా కాకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని యాత్ర ప్రారంభిస్తే అనవసర హడావిడికి తావుండదు. మరుపురాని ప్రదేశాల్లో పుణ్యక్షేత్రాల నుంచి మన తీర్థయాత్రను ప్రారంభిద్దాం. చార్ధామ్: మన దేశంలోని గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలే చార్ధామ్గా జగత్ ప్రసిద్ధి. ఈ నాలుగు ఆలయాలను జీవితంలో ఒక్కసారైన సందర్శించాలని ప్రతీ ఒక్కరు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ మహనీయ స్థలాల్ని శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో దివ్య, భవ్య, ఆధ్యాత్మిక పెన్నిధులుగా సేవించాలి. అప్పుడే యాత్ర సిద్ధి, చిత్తశుద్ధి, అలౌకికమైన ఆత్మానంద లబ్ధి చేకూరుతాయి. కాశీ యాత్ర: ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరంగా పేరొందిన వారణాసి భారతదేశపు సాంస్కృతిక రాజధాని. ఈ నగరం నడిబొడ్డున కొలువైన కాశీ విశ్వనాథ దేవాలయం శైవ జ్యోతిర్లింగాలలో ఒకటిగా నీరాజనాలను అందుకుంటోంది. మహిమాన్వితమైనది కాబట్టే జీవితంలో ఒక్కసారైనా కాశీని సందర్శించాలనేది హిందువుల జీవితేచ్చ. రామేశ్వరం: రామేశ్వరంలోని శ్రీ రామనాథస్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా వినుతికెక్కింది. శ్రీ రామేశ్వరం పాంబన్కు ఈశాన్య భాగమందు, ధనుష్కోటికి ఆగ్నేయ భాగంలో ఉంది. విష్ణు ప్రియమైన రామేశ్వరం శంఖు ఆకారంలో కనబడుతుందంటారు. కాశీయాత్ర ఫలితము ధనుష్కోటి సేతులో స్నానం చేసి, రామనాధుని పూజించిన పూర్తి అవుతుందని చెబుతారు. అమర్నాథ్ యాత్ర: మంచుకొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది. చుట్టూ ఎత్తయిన కొండలు, లోతెంతో తెలియని లోయలు, మైనస్ డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి, ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసినా ప్రాణాలపై ఆశ ఉండదు. అంతటి ప్రతికూల పరిస్థితిలోనూ ఒకే ఒక్క మంత్రం దుర్భర వాతావరణాన్ని సానుకూలంగా మార్చేస్తుంది. అదే ‘ఓం నమఃశివాయ.’ ఏడాదిలో 45 రోజుల పాటు కనిపించే మంచు లింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది. కైలాస మానస సరోవరం: సాక్షాత్తు పరమశివుని నివాసం కైలాసం. బ్రహ్మదేవుడు మనస్సంకల్పంతో సృష్టించిన మహాద్భుత సరస్సు మానససరోవరం. భూమండలానికి నాభిస్థానంలో ఉన్నట్లు భావించే కైలాసపర్వతం హిందువులకే కాక, బౌద్ధులకు, జైనులకు అతిపవిత్రం. శివశక్తుల భవ్యలీలాక్షేత్రం కైలాస మానస సరోవరం. విహార యాత్రలు మున్నార్: ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ కేరళ ప్రకృతి అందాల విందుకు నెలవు. ఇక్కడి మున్నార్ ప్రకృతి అందాల విందును కనులారా ఆరగించాలంటే కనీసం మూడురోజులు పడుతుంది. చూడముచ్చటైన వృక్షాల అందాలు, తేయాకు తోటల ఘుమఘుమలు, పన్నెండేళ్ళకోసారి పూచే కురింజి పువ్వు సోయగాలు, బోట్రైడింగ్ అనుభూతులు, చల్లని