-
‘కొనుగోళ్లను వేగవంతం చేయాలి’
కామారెడ్డి క్రైం: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. సోమవారం ఆయన క్యాసంపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూకంలో ఎలాంటి తేడాలు రాకుండా చూడాలన్నారు. తూకం వేసిన వెంటనే కేటాయించిన మిల్లులకు ధాన్యాన్ని తరలించాలన్నారు. తరుగు తీసి రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 241 కేంద్రాల ద్వారా 11,723 మంది రైతులనుంచి రూ.161.70 కోట్ల విలువైన 73,400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.55.27 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ నిత్యానందం, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అకాల వర్షంతో అతలాకుతలం
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని పలు ప్రాంతాలలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో జనం ఇబ్బందిపడ్డారు. జిల్లా కేంద్రంలో భారీ వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కామారెడ్డి, లింగంపేట, మాచారెడ్డి, దోమకొండ, పిట్లం, నిజాంసాగర్, మహమ్మద్నగర్, రామారెడ్డి తదితర మండలాల్లో వర్షంతో రైతులకు నష్టం వాటిల్లింది. కళ్లాలు, కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయి మరింత నష్టం వాటిల్లింది. బలమైన గాలులకు పలుచోట్ల చెట్టు నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దోమకొండలో పిడుగుపడడంతో కొబ్బరిచెట్టు కాలిపోయింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కళ్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఈదురు గాలులతో కూలిన చెట్లు -
డీసీఎంఎస్ ఇన్చార్జి చైర్మన్గా ఇంద్రసేనారెడ్డి
సాక్షి, కామారెడ్డి: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఇన్చార్జి చైర్మన్గా బీబీపేటకు చెందిన డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఏదుల ఇంద్రసేనారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు నిజామాబాద్ జిల్లా సహకార శాఖ అధికారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీసీఎంఎస్ చైర్మన్గా ఉన్న సంబారి మోహన్ తన పదవికి రాజీనామా చేయడంతో ఇన్చార్జి చైర్మన్గా ఇంద్రసేనారెడ్డిని నియమించారు. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి కామారెడ్డి క్రైం: ఇప్పటివరకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పింఛను పొందుతున్న వృద్ధ కళాకారులు ఈనెల 25వ తేదీలోగా సర్టి ఫికెట్ అందించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. కలెక్టరేట్లోని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. గ్రూప్ 1, 2లలో దివ్యాంగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కామారెడ్డి అర్బన్: గ్రూప్ 1, 2 పరీక్షలకు సిద్ధమయ్యే దివ్యాంగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు దివ్యాంగ సంక్షేమ అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇచ్చే ఈ ఉచిత శిక్షణకు ఆసక్తిగల దివ్యాంగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లోని 31వ నంబర్ గదిలో సంప్రదించాలని సూచించారు. పార్టీ మారే ప్రసక్తే లేదు● మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఎల్లారెడ్డిరూరల్: బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన నాగిరెడ్డిపేటలో విలేకరులతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మారబోనని, మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే పని చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఉద్యోగావకాశాలూ కల్పించలేదని ఆరోపించారు. ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తిర్మల్రెడ్డి, ప్రతాప్రెడ్డి, సిద్దయ్య, మోతె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన పరీక్షలు నిజామాబాద్ అర్బన్: జిల్లాలో పదో తరగతి లోపు విద్యార్థులకు 15వ తేదీన ప్రారంభమై న సమ్మెటివ్–2 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. మంగళవారం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేయనున్నారు. బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు బుధవారం నుంచి జూన్ 11వ తేదీ వరకు కొనసాగుతాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. -
తెలంగాణలో క్లీన్స్వీప్ చేస్తాం
సంగారెడ్డి: మోదీ పాలనలోనే దేశం సుభిక్షంగా ఉంటుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని పీఎస్ఆర్ గార్డెన్లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ క్లీన్స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు. దేశంలో ఎన్డీయే కూటమి 400లకుపైగా ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. తెలంగాణలో కొత్తగా ఎర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరన్నారు. ఈ ఎన్నికలతో ఆ పార్టీ శకం ముగుస్తుందన్నారు. మోదీ దేశ ప్రజలకు గ్యారంటీ కార్డు అన్నారు. ఆయన మూడోసారి ప్రధాని కావడం ఖాయమని పేర్కొన్నారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేసిన బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం పటాన్చెరు మండలం రుద్రారంలోని గణేష్ దేవాలయంలో పూజలు నిర్వహించిన బీబీ పాటిల్.. ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, బీజేపీ కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు అరుణతార, గోదావరి, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దేశంలో ఎన్డీయేకు 400లకుపైగా సీట్లు ఖాయం వికసిత్ భారతే లక్ష్యంగా పని చేస్తున్నాం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బీబీ పాటిల్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపుతొమ్మిది నామినేషన్లు దాఖలు.. కామారెడ్డి క్రైం: జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సోమవారం నాలుగో రోజు తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి క్రాంతి వల్లూరుకు అందజేశారు. ఆయన వెంట కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార తదితరులు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ తరఫున పార్టీ నాయకులు ఒక సెట్ నామినేషన్ వేశారు. టీపీఎస్ అభ్యర్థిగా కొత్త బలిజ బస్వరాజ్ రెండు సెట్లు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మాలెపు మోహన్రెడ్డి ఒక సెట్, స్వతంత్ర అభ్యర్థిగా రవి మహాదేవ్ స్వామి రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థులుగా గంగారాం, రమేశ్లు ఒక్కో సెట్ చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. -
పిడుగుపాటుకు ఆవు మృతి
నవీపేట: పిడుగుపాటు కారణంగా మండలంలోని మోకాన్పల్లిలో ఆవు మృతి చెందింది. మిర్యాల ఒడ్డెన్నకు చెందిన ఆవు సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందిందని, దాని విలువ సుమారు రూ.40వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. మోతెలో విద్యుత్షాక్తో.. వేల్పూర్: మండలంలోని మోతెలో విద్యుత్షాక్తో ఆవు మృతి చెందింది. ఉరడి నవీన్ అనే రైతుకు చెందిన సోమవారం ఆవు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పరిసరాల్లో మేతమేస్తుండగా షాక్ తగిలి మృతి చెందిందని మండల పశువైద్యాధికారి సంతోష్రెడ్డి తెలిపారు. మృతి చెందిన ఆవు విలువ సుమారు రూ. 40వేలు ఉంటుందని బాధిత రైతులు తెలిపాడు. రోడు ్డప్రమాదంలో పీఆర్ ఏఈకి గాయాలు ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట పీఆర్ ఏఈ పిచ్చయ్యకు రోడ్డు ప్రమాదంలో గాయాలైనట్లు స్థానికులు సోమవారం తెలిపారు. నాగిరెడ్డిపేట కార్యాలయంలో విధులను ముగించుకుని మెదక్కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టిందని, ఈ ఘటనలో పిచ్చయ్యకు తీవ్రగాయాలయ్యాయన్నారు. చికిత్స నిమిత్తం బాధితుడిని మెదక్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో.. ఎడపల్లి (బోధన్): మండలంలోని అలీసాగర్ లిఫ్ట్ ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు మహిళలు నిజామాబాద్ నుంచి బోధన్ వైపు స్కూటీపై వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం స్థానికులు నిజామాబాద్కు తరలించారు. -
క్రైం కార్నర్
గంజాయి మత్తులో కత్తితో దాడి ఖలీల్వాడి: గంజాయి మత్తులో ఉన్న ఓ వ్యక్తి మరో వ్యక్తి గొంతుపై కత్తి తో పొడిచినట్లు ఆరోటౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై రమేశ్ తెలిపారు. అర్సపల్లి పోలీస్ అవుట్పోస్ట్ వద్ద సోమవారం ఈ ఘటన చోటుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి మత్తులో ఉన్న అక్రమ్ఖాన్ పాతకక్షల ను దృష్టిలో పెట్టుకొని ఫిరోజ్ఖాన్ అనే వ్యక్తి గొంతుపై కత్తితో పొడిచాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పరిస్థితి విషమించి ఒకరి మృతి గాంధారి(ఎల్లారెడ్డి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని పేట్సంగెం గ్రామానికి చెందిన సాలె కిషన్(50) చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆదివారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన కిషన్ను బైక్ ఢీకొట్టడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్కు తరలించారన్నారు. కిషన్ సోమవారం ఉదయం మృతి చెందాడని తెలిపారు. మృతుడి భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బాన్సువాడ : పట్టణంలోని కల్కి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ తెలిపారు. సోమవారం ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని జాలర్ల సాయంతో బయటికి తీయించి ఆస్పత్రికి తరలించామన్నారు. కుంటలో మరో మృతదేహం.. ఎడపల్లి(బోధన్): మండలంలోని శాటాపూర్ గేట్ వద్ద ఉన్న కుంటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైనట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. మృతుడి వయస్సు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లు ఉంటుందన్నారు. నలుపు రంగు షర్టు, నలుపు రంగు ప్యాంట్ ఉన్నాయన్నారు. -
అకాల వర్షం.. అతులాకుతలం
● నీటిలో కొట్టుకుపోయిన ధాన్యం ● నేలకొరిగిన భారీచెట్లు పిట్లం(జుక్కల్) : మండల కేంద్రంలో, చిల్లర్గి, సిద్దాపూర్, రాంపూర్, గౌరారం, కుర్తి తదితర గ్రామాల్లో సోమవారం కురిసిన భారీ వర్షంకు వరదనీరు రావడంతో వరిపంట ధాన్యం, జొన్నపంట పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ధాన్యం నీళ్లలో కొట్టుకుపోయింది. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో అధికారులు సిబ్బందికి, సహకార సంఘం అధికారులకు ధాన్యంపై కప్పడానికి కవర్లు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు త్వరగతిన ధాన్యంను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. నిజాంసాగర్లో.. నిజాంసాగర్(జుక్కల్) : నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో సోమవారం సాయంత్రం కురిసిన అకాలవర్షంతో పాటు బలమైన గాలులు, ఉరుములు, మెరుపులకు ప్రజలు అతలాకుతలయ్యారు. ఒక్కసారిగా వచ్చిన గాలులకు చెట్ల కొమ్మలు విరిగి పడటంతో పాటు ఇళ్ల పైకప్పు రేకులు లేచిపడ్డాయి. ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు పోసిన వరిధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యింది. రోడ్లపైన ఆరబెట్టిన ధాటికి ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందారు. రామారెడ్డిలో.. రామారెడ్డి : ఈదురుగాళ్లు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో మండలంలో పలు చోట్ల చెట్లు నేలకొరకగా, ఇనుపరేకులు కింద పడిన ఘటనలు సోమవారం సాయంత్రం రాత్రి చోటుచేసుకున్నాయి. రామారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్లే మార్గంలో భారీ చెట్లు సైతం నేలకొరకగా ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో రామారెడ్డి ఎస్సై విజయ్ కొండ ఆధ్వర్యంలో పోలీసులు శ్రమించి జేసీబీ సాయంతో చెట్లను తొలగించారు. ఏఎస్సై రవీందర్, కానిస్టేబుల్ పవన్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ పరిధిలో.. కామారెడ్డి రూరల్ : మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్లపై రేకులు కొట్టుకుపోయాయి. మిద్దె ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అరగంట పాటు కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దోమకొండలో విద్యుత్ సరఫరా బంద్ దోమకొండ : మండల కేంద్రంలో సోమవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రాగా పిడుగు పడింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. గ్రామంలోని బీబీపేట్ రోడ్డులో అయ్యవారి రామాచారి ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడి చెట్టు మంటలతో పూర్తిగా కాలిపోయింది, పిడుగు పడిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో గండం తప్పింది. మంటలు వస్తున్న విషయం తెలుసుకున్న ఆ ప్రాంతవాసులు కరెంటు అధికారులకు ఫోన్తో సమాచారం అందించడంతో గంట సేపు కరెంటును నిలిపివేశారు. గాలులకు కొట్టుకుపోయిన షెడ్లు పెద్దకొడప్గల్(జుక్కల్) : మండలంలో ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. సోమవారం సాయంత్రం భారీ ఈదురుగాలులకు టీకారం తండాలో 30 రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. ఈ ఏడాది వర్షాల్లేక పంటలు కొంత ఎండిపోగా, మిగితా పంట ఇలా అకాల వర్షానికి వర్షార్పణమైంది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం దాదాపుగా కొట్టుకుపోయింది. లింగంపేటలో.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని వర్షం నీటి నుంచి తీయడానికి రైతులు అవస్థలు పడ్డారు. అధికారులు ధాన్యం తూకం వెంట వెంటనే వేయాలని రైతులు కోరుతున్నారు. వాతావరణలో తరుచూ మార్పులతో ఆరిన ధాన్యం తూకంలో జాప్యం కారణంగా తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అ త్యధిక సంఖ్యలో రైతులు, గల్ఫ్ కార్మికులు ఉంటారని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొ న్నారు. రైతులను బీఆర్ఎస్, బీజేపీలు పట్టించుకోలేదన్నారు. పసుపుబోర్డుపై అర్వింద్ ఉత్తర్వులతో సరిపెట్టారని వ్యాఖ్యానించారు. గల్ఫ్ కార్మికులు మృతి చెందితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. ఈఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్లమెంట్లో ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తానని చెప్పారు. పసుపుబోర్డు నిజామాబాద్లో ఏర్పా టు చేస్తారా లేక అహ్మదాబాద్లో ఏర్పాటు చేస్తా రా స్పష్టం చేయాల్సిన బాధ్యత అర్వింద్, బీజేపీపై ఉందన్నారు. గతంలో పసుపు క్వింటాలు అమ్మితే రైతు తులం బంగారం కోనుగోలు చేసేవారని, ఇప్పడు క్వింటాలు పసుపు ధర రూ. 15వేలు ఉందన్నారు. నిజామాబాద్కు స్మార్ట్ సిటీ తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. -
90 శాతం పూర్తయిన గాలికుంటు టీకాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను 90 శాతం మేర వేసినట్లు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి జగన్నాథచారి సోమవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆవులు, గేదెలు కలిపి 2.60లక్షల పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 2.40లక్షల టీకాలు వేశామన్నారు. మిగతా పశువులకు నెలాఖరు నాటికి టీకాలు వేస్తామన్నారు. రైతులు తమ పశువులకు టీకాలు వేయించాలని ఆయన కోరారు. ఇకనుంచి గేదెలు, ఆవులకు ప్రతి ఆరు నెలలకోసారి గాలికుంటు నివారణ టీకాలు తప్పకుండా వేస్తామన్నారు. కొనసాగుతున్న బీఈడీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం నిర్వహించిన పరీక్షలకు 865 మంది విద్యార్థులకు గాను 826 మంది హాజరుకాగా, 39 మంది గైర్హాజరైనట్లు ఆయన వివరించారు. అకాల వర్షానికి లింగంపేట కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం -
ఆర్టీసీ డ్రైవర్పై ఉపాధ్యాయుడి దాడి
కామారెడ్డి టౌన్: ఆపమన్న చోట బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్పై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పిడిగుద్దులతో దాడి చేసిన ఘటన సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ నుంచి కామారెడ్డి రూట్ ఆర్టీసీ బస్సులో ఐండ్ల శ్రీనివాస్ డ్రైవర్గా, కండక్టర్గా విమల విధులు నిర్వహిస్తున్నారు. అదే బస్సు లో ప్రయాణించినసదాశివనగర్ మండలం యా చారం తండాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లకావత్ శ్రీనివాస్ కామారెడ్డి పట్టణ సమీపంలోని పాత కలెక్టరేట్ వద్ద బస్సు ఆపాలని కండక్టర్ను కోరాడు. కొంచం ముందుకు వెళ్లాక బస్సు ఆపడంతో ఆగ్రహంతో ఉపాధ్యాయుడు ప్రయాణికుల చూ స్తుండగా డ్రైవర్పై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి చేసాడు. అడ్డు వచ్చిన మహిళ కండక్టర్ను బూతు పురాణంతో దూషించాడు. ప్రయాణి కులు అడ్డువచ్చినా వినలేదు. దీంతో డ్రైవర్ అలాగే బస్సు ను కామారెడ్డి బస్టాండ్ వరకు తీసుకెళ్లారు. ఈ క్ర మంలో ప్రయాణికులంతా దాడి చేసిన వ్యక్తిని బ స్టాండ్లో నిలదీసారు. తప్పంతా నీదేనని కొంద రు ప్రయాణికులు ఆ టీచర్పై చేయి చేసుకున్నారు. తనను అనరాని మాటలతో దూషించాడని మహిళ కండక్టర్ రోదిస్తూ ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దాడి చేసిన వ్యక్తి గాంధారి మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నా డు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. బస్సు ఆపనందుకు పిడిగుద్దులు అడ్డు వచ్చిన మహిళా కండక్టర్పై బూతుపురాణం నిందితుడిపై చేయి చేసుకున్న ప్రయాణికులు -
