101 నదులపై జలమార్గం అభివృద్ధి: గడ్కరీ
ఖమ్మం: దేశంలోని 101 నదులపై జలమార్గం అభివృద్ధి చేస్తామని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. భద్రాచలంలో గోదావరి రెండవ బ్రిడ్జి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జలమార్గానికి సంబంధించి రానున్న పార్లమెంటు సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
దేశంలో సిమెంటు నిల్వలు బాగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. రోడ్ల నిర్మాణానికి సిమెంటు వినియోగించమని తెలంగాణ రాష్ట్రానికి విజ్ఞప్తి చేశారు. బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్తాపన చేసిన అనంతరం మంత్రి భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.