ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
బోథ్: అసెంబ్లీ ముట్టడిలో బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి, వారిని రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు. దీంతో ఆ పార్టీ స్థానిక నాయకులు శనివారం బస్టాండ్ ఆవరణలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మతపరమైన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ప్రభుత్వం తన వైఖరిని ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. అసెంబ్లీ ముట్టడిలో అరెస్టయిన బీజేపీ, బీజేవైఎం నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ పసుపుల సంతోశ్, నాయకులు మంత్రి ప్రకాశ్, ఎస్.కె.రాజ్మహమ్మద్, ప్రశాంత్, శేఖర్, స్వామి పాల్గొన్నారు.