ఇద్దరిని బలిగొన్న క్రేన్
తుంగతుర్తి : నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో తవ్వకం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగి ఇద్దరు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సయ్య అనే రైతుకు చెందిన పొలంలోని బావిలో సోమవారం మధ్యాహ్నం క్రేన్తో పూడిక తీస్తున్నారు.
ఆ సమయంలో బావి లోపలి నుంచి కూలీలు థాంప్సన్, సురేష్లు క్రేన్ బకెట్లో ఎక్కి బయటకు వచ్చే క్రమంలో బకెట్ ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో థాంప్సన్, సురేష్ తలకు బలమైన గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.