ఎయిర్ఫోర్స్ క్యాప్స్ అందజేత
కామారెడ్డి అర్బన్ : విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించడానికి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైందని ఎయిర్ఫోర్స్ అధికారులు సందీప్, అనిల్ అన్నారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఆర్కే డిగ్రీ కళాశాలలో సోమవారం ఎయిర్ ఫోర్స్, అగ్నివీర్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ఎయిర్స్ ఫోర్స్ అధికారులు నాలం సందీప్, అనిల్ గోస్వామిలు ఎయిర్ ఫోర్స్ క్యాప్, బ్రోచర్ను అందజేసి అవగాహన కల్పించారు. ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ రంగాల్లో ఉద్యోగాలు పొందేందుకు ప్రాథమికంగా ఎన్సీసీ విద్యార్థులకు అదనపు అర్హతగా కలిసివస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కే.విజయ్కుమార్, క్రీడలు, యువజన జిల్లా అధికారి వై.దామోదర్రెడ్డి, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ ఎం రామస్వామి, సమన్వయకర్త ఎం చంద్రకాంత్, అధ్యాపకులు అనిల్కుమార్, చంద్రశేఖర్, ఆర్కే సీఈవో జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎంకు స్వాగతం పలికిన చైర్పర్సన్ కామారెడ్డి టౌన్ : నిజామాబాద్లో సోమవా రం జరిగిన కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డిని మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ సభలో సీఎంను శాలువాతో సత్కరించారు. కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ స్వాగతం పలికా రు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవాలి కామారెడ్డి టౌన్ : దివ్యాంగులు ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞా న్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపకుడు చిప్ప దుర్గాప్రసాద్ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వచ్చే నెల 13వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్ దివ్యాంగుల కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పించిందన్నారు. 270 సెల్ఫోన్ల రికవరీ బాన్సువాడ : బాన్సువాడ పోలీస్టేషన్ పరిధిలో బాధితులు పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు. పోలీస్టేషన్ పరిధిలో ఇప్పటివరకు 600 పైగా సెల్ఫోన్లు పోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారని, అందులో ఇప్పటి వరకు 270 సెల్ఫోన్లను రికవరీ చేశామని ఆయన అన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాప్ ద్వారా చోరీకి గురైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సెల్ఫోన్ల రికవరీకి కృషి చేసిన సీఈఐఆర్ ఆపరేటర్ రాజేష్ను సీఐ అభినందించారు. -
రాయిని ఢీకొన్న బైక్.. ఒకరి మృతి
● ఆరబోసిన ధాన్యం కుప్ప వద్ద ఘటన నవీపేట: రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పపక్కన పెట్టిన రాయిని బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. నవీపేట–నాగేపూర్ మధ్య బాసర రోడ్డుపై ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై యాదగిరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాగేపూర్కు చెందిన నేతి సాయిలు(40) తన ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్పై నవీపేటకు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పకు అడ్డుగా పెట్టిన రాయిని ఢీకొట్టి బైక్ అదుపుతప్పింది. ఈ ఘట నలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్ద రు స్నేహితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యా రు. మృతుడికి భార్య వసంత, ఆరేళ్ల కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. కామారెడ్డి క్రైం: గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో తాడ్వాయికి చెందిన మర్రి సాయిలు(40) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లా కేంద్రం పరిధిలోని పొందుర్తి శివారులో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సాయిలు పని నిమిత్తం ఆదివారం సాయంత్రం బైక్పై భిక్కనూరుకు వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున తిరిగి వెళ్తుండగా, పొందుర్తి సమీపంలోని లక్ష్మీనగర్తండా వద్ద వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిజామాబాద్ ఎంపీ స్థానం సంఖ్య ‘4’
మోర్తాడ్(బాల్కొండ): వాహనాలను రిజిస్ట్రేషన్ చేస్తే నంబర్లను కేటాయిస్తారు, విద్యార్థులు స్కూల్, కళాశాలల్లో అడ్మిషన్ తీసుకుంటే అడ్మిషన్ నంబర్ ఇస్తారు. అలాగే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు కూడా క్రమ సంఖ్య అంటూ ఒకటి ఉంటుంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం క్రమ సంఖ్యను 4గా ఎన్నికల కమిషన్ గుర్తించింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగింది. అప్పటి వరకు నిజామాబాద్ స్థానం సంఖ్య 34గా పరిగణించారు. పునర్విభజన అనంతరం నిజామాబాద్ పార్లమెంట్నియోజకవర్గం సంఖ్య సింగిల్ డిజిట్లోకి మారింది. 1957లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఆవిర్భవించిన సమయంలో అప్పుడు కేటాయించిన సంఖ్య 29గా ఉండేది. 1962లో నియోజకవర్గాల పునర్విభజన జరగగా అప్పుడు 35గా నమోదైంది. 1967లో మరోసారి నియోజకవర్గాల పునిర్వభజన జరిగింది. అప్పట్లో క్రమ సంఖ్యను 34 కాగా, 2004 వరకు అందే సంఖ్య కొనసాగింది. 2009లో నియోజకవర్గాల పునిర్వభజన జరగడంతో క్రమ సంఖ్య సింగిల్ డిజిట్లోకి మారింది. ఉమ్మడి రాష్ట్రంలోనే నిజామాబాద్ ఎంపీ స్థానం సంఖ్య 4గా ఉండగా తెలంగాణ ఆవిర్భావం తరువాత కూడా ఇదే సంఖ్యను లెక్కలోకి తీసుకున్నారు. భవిష్యత్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితేనే క్రమ సంఖ్య మారే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికార యంత్రాంగం తెలిపింది. గతంలోని క్రమ సంఖ్య 34 పునర్విభజనతో మారిన నంబర్ -
