రామగుండంలో ప్రారంభమైన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్
జ్యోతినగర్: కరీంనగర్ జిల్లా రామగుండంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ నియామక ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి సంబంధించి తొలిరోజు మహిళా అభ్యర్థులకు శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎత్తు, బరువులను పరిశీలించడంతోపాటు పరుగుపందెం నిర్వహిస్తున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరయ్యారు.
దేశవ్యాప్తంగా 62,500 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా, సౌత్జోన్ పరిధిలో కరీంనగర్లో ఇవి జరుగుతున్నాయి.