పిల్ల తిమ్మెరలు.. మెుత్తానికి వసంతంలో శిశిరంలా ఉంటుంది మున్నార్ విహారం. మనాలి: హిమలయపు అందాల నడుమ విరాజిల్లుతున్న ప్రాంతమే మనాలి. దీన్ని‘స్విడ్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ అంటారు. ప్రతి ఏడాది దేశ విదేశాల నుంచి మనాలీకి టూరిస్టులు వచ్చిపోతుంటారు. మనాలికి 3 కిలోమీటర్ల పరిధిలో వేడి నీటి కొలనులు ఉన్నాయి. చుట్టూ మంచులోయల మధ్య వేడి నీటి కొలనులు ఉండటం ఆశ్చర్యం. సిమ్లా పరిసరాల్లో కుఫ్రీ షార్ట్ ట్రిప్, లీజర్ వాక్, హిడింబా ఆలయం, టిబెటన్ మోనస్టరీ, సోలంగ్ లోయ చూడొచ్చు. నాగర్ ఫోర్ట్, రహాలా జలపాతాలు, బీస్ నదిలో సాహస క్రీడలు, రాఫ్టింగ్ కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయ్. సిమ్లా: పెళ్లినాటి తొలిరోజులను ఆహ్లాదంగా గడిపేందుకు ఇదో చక్కని ప్రదేశం. సిమ్లా ఆపిల్ పండ్లకు ప్రసిద్ధి. ఎత్తయిన కొండలు, మల్లెపూల వానలా కురిసే మంచు, చల్లటి వాతావరణం కట్టిపడేస్తాయ్. వందల ఏళ్ల నాటి ఆలయాలు, చర్చిలు, బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఎన్నో భవనాలు ఆకట్టుకుంటాయి. ఎటుచూసినా హిమాలయ పర్వత శ్రేణులు, లోయలు, క్రమశిక్షణతో పెరిగినట్లుగా ఉండే ఫైన్, ఓక్ చెట్లు అడుగడుగునా ప్రత్యక్షమవుతాయి. స్నో స్కీయింగ్ ఇది స్వర్గధామమే. ఊటి, కొడైకనాల్: తమిళనాడు మధ్య ప్రాంతంలో ఉన్న సుందరమైన పర్వతప్రాంతం ఊటి, కొడైకెనాల్. తూర్పు కనుమల్లో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే ఘాట్రోడ్లో ప్రయాణించాల్సిందే. కొడై సరస్సు, సెయింట్ మేరీ చర్చ్, పంపార్ పాల్స్, గ్రీన్ వ్యాలీ, గుణ గుహ, పైన్ వృక్షాల వనం పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ప్రదేశాలు. ఇందులో కొడై అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు. అంతర్జాతీయ యాత్రలు సింగపూర్: పచ్చదనానికి, పరిశుభ్రతకు మరో పేరు సింగపూర్. ఎన్నో ప్రకృతి అందాలకు నెలవైన ఆ దేశ అందాలను వీక్షించేందుకు విచ్చేసే పర్యాటకుల సంఖ్య కోకొల్లలు. ప్రపంచ పర్యాటక రంగంలో అగ్రభాగాన నిలిపిన ఈ అరుదైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే సింగపూర్ వెళ్లి రావాల్సిందే. మలేషియా: నీలిరంగు కప్పుకున్న సముద్రం తెల్లగా మెరిసిపోయే ఇసుక, ఆ పక్కనే పచ్చదనం పరుచుకున్న వృక్షసంపద, నీటి మీద తేలియాడే మరపడవలూ, తీరాన్ని తాకాలనే ఉత్సాహంతో ఉరకలు వేసే సముద్ర కెరటాలు... ఇలా మలేషియా అందాలన్నీ రంగుల హరివిల్లులై పర్యాటకుల మది దోచుకుంటుంటాయి. చిన్న చిన్న దీవులతో ఏర్పడ్డ సుందర ప్రదేశమే మలేషియా. దట్టమైన అరణ్యాలూ, ఎత్తయిన కొండలూ, తెల్లని బీచ్లతో చూడముచ్చటగా ఉంటుంది. థాయ్లాండ్: ఏటా లక్షలాదిమంది పర్యాటకులు సందర్శిస్తున్న ప్రాంతం థాయ్లాండ్. బీచ్లో సేద తీరాలన్నా, స్పా, మసాజ్ సెంటర్లలో రిలాక్స్ అవాలన్నా థాయ్ ది బెస్ట్ ప్లేస్. డిసెంబర్, మార్చి మధ్య థాయ్లాండ్ను సందర్శించే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కాకుండా హాఫ్ సీజన్లో ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చులో టూర్ ప్రశాంతంగానూ పూర్తవుతుంది. శ్రీలంక: పూల సుగంధ పరిమళాల గుబాళింపు, పక్షుల కిలకిలారావాలు, ఎటువైపు చూసినా కనువిందు చేసే పచ్చదనం, స్వచ్ఛమైన చల్లని పిల్లగాలులు, సముద్ర తీరం హŸయలు వీటన్నింటినీ స్వయంగా ఆస్వాదించాలంటే శ్రీలంకకు వెళ్లాల్సిందే. హైదరాబాదు నుంచి కొలంబోకు సరిగ్గా రెండు గంటల ప్రయాణం మాత్రమే. శ్రీలంక కరెన్సీ కూడా రూపాయే కాబట్టి టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. హాంకాంగ్ మకావా: హాలీడేస్లో ఎక్స్ట్రార్డినరీ అనుభూతి. సముద్ర గర్భ మార్గం, కొండల్ని తొలుస్తూ వేసిన అండర్పాస్లు, సుదూర ప్రాంతాలను కలిపే వేలాడే వంతెనలు.. భూతల స్వర్గాన్ని తలపించే హాంకాంగ్ చైనాకు ఆగ్నేయ తీరంలో ఉంటుంది. పలు చిన్న చిన్న ద్వీపాల సమూహమిది. నేపాల్: ఎవరెస్టు శిఖరం మీద ఎగురుతూ ధవళవర్ణంలో ధగధగలాడే హిమాలయ పర్వతశ్రేణుల సౌందర్యాన్నీ ఆ కొండల్లోంచి జాలువారి వయ్యారంగా మలుపులు తిరుగుతూ సాగే నదుల అందాలనూ... ఎంతసేపు చూసినా విసుగనిపించదు. అలాంటి అందాల నెలవు నేపాల్. RVటూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్స్పో ఎప్పుడెప్పుడు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకోవాలకునే భక్తుల సౌలభ్యం కోసం / విహార పర్యాటక ఔత్సాహికుల కోసం ఖV టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ వేసవి సెలవులతో పాటు సంవత్సరం పొడవునా వచ్చే విశేష ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని నేటి నుండి జనవరి 24 వరకు ట్రావెల్ ఎక్స్పో నిర్వహిస్తోంది. ఈ ఎక్స్పో లో 2018 ఫిబ్రవరి వరకు చేయబోయే ఆధ్యాత్మిక, వినోద, విహార లేదా అంతర్జాతీయ యాత్రలను అడ్వాన్స్గా కొంత మొత్తము ప్యాకేజీ అమౌంట్ను కట్టినట్లయితే భారీ డిస్కౌంట్ పొందే సదావకాశం కల్పిస్తోంది. నేరుగా హైదరాబాద్ కూకట్పల్లి లోని ఖVప్రధాన కార్యాలయాన్ని సందర్శించి గాని లేదా ఫోన్ ద్వారా కానీ వివరాలు పొందవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఈ అవకాశాన్ని ఆన్లైన్ ద్వారా ప్రత్యేక తగ్గింపు ప్యాకేజీలను వినియోగించుకోవచ్చు. గమనిక: ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ట్రావెల్ ఎక్స్పోను సందర్శించండి. భారీ డిస్కౌంట్ పొందండి. ఈ అవకాశం 21, 22, 23, 24 తేదీలలో మాత్రమే. ఆర్ వి టూర్స్ – ట్రావెల్స్ 3వ అంతస్తు, భాగ్యనగర్ కాంప్లెక్స్, బి.జె.పి. ఆఫీస్ ఎదురుగా, మెట్రో పిల్లర్ నెం. 15, కూకట్పల్లి, హైదరాబాద్ ఆర్.వి.రమణ ఆర్.వి.టూర్స్ – ట్రావెల్స్ అధినేత
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
Advertisement