త్రుటిలో తప్పిన ప్రమాదం
డిచ్పల్లి: ధాన్యం బస్తాల లోడ్తో వెళ్తున్న లారీ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట సోమవారం సాయంత్రం బోల్తాపడింది. ఓవర్ లోడ్ కారణంగా లారీ ఎడవవైపు ఒరిగి బోల్తాపడింది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న వారిపై ధాన్యం బస్తాలు పడకపోవడంతో ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్ అద్దాన్ని పగులగొట్టుకుని క్యాబిన్లో నుంచి బయటకు వచ్చాడు. సిరికొండ మండలం చీమన్పల్లిలో ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వడ్ల బస్తాలను లోడ్ చేసుకుని నిజామాబాద్ శివారులోని రైస్మిల్లుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తులో ఉన్న పోలీసులు సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలు క్రమబద్ధీకరించారు. ఐడీసీఎంఎస్ సిబ్బందితో మాట్లాడి మరో లారీని రప్పించి ధాన్యం బస్తాలను తరలించారు. -
రైతులు అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి క్రైం: వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ సూచించారు. సోమవారం సాయంత్రం ఆయన జిల్లాల అదనపు కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వివిధ ప్రాంతాలలో రాగల మూడు రోజులలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. వర్షాలకు ధాన్యం తడిచినా రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. తడిచిన ధాన్యాన్ని ఎండబెట్టిన అనంతరం కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి ధాన్యం తడిసిపోకుండా చూసుకోవాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్లో కామారెడ్డి నుంచి అదనపు కలెక్టర్ చంద్రమోహన్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నిత్యానంద, డీఏవో భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ -
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి
● ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్రెడ్డి మద్నూర్(జుక్కల్) : పార్లమెంట్ ఎన్నికలను అధికారులు ప్రశాంతంగా జరిగేటట్లు చూడాలని జహీరాబాద్ పార్లమెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యలయంలో సోమవారం నియోజికవర్గ తహసీల్దార్లు, సెక్టోరియల్ అధికారులతో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి నట్లుగా ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు సక్రమంగా నిర్వహించాలని ఆయన సిబ్బందికి పేర్కొన్నారు. ఆయా మండలాల పరిధిలో ఉన్న తహసీల్దార్లు, సెక్టోరల్ అధికారులు కలిసి బూత్ లెవల్ అధికారులతో సమన్వ యం చేసుకోవాలని చెప్పారు. ఒక్కో సెక్టార్కు ఉ న్న పోలింగ్ స్టేషన్లలో సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణపై ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త వ హించాలని విధుల్లో నిర్లక్ష్యం పనికిరాదన్నారు. త హసీల్దార్లు ముజీబ్, సురేష్, వేణు, భిక్షపతి, రేణుక, దశరథం, క్రాంతికుమార్, డిప్యూటీ తహసీల్దార్ భరత్, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ విజయ్, ఆర్ఐ శంకర్, ఎన్నికల సిబ్బంది పాల్గోన్నారు. -
జీవన్రెడ్డే వ్యవసాయ మంత్రి!
ఖలీల్వాడి: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డిని గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడే ఇండియా కూటమి ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయ మంత్రిని చేసే బాధ్యత నాదేనని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. కేంద్ర మంత్రిగా పసుపుబోర్డు తీసుకువస్తారని పేర్కొన్నారు. ఒకవేళ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే పోరాటం చేసి పసుపు బోర్డు తెస్తారన్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన జనజాతర సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఓటములు గెలుపునకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు. కేసీఆర్ కొడంగల్లో కక్ష గట్టి వందల మంది పోలీసులతో అరెస్టు చేసి తనను అణగదొక్కడానికి ప్రయత్నించినట్లు గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా ఓటమి చెందిన మూడునెలల్లోనే మల్కాజ్గిరిలో పోటీచేసి గెలుపొందానన్నారు. సమస్యలపై పార్లమెంట్ పోరాటం చేయడంతో రాహుల్గాంధీ తనను పీసీసీ అధ్యక్షుడి చేశారని తెలిపారు. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో జీవన్రెడ్డి ఓటమి చెందారని పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందుతారని, దీంతో కేంద్రమంత్రి పదవి లభిస్తుందన్నారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని.. 