ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు: ఒకరు మృతి


మెదక్ జిల్లా చినకోడూరు మండలం రామునిపట్నంలో ఆదివారం ఓ బస్సు ఇంట్లోకి దూసుకువెళ్లింది. ఆ ప్రమాదంలో ఇంటి యజమాని అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్తోపాటు మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనపై వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అధిక వేగం కారణంగానే ఆ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top