2014 ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపిస్తే వంద రోజుల్లో నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని కవిత హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వరి, ఎర్రజొన్న, పసుపు పంటకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పి ఐదేళ్లు మోసం చేశారన్నారు. దీంతో 178 మంది రైతులు 2019 ఎన్నికల్లో పోటీ చేసి కవితను ఓడించారని పేర్కొన్నారు. అప్పుడు ఎంపీగా అర్వింద్ను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపుబోర్డు తీసుకువస్తానని బాండ్పేపర్ రాసిచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు పసుపు బోర్డు ఏర్పాటు చేయకుండా ఆయన కూడా రైతులు మోసం చేశారన్నారు. ప్రధాని బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పినా.. ఎక్కడ ఏర్పాటు చేస్తామనే స్పష్టత ఇవ్వలేదన్నారు. స్పైసిస్ బోర్డు ఏర్పాటు చేసి.. పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మరో కొత్త నాటకానికి తెర తీశారని విమర్శించారు. తమను నిర్లక్ష్యం చేసిన వారికి రైతులు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్వయంగా రైతు అయిన జీవన్రెడ్డి గెలిపిస్తే రైతాంగం సమస్యలను పరిష్కరిస్తారని.. అందుకోసం ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. పంజాబ్, హర్యానా రైతులు కేంద్రం తెచ్చిన నల్లచట్టాలపై 16 నెలలపాటు పోరాటం చేశారని గుర్తు చేశారు. దీంతో కేంద్రం చట్టాలపై వెనక్కి తగ్గిందన్నారు. అంతటి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం గల రైతులు ఈ ప్రాంత రైతులని పేర్కొన్నారు. ఇందూరు రైతులకు పంటలు ఎలా పండించాలో తెలుసునని.. అలాగే రైతులను పట్టించుకోని పార్టీలకు ఎలా వాతలు పెట్టాలో కూడా తెలుసునన్నారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం నిజాం షుగర్ ఫ్యాక్టరీని సెప్టెంబర్ 17లోపు తెరిపిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఇందుకోసం సబ్ కమిటీ వేశామని.. మంత్రి శ్రీధర్బాబు రైతులను కలిసి మాట్లాడారని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఫ్యాక్టరీలను తెరిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశం డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, ఆడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, కాంగ్రెస్ నియోజవర్గ ఇన్చార్జిలు రవీందర్రెడ్డి, వినయ్కుమార్రెడ్డి, సునీల్రెడ్డి, నర్సింగ్రావు, మాజీ ఎమ్మెల్సీలు రాజేశ్వర్రావు, అరికెల నర్సారెడ్డి, ఆకు ల లలిత, కాంగ్రెస్ నగరాధ్యక్షుడు కేశవేణు, కాంగ్రెస్ నేతలు బాడ్సిశేఖర్ గౌడ్, డాక్టర్ కవితారెడ్డి, ఏబీ శ్రీనివాస్రెడ్డి(చిన్నా), పూర్ణచందర్రావు, సాయిరెడ్డి పాల్గొన్నారు.తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ రైతాంగ సమస్యలపై పోరాడేందుకే నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు షుగర్ ఫ్యాక్టరీ పేరిట కవిత రైతులను మోసగించారు ఎంపీ అర్వింద్ పసుపుబోర్డు హామీని నెరవేర్చలేదు పసుపుబోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత లేదు రైతులను మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాలి జనజాతర సభలో సీఎం రేవంత్రెడ్డి‘నా తెలంగాణ, కోటి రతనాల వీణ’ అని దాశరథి ఇందూరు జైలు గోడలపై రాసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పో షించిన నారాయణరెడ్డిది కూడా ఈ గడ్డనేన్నా రు. తెలంగాణ ఉద్యమం కోసం బంగారం అమ్మి ఇచ్చిన సదాలక్ష్మి ఈ గడ్డకు చెందిన మహిళనేనన్నారు. ఈశ్వరీబాయి, అర్గుల్ రాజారాం లాంటి నేతలు ఈ ప్రాంతానికి చెందినవారేనన్నారు. జాతీయస్థాయిలో రాణిస్తున్న మలావత్ పూర్ణ, బాక్సర్ నిఖత్జరీన్ కూడా నిజామా బాద్వాసులేని చెప్పారు. -
బీజేపీ వైఫల్యాలను వివరించాలి
రాజంపేట : బీజేపీ వైఫల్యాలు, బీబీపాటిల్ అక్రమాలు ప్రజలకు తెలియజేయాలని ఎల్లారెడ్డి ఎమ్మె ల్యే మదన్మోహన్ కార్యకర్తలను ఆదేశించారు. సోమవారం ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండలంలోని ఆయా గ్రామాల అధ్యక్షులతో, యూత్ అధ్యక్షులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. ప్రతి ఒక్కరితో నేరుగా రివ్యూ చేసి ఇప్పటిదాకా ఎన్ని ఓట్లు కాంగ్రెస్కు వచ్చేలా కృషి చేశారనే విషయాన్ని తెలుసుకున్నారు. మండల స మావేశాల్లో చెప్పిన పనులను పూర్తి చేయని వారిని తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తీసుకురావాలన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సుమారుగా తమ వ్యక్తి గతంగా 50 నుండి 60 ఓట్లు తమ బాధ్యతగా తీసుకొని ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సూ చించారు. అనంతరం బస్వానపల్లి, ఆర్గోండ, కొండాపూర్, గుండారం, సిద్ధాపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి షెట్కార్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రణీత్ రెడ్డి, యూత్ అధ్యక్షులు, జనరల్ సెక్రటరి సంతోష్ రెడ్డి తదితరులున్నారు. -
మూలమలుపుల పరిశీలన
కామారెడ్డి క్రైం : తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కామారెడ్డి మండలం ఉగ్రవాయి ప్రాంతంలోని మూలమలుపులను శుక్రవారం పోలీసులు పరిశీలించారు. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై రూరల్ పోలీసులు అర్అండ్బీ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ రామన్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులను స్పీడ్ లిమిట్ బోర్డులను, తెల్లరంగు గీతలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్అండ్బీ డీఈఈ, ఎస్ఐ రాజు, సిబ్బంది ఉన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం పెద్దకొడప్గల్(జుక్కల్) : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కరించడమే తమ లక్ష్యమని (సీజీఆర్ఎఫ్) చైర్మన్ రామకృష్ణ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక విద్యుత్శాఖ ఉప కేంద్ర కార్యాలయ ప్రాంగణంలో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. బిచ్కుందకు చెందిన విద్యుత్ వినియోగదారులు విద్యుత్ తీగలు చెట్లకు తాకడం వల్ల సరఫరా అంతరాయం ఉంటుందని వినతి పత్రాన్ని అందించారు. వినతి పత్రాన్ని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని, విద్యుత్ మీటర్ రీడింగ్లను సకాలంలో తీయాలని విద్యుత్శాఖ అధికారులకు (సీజీఆర్ఎఫ్) చైర్మన్ రామకృష్ణ సూచించారు. ఫోరంలో కేసులు వేయడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదన్నారు. రైతులందరూ మోటార్లకు తప్పనిసరిగా కెపాసిటర్లు బిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ రామేశ్వరరావు, ఏడీఈ బాలాజీ, పిట్లం ఏఈ బుజ్జి బాబు, నిజాంసాగర్ ఏఈ లక్ష్మణ్, స్థానిక ఏఈ సాయినాథ్ గౌడ్ పాల్గొన్నారు. గ్రోమోర్ దుకాణానికి తాళం బాన్సువాడ : బీర్కూర్ గ్రోమోర్ దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయిన రైతులు శుక్రవారం గ్రోమోర్ దుకాణానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. బీర్కూర్కు చెందిన పలువురు రైతులు గ్రోమోర్ దుకాణంలో ఆర్కే విత్తనాలు కొనుగోలు చేసి యాసంగి పంట సాగు చేశారు. పంట కోత దశలో పూర్తిగా పొల్లు పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతుల పంట పొలాలను పలువురు శాస్త్రవేత్తలు సందర్శించి నకిలీ విత్తనాలతోనే పంట నష్టం వాటిల్లిందని నివేదికలు అందించారు. నష్టపోయిన రైతులకు గ్రోమోర్ ఆధ్వర్యంలో నష్టపరిహారం అందిస్తామని దుకాణం యజమానులు హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు ఏ ఒక్కరికి నష్టపరిహారం అందించకపోవడంతో రైతులు గ్రోమోర్ దుకాణానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించే వరకు దుకాణాన్ని మూసి ఉంచాలని రైతులు పేర్కొన్నారు. బీర్కూర్లో సుమారు 500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. -
టీచర్లు అంకితభావంతో పని చేయాలి
మాచారెడ్డి : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. శుక్రవారం పాల్వంచ మండలం భవానిపేట, భవాని పేటతండా పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. పాఠశాలల్లోని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల తలుపులు, కిటికీలు, విద్యుత్ కనెక్షన్, పాఠశాల భవనాల పరిస్థితి ముఖ్యంగా మూత్ర శాలల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తూ గుణాత్మక విద్యను అందించాలని కోరారు. ఎంపీడీవో గోపి బాబు, ఎంఈవో ఎల్లయ్య ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ బీబీపేట : మండల కేంద్రంలోని యాడారం గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మంజూరైన నిధులతో పాఠశాలలో పనులను పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలలో తాగునీరు, టాయిలెట్స్, మౌళిక వసతులను పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. ఆయన వెంట గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాద్యాయులు ఉన్నారు. -
చెరువులో పడి యువకుడి మృతి
మాచారెడ్డి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్సై రామేశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గజ్జనాయక్ తండాకు చెందిన లక్ష్మణ్(36) గురువారం బహిర్భూమికని వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. మండల కేంద్రంలోని ఊర చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వివాహిత..ఎడపల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మంగళ్పాడ్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై వంశీచందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోలెపల్లి ఇంద్రజ(48)కు ముగ్గురు సంతానం. వీరు ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతక్రుదయం ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఇంద్రజ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
రూ. 60వేల నగదు పట్టివేత
భిక్కనూరు: మండల కేంద్రంలోని టోల్ప్లాజా వద్ద పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో హైదరాబాద్కు చెందిన చందర్ హరిప్రసాద్ వాహనాన్ని తనిఖీ చేయగా రూ. 60వేలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. డ్రంకన్ డ్రైవ్లో ముగ్గురికి జైలుఖలీల్వాడి: డ్రంకన్ డ్రైవ్లో ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్షను జడ్జి సయ్యద్ ఖదీర్ విధించినట్లు ఏసీపీ నారాయణ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 17 మందిని శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా జడ్జి 14 మందికి రూ. 17,600 జరిమానా విధించగా ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్షను విధించినట్లు పేర్కొన్నారు. యువతి అదృశ్యం ధర్పల్లి: మండల కేంద్రానికి చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. శుక్ర వారం కుటుంబ సభ్యులు నిద్రలేచే సరికి అమ్మాయి తన గదిలో కనిపించకపోవడంతో కుటుంబీకులు పలు చోట్ల గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పిడుగుతో ఐదుగురికి గాయాలుమాక్లూర్: మండలంలోని ధర్మారంలో శుక్రవారం సాయంత్రం చలి పిడుగు తగిలి ఐదుగురికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో గ్రామ శివారులో ఆరబెట్టిన ధాన్యంపై పట్టాలు కప్పేందుకు వెళ్లిన సుంకరి ధర్మారం, సుంకరి నారాయణ, బన్నీ, సాకలి శంకర్పై చలిపిడుగు పడింది. దీంతో వారికి తిముర్లు వచ్చి అపస్మారకస్థితికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు వారికి చికిత్స నిమిత్తం అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రెండో రోజు ఏడు నామినేషన్లు
సుభాష్నగర్: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి రెండోరోజు శుక్రవారం ఆరుగురు అభ్యర్థులు మొత్తం ఏడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెండు సెట్ల నామినేషన్లు వేశారని పేర్కొన్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. వీరితోపాటు బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా దేవతి శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి శ్రీనివాస్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కండెల సుమన్, స్వతంత్ర అభ్యర్థిగా రాగి అనిల్, నామినేషన్ పత్రాలు సమర్పించారని రిటర్నింగ్ అధికారి వివరించారు. కాగా రెండు రోజులకు మొత్తం మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్ బీఆర్ఎస్ బాజిరెడ్డి గోవర్ధన్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలుచేశారు. బిగాల గణేశ్గుప్తా కారు నడపగా, అభ్యర్థి బాజిరెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ ఎంపీ సురేశ్రెడ్డితో కలిసి ఒక సెట్ నామినేషన్ వేశారు. మరో సెట్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీ వన్రెడ్డితో పాటు జగిత్యాల్ ఎమ్మెల్యే సంజయ్ కు మార్, బోధన్ బీఆర్ఎస్ ఇన్చార్జి అయేషా ఫాతిమాతో కలిసి దాఖలు చేశారు. బాజిరెడ్డి కుటుంబ సభ్యులతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నా.. ఈ సీ నిబంధనల మేరకు వారు బయటే వేచి ఉన్నారు. పసుపు రైతులతో కలిసి బీజేపీ అభ్యర్థి బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా.. మొత్తం 8 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు బీజేపీ అభ్యర్థి, ఎంపీ అర్వింద్ ధర్మపురి పసుపు రైతులతో కలిసి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మెడలో పసుపు కొమ్ముల దండ, స్వయంగా కారు నడుపుతూ అర్వింద్ నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. పసుపు రైతుల సమక్షంలో, వారి ఆశీర్వాదంతో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. పసుపు రైతులు సమకూర్చి ఇచ్చిన డబ్బుతో నామినేషన్ డిపాజిట్ చెల్లించానని, చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైతులు పండించే పసుపు, వరి, మామిడి, మొక్కజొన్న, చెరుకు, ఇతరత్రా పంటలకు విత్తనాల నుంచి మార్కెటింగ్ సౌకర్యం వరకూ అన్ని చర్యలకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయా పంటల ప్రాసెసింగ్, ప్యాకేజీ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపడతామని, స్వయం ఉపాధి మహిళలకు వాల్యూయాడెడ్ సర్వీస్లో భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. దేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా మారుస్తామని, తద్వారా యువతకు ఉపాధి పెరుగుతుందని తెలిపారు. గల్ఫ్ వలసలు ఆపుతామని, అక్కడ ఉన్న వారందరికీ ఉపాధి కల్పించి వాపస్ వచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో పసుపు రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి) : విద్యుత్ శాఖ పరిధిలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో ఎస్ఈ రమేశ్బాబు సూచించారు. శుక్రవారం ఆయన లింగంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, గాంధారి మండలాల డివిజన్ స్థాయి ట్రాన్స్కో ఉద్యోగుల సమావేశంలో పాల్గొని అవగాహన కల్పించారు. ఎన్పీడీసీఎల్ డీఎండీ ఆదేశాల మేరకు శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మండల, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా జరిగే విధంగా ఉద్యోగులు చూ డాలని ఆదేశించారు. అలాగే ట్రాన్స్ఫార్మర్లు తరు చూ కాలిపోకుండా జాగ్రత్తలు చేపట్టాలని వివరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నా రు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈలు వెంకట్రంగ య్య, గణేష్, ఏడీలు సుదర్శన్రెడ్డి, తిరుపతిరెడ్డి, ఆ రుగురు ఏఈలు, లైన్ఇస్పేక్టర్లు, లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
బీజేపీ ఇంటింటి ప్రచారం
పిట్లం(జుక్కల్) : మండలంలోని కంభపూర్, బ్రా హ్మణపల్లి గ్రామాల్లో బీజేపీ పార్టీ నాయకులు శు క్రవారం ఇంటింటికి తీరుగుతూ ప్రచారం నిర్వహించారు. బీజేపీ పార్టీ నాయకులు జగదీష్ మాట్లాడు తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకు ఓ టు వేసి ఎంపీగా బీబీ పాటీల్ను అత్యధిక మెజా ర్టీతో గెలిపించాలని కొరారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు అభినయ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వడ్ల శివ, నాయకులు ఉన్నారు. బీజేపీలో పలువురి చేరిక నిజాంసాగర్(జుక్కల్) : మండల కేంద్రంలోని బంజరాహిల్స్ కాలనీకి చెందిన పలువురు బీఆర్ఎస్నాయకులు, కార్యకర్తలు శుక్రవారం బీజేపీలో పార్టీలో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు మేకల నరేశ్ తదితరులు తెలిపారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వరికోత మిషన్ను తరలిస్తున్న డీసీఎం బోల్తా
కారు, బైక్ ఢీ.. భర్త మృతి
ఒకదానికొకటి ఢీకొన్న మూడు కార్లు
దేవుడి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్
మట్టి తరలిస్తున్న వారిపై కేసు
అధిక వడ్డీ ఆశచూపి మోసం
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
ఓటేసి వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
24న కృషి విజ్ఞాన కేంద్రంలో వరి విత్తన మేళా
తప్పక చదవండి
- ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- సందీప్ లమిచానే శిక్ష రద్దు.. వరల్డ్కప్ జట్టులో చోటు?
- పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు
- అందుకే ఓడిపోయాం!.. వరుస వైఫల్యాలు.. ఇకనైనా: సంజూ
- ఏపీలో ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
- సన్నీ లియోన్ బర్త్డేను ఎందుకు జరుపుకున్నారో చెప్పిన యువకులు
- Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
- తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
- ‘హలో అప్పారావ్.. ఏంటి పరిస్థితి!’
Advertisement